అన్వేషించండి

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై ప్రభుత్వానికి నివేదిక.. నెక్ట్స్ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ పై చర్యలు !

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమని విజిలెన్స్‌ తుది నివేదిక తేల్చింది. ఈ మేరకు 257 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి విజిలెన్స్‌ సమర్పించింది.

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమని నివేదిక తేల్చింది. ఈ మేరకు 257 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి విజిలెన్స్‌ సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలంటూ కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.. బ్యారేజీ నిర్మాణంలో కీలకమైన సీకెంట్‌ పైల్స్‌ వేయడంలో తీవ్ర లోపం జరిగిందని పేర్కొంది.ప్రైమరీ పైల్స్‌ వేసిన ఒకట్రెండు రోజుల్లో ఆర్‌సీసీ సీకెంట్‌ పైల్స్‌ వేయాల్సి ఉండగా.. నెల నుంచి నెలన్నర తర్వాత వేశారు. సీకెంట్‌ పైల్స్‌ ఎలా వేయాలన్నదానిపై నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ-పీఈఎస్‌ తమ అంతర్గత డాక్యుమెంట్‌నే అమలు చేయలేదు.

నీటిపారుదల శాఖకు చెందిన ఫీల్డ్‌ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు. ఫీల్డ్‌ ఇంజినీర్లకు సీకెంట్‌ పైల్స్‌ గురించి అవగాహన లేదు. దీని మీద ఉన్నతస్థాయి ఇంజినీర్లు పర్యవేక్షణ చేయలేదు.సీడీవో ఆమోదించిన డ్రాయింగులను అమలు చేయలేదు. లోపభూయిష్ఠ నిర్మాణం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణంలో లోపం వల్ల రాఫ్ట్‌ కింద పైపింగ్‌ ఏర్పడి గుంతలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే అంతిమంగా ఏడో బ్లాక్‌ కుంగింది.

నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం 
బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ చర్యలు కూడా కారణమని విజిలెన్స్ తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడానికి కారణమైందని భావిస్తున్నారు. 2021 డ్యాం సేఫ్టీ చట్టం, పీడీపీపీ చట్టం-1984, పీసీ యాక్టు-1988, ఐపీసీలోని 120(బీ), 336, 409, 418, 423, 426 ప్రకారం సంస్థపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఏడో బ్లాకు స్థానంలో కొత్తది నిర్మించడానికి అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేయాలని సూచించింది. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేసిన 17 మంది ఇంజినీర్లపైనా ఈ చట్టాల ప్రకారమే చర్య తీసుకోవాలని సూచించింది.

పని పూర్తికాకుండానే సర్టిఫికెట్‌
ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా ఇంజనీర్లు చేశారు. పని పూర్తికాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వడం, బ్యారేజీకి మరమ్మతులు చేయకున్నా పట్టించుకోకపోవడం ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థ కలిసి ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా కుట్ర చేసినట్లు స్పష్టమవుతోంది. పరిపాలనా అనుమతి ఇచ్చిన దానికన్నా డీవియేషన్‌ అదనంగా పెరిగితే 15 శాతం వరకు ప్రభుత్వానికి సమాచారమిచ్చి చీఫ్‌ ఇంజినీరే సవరించిన సాంకేతిక అనుమతి ఇవ్వొచ్చు. అయితే మొదటిసారి సవరించిన అంచనా ఆమోదం పొందకముందే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా చీఫ్‌ ఇంజినీర్‌ 15 శాతం డీవియేషన్‌కు ఆమోదం తెలిపారు. మొదట సవరించి ఇచ్చిన అంచనాలో ఉన్న కొన్ని పనులు చేయలేదు.అయితే అంచనాలో లేని పనులను చేసి బిల్లులు పొందారు. కొన్ని మంజూరు చేసిన క్వాంటిటీస్‌ కన్నా ఎక్కువ చేసి బిల్లులు తీసుకున్నారు. రూ.1,343.76 కోట్ల డీవియేషన్‌కు చీఫ్‌ ఇంజినీర్‌ ఆమోదం తెలిపారు. 2018 జూన్‌ 23న రూ.3,260 కోట్ల సవరించిన అంచనాకు ఆమోదం రాగా, అంతకుముందే 2018 జూన్‌ 14న రూ.1,343.76 కోట్ల డీవియేషన్‌ను చీఫ్‌ ఇంజినీర్‌ ఆమోదించారు. క్వాలిటీ కంట్రోల్‌కు సంబంధించి 1,88,257 క్యూబిక్‌ మీటర్ల టెస్ట్‌ రిజిస్టర్లు లేవు. ఇందులో భారీగా అవకతవకలు జరిగాయి.

కాఫర్‌డ్యాం దుర్వినియోగం 
కాఫర్‌డ్యాం నిర్మాణానికి అంచనా వ్యయం తొలుత రూ.12.95 కోట్లు ఉండగా, 2018 జూన్‌ 23న మొదట సవరించిన అంచనాలో రూ.11.64 కోట్లకు తగ్గింది. రెండోసారి సవరించిన అంచనాలో రూ.61.21 కోట్లకు చేరింది. కాఫర్‌డ్యాంకు సంబంధించిన వివరాలు ఎక్కడా నమోదు చేయలేదు. విజిలెన్స్‌ రికార్డులు సీజ్‌ చేసే సమయంలో ఎంబీ-23, పేజీ-11లో పొందుపరిచారు. తర్వాత రికార్డు చేసిన 46,851 క్యూబిక్‌ మీటర్ల పనిని రద్దు చేశారు.బ్యారేజీ ప్రారంభం జరిగిన తర్వాత కాఫర్‌డ్యాం వ్యయాన్ని భారీగా పెంచి సవరించిన రెండో అంచనాను ఆమోదించడం నిధులను దుర్వినియోగం చేయడం, కాంట్రాక్టర్‌కు అయాచిత ప్రయోజనం కలిగించడానికేనని స్పష్టం చేసింది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన లోపాలు, అక్రమాలకు కాంట్రాక్టు సంస్థ, ఇంజినీర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Embed widget