అన్వేషించండి

Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan Latest News:చదువుకున్న రోజుల్లో పవన్ పేరు చెబితేనే తనను ర్యాగింగ్ చేశారని నంద్యాల ఎంపీ గుర్తు చేసుకున్నారు. పవన్ పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు.

Pawan Kalyan Latest News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్నూలు  జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో పాల్గొన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సందర్భంలో పవన్ పేరు చెబితే తనను ర్యాగింగ్ చేశారని దెబ్బకు ఏడాది ఆ పేరు ఎత్తలేదని చెప్పారు. 

కర్నూలు జిల్లా పూడిచర్లలో పర్యటించిన పవన్ కల్యాణ్‌ అక్కడ ఫామ్‌పాండ్స్‌కు భూమి పూజ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల ఫామ్‌పాండ్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి శబరి గతంలో తనకు ఎదురైన అనుభవాలు గురించి చెప్పారు. ఆమె మాట్లాడేందుకు వచ్చినప్పుడు పవన్ అభిమానులు గోల గోల చేశారు. వారిని కంట్రోల్ చేయడానికి తను కూడా పవన్ ఫ్యాన్ అని చెప్పుకున్నారు. తాను ఎంబీబీఎస్‌ చదువుతున్న టైంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు. 

Image

ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో తాను కాలేజీ వెళ్లినప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ చేశారని శబరి తెలిపారు. కొందరు సీనియర్స్ వచ్చి మీ ఫేవరెట్‌ హీరో ఎవరని అడిగారన్నారు. తాను తడుముకోకుండా పవన్ కల్యాణ్ అని చెప్పినట్టు వెల్లడించారు. మరికొందరు వచ్చి నీవు ఎలా ఫ్యాన్ అవుతావని తామే నిజమైన ఫ్యాన్స్ అని గొడవ పెట్టుకున్నట్టు గుర్తు చేసుకున్నారు. ఆ రోజు జరిగిన గొడవతో తాను ఏడాది పాటు పవన్ పేరు ఎత్తలేదని అన్నారు. అంతలా తనను భయపెట్టారని గుర్తు చేసుకున్నారు శబరి. దీంతో అక్కడి వారంతా నవ్వుకున్నారు. 

Image

ఈ కార్యక్రమంలోనే పవన్ వేదికపై చేరుకునే సరికి ఓ పిల్లాడు రెడ్ టవల్‌తో కనిపించాడు. ముద్దుగా ఉన్న ఆ పిల్లాడని పైకి పిలిచి ఎత్తుకున్నారు. ఆ బాలుడిని భుజంపై కూర్చోపెట్టుకొని దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Image

ఫామ్‌ పాండ్స్‌ భూమి పూజ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కల్యాణ్‌... విజయంలోనే మనుషులను లెక్కించడం సరికాదన్నారు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నరేది పోల్చుకుంటామన్నారు. అలా కష్టాల్లో నిలబడినందుకే ప్రజలు కూటమి పార్టీలను గెలిపించారన్నారు. ఈ విజయం యువకులకు, మహిళలకు దక్కుతుందన్నారు. గెలిచిన ఈ కొద్ది నెలల్లోనే కర్నూలు జిల్లాలో రూ.75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశారమని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద 98 శాతం రోడ్ల నిర్మాణం పూర్తైనట్టు పేర్కొన్నారు.  

Image

వచ్చే వర్షాకాలం నాటికి ఫామ్‌ పాండ్స్ పూర్తి అయితే నీరు నిల్వ అవుతుందన్నారు పవన్. ఇలా ఎక్కడికక్కడ నీరు నిల్వ చేసుకుంటే నీటి కొరతే లేకుండా చేయవచ్చని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయితీ సహా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. వాటిని సరి చేస్తూనే ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. మౌలిక వసతులు కల్పించి వారి సమస్యలు దూరం చేసే ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు. 

Image

క్లిష్టపరిస్థితిల్లో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం ఎంతగానో తోడ్పాటు అందిస్తోందన్నారు పవన్ కల్యాణ్. ఓ వైపు రాష్ట్రంలో పాలన గాడిలో పెడుతూనే పెట్టుబడు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. అదే టైంలో ప్రజలకు చేరాల్సిన పథకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు.  

Image

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget