అన్వేషించండి

UP Crime News: భార్యతో శారీరక సంబంధం ఉందనుకొని వ్యక్తి హత్య - 15 ముక్కలుగా చేసి దారుణం!

UP Crime News: భార్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. అతడిపై పగ తీర్చుకోవాలనుకొని ఇంటికి పిలిచి మరీ దారుణంగా హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని 15 ముక్కలు చేసి పడేసే ప్రయత్నం చేయబోయాడు. కానీ!

UP Crime News: ఓ వ్యక్తికి తన భార్యతో స్నేహం ఉంది. అయితే అది వివాహేతర సంబంధమేమోనని భావించిన భర్త.. అతడిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యకు చెప్పి అతడికి ఫోన్ చేయించి మరీ ఇంటికి రప్పించాడు. ఆపై ఫుల్లుగా మద్యం తాగించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని 15 ముక్కలుగా చేసి మూడు సంచుల్లో వేసి మూట కట్టాడు. ఓ సంచిని తీసుకెళ్లి బయట పడేశాడు. మిగిలినవి కూడా పడేసే లోపే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిందితులను అరెస్ట్ చేసి మృతదేహాన్ని గుర్తించారు. ఆపై పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

అసలేం జరిగిందంటే..?

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో మిలాల్ ప్రజాపతి అనే వ్యక్తి రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా నివసిస్తున్న రాజస్థాన్ లోని కోట్ పుట్లీకి చెందిన అక్షయ్ కుమార్, తన భార్య మధ్య వివాహేతర సంబంధం ఉందని అతను అవమానించాడు. ఈ క్రమంలోనే అతడిపై పగ పెంచుకున్నాడు. ఆ విషయం భార్యకు చెప్పకుండానే.. గురువారం రోజు అతడిని ఇంటికి రమ్మని పిలవాలని భార్యతో చెప్పాడు. ఆమె ఫోన్ చేసి చెప్పడంతో అతడు ఇంటికి వచ్చాడు. అయితే కుమార్తెకు కాలిన గాయాలు కావడంతో చికిత్స కోసం ప్రజాపతి భార్య ఢిల్లీలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే ఇంటికి వచ్చిన అక్షయ్ కుమార్ ప్రజాపతి మద్యం తాగించాడు. 

ఆ తర్వాత రాత్రి వేళ గొడ్డలితో దాడి చేసి అతడిని హత్య చేశాడు. అక్షయ్ మృతదేహాన్ని  15 ముక్కలుగా చేశాడు. వాటిని మూడు బ్యాగుల్లో ఉంచాడు. శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటకు తన రిక్షాలో తీసుకెళ్లి ఖోడా కాలనీ ప్రాంతంలో పడేశాడు. మరోవైపు స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్షయ్ మృతదేహాం ముక్కలు ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. నిందితుడు ప్రజాపతిని గురించి అతడిని అరెస్ట్ చేశారు. అక్షయ్ కుమార్ హత్యలో నిందితుడి భార్య పాత్ర ఉందా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 

గొడవల కారణంగా మూడో భార్యపై దాడి

కుటుంబ కలహాలతో భార్యపై కొడవలితో దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఫిరంగడ్డ ప్రాంతానికి చెందిన రామచంద్రుకి ముగ్గురు భార్యలు. చిన్న భార్య ఎల్లమ్మతో కొంతకాలంగా గొడవలు జరుగుతుంది. శనివారం తెల్లవారు జామున గొడవ జరగడంతో భార్య ఎల్లమ్మపై కొడవలితో దాడి చేశాడు రామచంద్రు. రక్తపు మడుగులో పడిఉన్న తల్లిని చూసిన కూతురు అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి బాధితురాలిని ఎంజీఎం హాస్పటల్ తరలించారు. 

మద్యం మత్తులో తలెత్తిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన చెవ్వల్ల రాజు అనే వ్యక్తి శుక్రవారం ఊళ్లోని ఓ మద్యం షాపునకు వెళ్లి మద్యం సేవిస్తుండగా సాంబరాజు అనే వ్యక్తితో గొడవ తలెత్తింది. ఈ క్రమంలో సాంబరాజు అనే వ్యక్తి రాజుపై దాడి చేయగా తలకు బలమైన గాయలు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. రాజు మృతికి కారణమైన సాంబరాజు ఇంటి ఎదుట రాజు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాజుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Google Pixel 8a Colour: గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
Google Pixel 8a Colour: గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
గూగుల్ పిక్సెల్ 8ఏ కలర్ ఆప్షన్లు లీక్ - ఈసారి నాలుగు కొత్త రంగుల్లో!
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
DC vs GT Match Highlights: 'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
Actor Raghubabu Car Incident: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
Embed widget