అన్వేషించండి

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై ప్రభుత్వానికి నివేదిక.. నెక్ట్స్ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ పై చర్యలు !

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమని విజిలెన్స్‌ తుది నివేదిక తేల్చింది. ఈ మేరకు 257 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి విజిలెన్స్‌ సమర్పించింది.

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమని నివేదిక తేల్చింది. ఈ మేరకు 257 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి విజిలెన్స్‌ సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలంటూ కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.. బ్యారేజీ నిర్మాణంలో కీలకమైన సీకెంట్‌ పైల్స్‌ వేయడంలో తీవ్ర లోపం జరిగిందని పేర్కొంది.ప్రైమరీ పైల్స్‌ వేసిన ఒకట్రెండు రోజుల్లో ఆర్‌సీసీ సీకెంట్‌ పైల్స్‌ వేయాల్సి ఉండగా.. నెల నుంచి నెలన్నర తర్వాత వేశారు. సీకెంట్‌ పైల్స్‌ ఎలా వేయాలన్నదానిపై నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ-పీఈఎస్‌ తమ అంతర్గత డాక్యుమెంట్‌నే అమలు చేయలేదు.

నీటిపారుదల శాఖకు చెందిన ఫీల్డ్‌ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు. ఫీల్డ్‌ ఇంజినీర్లకు సీకెంట్‌ పైల్స్‌ గురించి అవగాహన లేదు. దీని మీద ఉన్నతస్థాయి ఇంజినీర్లు పర్యవేక్షణ చేయలేదు.సీడీవో ఆమోదించిన డ్రాయింగులను అమలు చేయలేదు. లోపభూయిష్ఠ నిర్మాణం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణంలో లోపం వల్ల రాఫ్ట్‌ కింద పైపింగ్‌ ఏర్పడి గుంతలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే అంతిమంగా ఏడో బ్లాక్‌ కుంగింది.

నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం 
బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ చర్యలు కూడా కారణమని విజిలెన్స్ తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడానికి కారణమైందని భావిస్తున్నారు. 2021 డ్యాం సేఫ్టీ చట్టం, పీడీపీపీ చట్టం-1984, పీసీ యాక్టు-1988, ఐపీసీలోని 120(బీ), 336, 409, 418, 423, 426 ప్రకారం సంస్థపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఏడో బ్లాకు స్థానంలో కొత్తది నిర్మించడానికి అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేయాలని సూచించింది. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేసిన 17 మంది ఇంజినీర్లపైనా ఈ చట్టాల ప్రకారమే చర్య తీసుకోవాలని సూచించింది.

పని పూర్తికాకుండానే సర్టిఫికెట్‌
ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా ఇంజనీర్లు చేశారు. పని పూర్తికాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వడం, బ్యారేజీకి మరమ్మతులు చేయకున్నా పట్టించుకోకపోవడం ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థ కలిసి ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా కుట్ర చేసినట్లు స్పష్టమవుతోంది. పరిపాలనా అనుమతి ఇచ్చిన దానికన్నా డీవియేషన్‌ అదనంగా పెరిగితే 15 శాతం వరకు ప్రభుత్వానికి సమాచారమిచ్చి చీఫ్‌ ఇంజినీరే సవరించిన సాంకేతిక అనుమతి ఇవ్వొచ్చు. అయితే మొదటిసారి సవరించిన అంచనా ఆమోదం పొందకముందే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా చీఫ్‌ ఇంజినీర్‌ 15 శాతం డీవియేషన్‌కు ఆమోదం తెలిపారు. మొదట సవరించి ఇచ్చిన అంచనాలో ఉన్న కొన్ని పనులు చేయలేదు.అయితే అంచనాలో లేని పనులను చేసి బిల్లులు పొందారు. కొన్ని మంజూరు చేసిన క్వాంటిటీస్‌ కన్నా ఎక్కువ చేసి బిల్లులు తీసుకున్నారు. రూ.1,343.76 కోట్ల డీవియేషన్‌కు చీఫ్‌ ఇంజినీర్‌ ఆమోదం తెలిపారు. 2018 జూన్‌ 23న రూ.3,260 కోట్ల సవరించిన అంచనాకు ఆమోదం రాగా, అంతకుముందే 2018 జూన్‌ 14న రూ.1,343.76 కోట్ల డీవియేషన్‌ను చీఫ్‌ ఇంజినీర్‌ ఆమోదించారు. క్వాలిటీ కంట్రోల్‌కు సంబంధించి 1,88,257 క్యూబిక్‌ మీటర్ల టెస్ట్‌ రిజిస్టర్లు లేవు. ఇందులో భారీగా అవకతవకలు జరిగాయి.

కాఫర్‌డ్యాం దుర్వినియోగం 
కాఫర్‌డ్యాం నిర్మాణానికి అంచనా వ్యయం తొలుత రూ.12.95 కోట్లు ఉండగా, 2018 జూన్‌ 23న మొదట సవరించిన అంచనాలో రూ.11.64 కోట్లకు తగ్గింది. రెండోసారి సవరించిన అంచనాలో రూ.61.21 కోట్లకు చేరింది. కాఫర్‌డ్యాంకు సంబంధించిన వివరాలు ఎక్కడా నమోదు చేయలేదు. విజిలెన్స్‌ రికార్డులు సీజ్‌ చేసే సమయంలో ఎంబీ-23, పేజీ-11లో పొందుపరిచారు. తర్వాత రికార్డు చేసిన 46,851 క్యూబిక్‌ మీటర్ల పనిని రద్దు చేశారు.బ్యారేజీ ప్రారంభం జరిగిన తర్వాత కాఫర్‌డ్యాం వ్యయాన్ని భారీగా పెంచి సవరించిన రెండో అంచనాను ఆమోదించడం నిధులను దుర్వినియోగం చేయడం, కాంట్రాక్టర్‌కు అయాచిత ప్రయోజనం కలిగించడానికేనని స్పష్టం చేసింది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన లోపాలు, అక్రమాలకు కాంట్రాక్టు సంస్థ, ఇంజినీర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget