అన్వేషించండి

Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!

India statement on Iran War | బడ్జెట్ సమావేశాలు రెండవ దశలో విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ముర్ము గల్ఫ్ దేశాల నేతలతో చర్చించారని తెలిపారు.

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా పరిస్థితిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రాజ్యసభలో స్పందించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇటీవల జరిగిన పరిణామాలు అందరికీ ఆందోళన కలిగించే విషయం అన్నారు. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ డ్రోన్, మిస్సైల్ దాడులు చేస్తుంటే.. మరోవైపు ఇరాన్ ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ఫిబ్రవరి 28 నుంచి అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, చాలా మంది ప్రాణనష్టం జరిగిందని జైశంకర్ వివరించారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని ఆయా దేశాల అధినేతలకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులకు భద్రత కల్పిస్తామని, వారిని క్షేమంగా తిరిగి తీసుకొస్తామని రాజ్యసభలో మరోసారి స్పష్టం చేశారు.

CCS సమావేశంలో ఇరాన్ యుద్ధంపై చర్చ

'కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం మార్చి 1న జరిగింది. ఇందులో ఇరాన్ పై ఇతర దేశాల దాడులు.. తదనంతరం జరిగిన ఎదురు దాడులపై చర్చించాం. సమావేశంలో ప్రాంతీయ భద్రత, ఆర్థిక ప్రభావంపై కూడా దృష్టి సారించాం. అన్ని మంత్రిత్వ శాఖలకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగడం భారత్‌కు చాలా ఆందోళన కలిగించే విషయం. గల్ఫ్ దేశాలలో దాదాపు 1 కోటి మంది భారత పౌరులు నివసిస్తున్నారు. లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. ఇరాన్ లో కూడా చాలా మంది భారతీయులు చదువుకునేందుకు, ఉపాధి నిమిత్తం వెళ్లారు. త్వరలో సప్లై ఛైన్‌లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మర్చంట్ నేవీ నౌకపై దాడులు జరిగాయి.  ఇందులో ఇద్దరు భారతీయులు చనిపోగా, ఒకరు గల్లంతయ్యారని’ ఎస్ జైశంకర్ రాజ్యసభలో పేర్కొన్నారు.

ఇరాన్‌లోని భారతీయులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహా జారీ 

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలపై కేంద్రం ప్రభుత్వం చర్యలపై ఎస్. జైశంకర్ స్పందించారు. తమ ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తోందని, ప్రస్తుతం కొంతకాలం ఇరాన్‌కు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సూచించింది. భారత రాయబార కార్యాలయాలు అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ ఉన్న మన పౌరులను కోరుతున్నాం.

భారత పౌరుల భద్రత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని జైశంకర్ స్పష్టం చేశారు. భారతీయుల భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని సంబంధిత దేశాలతో చర్చలు జరుపుతోందని, పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందన్నారు.  పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండవ దశ మొదటి రోజున ఈ ప్రకటన వచ్చింది, ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేశాయి. చర్చలు, దౌత్య మార్గాన్ని అనుసరించాలని జైశంకర్ అన్ని పార్టీలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Strait of Hormuz: హర్మూజ్‌లో భారత చమురు నౌకపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
హర్మూజ్‌లో భారత చమురు నౌకపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
PM Modi Speech: మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran Ceasefire: అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
IPL 2026 KKR VS RR Result Update: రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Editor Madhu Reddy: తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
 Kia India Announces Massive Discounts: కియా కార్లపై అదిరిపోయే ఏప్రిల్ ఆఫర్లు.. ఏకంగా రూ. 3.20 లక్షల వరకు డిస్కౌంట్! పూర్తి వివరాలు ఇవే!
కియా కార్లపై అదిరిపోయే ఏప్రిల్ ఆఫర్లు.. ఏకంగా రూ. 3.20 లక్షల వరకు డిస్కౌంట్! పూర్తి వివరాలు ఇవే!
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Embed widget