అన్వేషించండి

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు

Andhra Pradesh: మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమెపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఓ ఐపీఎస్ ని ఏ2గా చేర్చింది.

Vidadala Rajini: మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినికి ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది.  ఆమె పై అవినీతి నిరోధక శాఖ(ACB) కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఓ ఐపీఎస్ అధికారిని ఏ2గా చేర్చింది. YSRCP హయాంలో  పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలోని విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమాన్యంపై విజిలెన్స్‌ తనిఖీల ముసుగులో బెదిరింపులకు పాల్పడ్డారని.. రూ.2.20కోట్లు అక్రమంగా వసూలు చేశారని విడుదల రజినీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆరోపణలు రాగా తొలుత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఆ విభాగానికి చెందిన డైరెక్టర్‌ జనరల్‌ హరీష్‌కుమార్‌ గుప్తా విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదిక సిఫార్స్ మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఇందుకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు.   

ఏకంగా ఐఏఎస్ కూడా 
లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బీ సెక్షన్లు మీద కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది అయిన విడదల గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. బెదిరింపులు, అక్రమ వసూళ్ల పై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్స్ కు ఫిర్యాదు అందగా.. ఆ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ హరీష్‌కుమార్‌ గుప్తా విచారణ జరిపించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ సింగ్‌ ప్రాథమిక దర్యాప్తు చేశారు. ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు. 

రూ.5 కోట్లు డిమాండ్
కేసు విషయానికి వస్తే.. ‘2020 సెప్టెంబరు 4న పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ కండ్రికను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. స్టోన్‌క్రషర్‌పై దాడులు చేయకుండా, స్టోన్ క్రషర్ ను మూయించకుండా ఉండాలంటే రజినిని కలవాలని ఆదేశించారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజిని ఆఫీసుకు వెళ్లి కలిశారు. వ్యాపారం సజావుగా జరగాలంటే  అడిగినంత డబ్బులివ్వాల్సిందేనని, మిగతా విషయాలన్నీ తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారికి హుకుం జారీ చేశారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన రూ.5కోట్లు డిమాండ్ చేశారు.  

విజిలెన్స్‌ తనిఖీలతో ఆయన హడావుడి
ఆ తర్వాత వారం రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి (ఆర్‌వీఈవో)గా ఉన్న ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా తన బృందంతో శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌లో తనిఖీలకు వెళ్లారు. ఆ స్టోన్‌ క్రషర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే హడావుడి చేశారు. అప్పటి విజిలెన్స్‌ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్‌ మెయిన్ ఆఫీసుకు ఈ తనిఖీల గురించి సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక రెడీ చేశారు.జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని మిగతా అధికారులను ఏసీబీకి తెలిపారు. 

డబ్బుల కట్టాల్సిందేనంటూ బెదిరింపులు
స్టోన్‌క్రషర్‌లో తనిఖీల అనంతరం జాషువా దాని యజమానులకు ఫోన్‌ చేశారు. వెంటనే విడదల రజినిని కలవాలని.. లేకపోతే రూ.50కోట్లు జరిమానాతో పాటు క్రషర్‌ను మూయించేస్తానని బెదిరించారు. దీంతో వారు రజినిని కలిశారు. పీఏ రామకృష్ణతో భేటీ కాగా ఆయన రూ.5 కోట్లు ఇవ్వాల్సిందేనని మరోమారు డిమాండ్ చేశారు. స్టోన్ క్రషర్ యజమానికి ఆయన నుంచి ఒత్తిడి పెరగడంతో  రజిని ఆదేశాల మేరకు.. ఆమె మరిది విడదల గోపిని కలిసి రూ.2 కోట్లు ఇచ్చారు. అదే రోజు గుంటూరులో ఐఏఎస్ జాషువాకు రూ.10 లక్షలు, గోపికి మరో రూ.10లక్షలు ఇచ్చారు. విడదల రజిని ఆదేశాల మేరకే తాము తనిఖీలు చేపట్టినట్లు జాషువా చెప్పారు. ఇన్ని డబ్బులిచ్చినట్లు ఎవరికైనా చెబితే  క్రిమినల్‌ కేసులు పెడతామని బెదిరించారని యజమానులు చెప్పారు’ అని ఏసీబీ ఎఫ్ఐఆర్‎లో పేర్కొంది.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: NDSA చెప్పింది పాటించి, నీళ్లు ఎత్తిపోయడం లేదు: రేవంత్ రెడ్డి
NDSA చెప్పింది పాటించి, నీళ్లు ఎత్తిపోయడం లేదు: రేవంత్ రెడ్డి
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget