అన్వేషించండి

Ayodhya Deepotsav 2024 Ram Lalla : ఈ దీపావళికి అయోధ్యలో అద్భుతం..అస్సలు మిస్సవకండి!

Ayodhya Deepotsav 2024: అయోధ్య దీపోత్సవంలో ఈసారి 500 డ్రోన్‌లతో అద్భుతమైన షో ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు , రావణ సంహారం వంటి ఆకృతులు ఆకాశంలో కనిపిస్తాయి. 

Ayodhya Deepotsav 2024...25 Lakh Lamps:  భక్తి, ఆధ్యాత్మికతకు ఆధునికత జోడించి దీపావళి వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఏరియల్ డ్రోన్ షో కూడిన దీపోత్సవ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. 

రామజన్మభూమి , బాలరాముడు కొలువైన అయోధ్యలో దీపావళి సంబరాలు అంబరంలో సెలబ్రేట్ చేయనుంది. ఆకాశవీధిలో కళ్లు మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్లతో కూడిన ప్రదర్శనను 15 నిముషాల పాటు మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ల సాయంతో ప్లాన్ చేసింది. 

ఈ షో లో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, హనుమంతుడి ముద్రలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో లేజర్ లైట్లు, బ్యాగ్రౌండ్ లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. వీటితో పాటూ  రావణ సంహారం, పుష్పక విమానం, దీపోత్సవం, రామ దర్బార్, వాల్మీకి మహర్షి, తులసీదాస్ సహా మరెన్నో అధ్భుతాలను ప్రదర్శించనున్నారు. 

Also Read: అక్టోబరు 29, 30 ఈ రెండు రోజులు సాయంత్రం ఈ దీపం వెలిగించడం మర్చిపోవద్దు!
 
బాలరాముని విగ్రహాన్ని అయోధ్య భవ్య మందిరంలో ప్రతిష్టించిన తర్వాత ఫస్ట్ టైమ్ జరుగుతున్న దీపావళి కావడంతో భారీగా ప్లాన్ చేసింది యూపీ ప్రభుత్వం. ఈ దీపోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా అక్టోబరు 30 న నిర్వహించనున్న కార్యక్రమానికి ముందుగా రిహార్సల్స్ నిర్వహించనున్నారు. రామ్ కి పైడీ వద్ద ఈ షో ఉండబోతోంది. 

మొత్తం  15 ఆకృతుల ప్రదర్శనలో భాగంగా ఈ పనులు పూర్తిచేసేందుకు యానిమేషన్ తో కూడిన స్టోరీబోర్డ్ సిద్ధం చేస్తున్నారు. ఆకాశంలో ప్లే అయ్యే ఆకృతులకు పర్ ఫెక్ట్ గా కాన్సెప్ట్, స్టోరీ, బ్యాగ్రౌండ్ వాయిస్/మ్యూజిక్ , లేజర్ లైట్స్ వర్క్స్ జరుగుతున్నాయ్. కేవలం షో మాత్రమే కాదు.. బాణసంచా కూడా కాల్చనున్నారు.  

Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!

దక్షిణాదిన దీపావళి అంటే శ్రీకృష్ణడు సత్యభామ సమేతంగా నరకాసురిడిని సంహరించినందుకు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఉత్తరాదిన ఇదే వేడుకను రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతా,లక్ష్ణణ సమేతంగా అయోధ్యకు తిరికొచ్చిన సందర్భంగా జరుపుకుంటారు. రామచంద్రుడు అయోధ్యకు వచ్చిన రోజు అమావాస్య కావడంతో ఆ రోజు చీకటిని పారద్రోలేందుకు అయోధ్య వాసులంతా బాణసంచా కాల్చారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ ఏటా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 2017 లో 51 వేల దీపాలు వెలిగించారు. 2019 లో 4.10 లక్షల దీపాలు, 2020 లో 6 లక్షల దీపాలు, 2021 లో 9 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు.  

Also Read: 5 రోజుల దీపావళి వేడుకలో ఏ రోజు విశిష్టత ఏంటి - ఏ రోజు ఏం చేయాలి!

2022 లో సరయూ నదీ తీరంలో ఉన్న రామ్ కీ పైరీలోని ఘాట్‌లలో 17 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు..  గతేడాది (2023) అయోధ్యలో సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కీ పైరిపై 24 లక్షల దీపాలు వెలిగించారు. అనంతరం గ్రాండ్ గా సౌండ్ లైట్ అండ్ షో నిర్వహించారు. సరయూ నదికి ముందుగా హారతి ఇచ్చిన తర్వాత ఈకార్యక్రమం ప్రారంభించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
AP CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
Unstoppable Season 4 - AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ లిక్కర్‌తో హెల్త్ పాడైంది, ఈ రూ.100 మందు బాగుందివీడియో: రూ.50కే కిలో చికెన్, ఇక్కడ అస్సలు తినకండి!!Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desamనటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
AP CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
Unstoppable Season 4 - AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
KTR News: గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
Musi  Politics : రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Embed widget