అన్వేషించండి

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 

Moinabad Farmhouse Case | మొయినాబాద్ పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, స్నేహితుడు ఆహ్వానిస్తే వెళ్లి వచ్చానని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. దుష్ప్రచారం నమ్మవద్దని సూచించారు.

‎TDP MP Putta Mahesh Kumar | హైదరాబాద్/ఏలూరు: హైదరాబాద్ మొయినాబాద్ ఫాం హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన పార్టీపై ఏలూరు ఎంపీ  పుట్టా మహేష్ కుమార్ స్పందించారు. ఈ కేసులో తనపై వచ్చిన కథనాలను టీడీపీ ఎంపీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న పుట్టా మహేష్ కుమార్ మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.

‘నేను ఎలాంటి వ్యక్తినో రెండేళ్లుగా ఏలూరు ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసు. నాకు ఎటువంటి దురలవాట్లు లేవు. ఏ తప్పు చేయలేదు. కేవలం ఒక స్నేహితుడు పిలిస్తే కలవడానికి మాత్రమే మొయినాబాద్ వెళ్ళాను. కలిసి తిరిగి వచ్చే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఆ విషయాలను ఎవ్వరూ నమ్మవద్దు. ఈ కేసులో పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తాను. పూర్తి వివరాలతో త్వరలో ప్రజల ముందుకు వస్తానని’ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఎప్పటికైనా నిజం గెలుస్తుందని, తన విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు, అభిమానులకు టీడీపీ ఎంపీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేరు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఎవరున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. వ్యక్తుల తప్పుల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. 

తెలంగాణ పోలీసుల ప్రకటన వెలువడిన వెంటనే, పుట్టా మహేష్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. చంద్రబాబు సూచన మేరకు పల్లా శ్రీనివాసరావు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించారు. పార్టీ గౌరవానికి భంగం కలిగించే ఈ వ్యవహారంలో ఎంపీ ఇచ్చే సంజాయిషీని బట్టి తదుపరి కఠిన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పల్లా వెల్లడించారు. అంతవరకు ఆయన ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లోని పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన పార్టీపై 'ఈగల్ ఫోర్స్' మెరుపు దాడులు చేసింది. పార్టీకి హాజరైన వారికి జరిపిన టెస్టుల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. రక్త పరీక్షలో ఎంపీకి పాజిటివ్ వచ్చినట్లు ఎస్పీ గిరిధర్ తెలిపారు. దాడుల సమయంలో నిందితులు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి పోలీసులను భయపెట్టే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనా స్థలంలో రివాల్వర్, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధుల ప్రమేయంపై విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఎంపీ పుట్టా మహేష్ కు బెయిల్ రావడంతో ఆయన విడుదలయ్యారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
Heatwave Alert in AP: ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
Dwaraka Tirumala Fake Tickets: ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRAA Fact Check: హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
హైడ్రా స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసిందా? ఎలాంటి కూల్చివేతలు చేయొద్దనే ఆదేశాలపై ఫ్యాక్ట్ చెక్‌!
Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
Strait of Hormuz:
"హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
TGSRTC Strike : తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ ! 22వ తేదీ నుంచి విధుల బహిష్కరణ!32 డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి!
Jasprit Bumrah News: వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Viral News: ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
ఎడ్ల బండి కాన్వాయ్‌పై పెళ్లి కూతురు! గోదారోళ్లు ఏం చేసిన ట్రెండే! సోషల్ మీడియాలో వైరల్!
AI Wife: డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
డిజిటల్ వరల్డ్ లోకి ఏఐ వైఫ్ ఆహ్వానం - సంతోషంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తి - పిచ్చి ఇలా కూడా ముదిరిపోతోంది!
Embed widget