అన్వేషించండి

Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!

Telangana News: తెలంగాణ చరిత్రలో అతి మలుపు తిరిగింది. సాయంత్రం జరిగే కీలక పరిణామంతో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డు పడినట్టే అవుతుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Telangana News: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయం అవిష్కృతంకానుంది. దశాబ్దాల కాలంగా సాయుధ పోరాట బాటలో సాగిన మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారు. ఒకేసారి 126 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోవాలని నిర్ణయించుకోవడం రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది.  రేవంత్ రెడ్డి సమక్షంలో ఇదంతా జరగనుంది. 

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం ఇదే తొలిసారి. అందిన సమాచారం ప్రకారం మొత్తం 126 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వీడి, హింసా మార్గాన్ని వదిలి సాధారణ పౌరులుగా జీవించేందుకు ముందుకు వచ్చారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా సరెండర్ కానున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఈ లొంగుబాటులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, దేవ్‌జీ చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ కాబోతుండటం మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ విభాగం అత్యంత కీలకమైన సాయుధ విభాగంగా పరిగణిస్తుంటారు. అటువంటి విభాగంలోకి  ఒక పూర్తి కమిటీ జన జీవన స్రవంతిలోకి రావడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. అయితే, మావోయిస్టు పార్టీ సుప్రీంకమాండర్‌ గణపతి ఈ లొంగిపోయిన వారిలో లేరని ప్రాథమిక సమాచారం. 

ఈ భారీ లొంగుబాటుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బంజారా హిల్స్‌లోని అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికకానుంది. సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మీడియాతో మాట్లాడనున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు, వారికి ప్రభుత్వం తరఫున అందే పునరావాస ప్యాకేజీలు, ఈ పరిణామం వెనుక ఉన్న కీలక అంశాలను సీఎం వివరించే అవకాశం ఉంది. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం తక్షణ సహాయంతో పాటు, వారు సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి అవసరమయ్యే ఉపాధి, ఇతర వసతులను కల్పిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, హింసను వీడి వచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని బలమైన సందేశాన్ని పంపాలని భావిస్తున్నారు. 

ఈ లొంగుబాటులో ఎవరెవరు ఉన్నారు, ఏ స్థాయి నేతలు లొంగిపోనున్నారు ఏ ప్రాంతాలకు చెందిన వారు ఇందులో ఉన్నారనే పూర్తి వివరాలు సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడికానున్నాయి. 

Frequently Asked Questions

ఎంతమంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోనున్నారు?

126 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరంతా తమ ఆయుధాలను విడిచి, హింసా మార్గాన్ని వదిలి సాధారణ పౌరులుగా జీవించేందుకు ముందుకు వచ్చారు.

ఈ లొంగుబాటు కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది?

బంజారా హిల్స్ లోని అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ చారిత్రాత్మక ఘట్టం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ లొంగుబాటు ప్రక్రియ అధికారికంగా జరగనుంది.

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తుంది?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం తక్షణ సహాయంతో పాటు, సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన ఉపాధి, ఇతర వసతులను కల్పిస్తుంది.

ఈ లొంగుబాటులో ఏ కీలక విభాగం చెందినవారు ఉన్నారు?

ఈ లొంగుబాటులో దేవ్‌జీ చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ కాబోతోంది. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget