అన్వేషించండి

Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!

Telangana News: తెలంగాణ చరిత్రలో అతి మలుపు తిరిగింది. సాయంత్రం జరిగే కీలక పరిణామంతో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డు పడినట్టే అవుతుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 126 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధమయ్యారు.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోనున్నారు.
  • పీఎల్జీఏ కమిటీ సభ్యులు సరెండర్ కావడం పార్టీకి ఎదురుదెబ్బ.
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

Telangana News: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయం అవిష్కృతంకానుంది. దశాబ్దాల కాలంగా సాయుధ పోరాట బాటలో సాగిన మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారు. ఒకేసారి 126 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోవాలని నిర్ణయించుకోవడం రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది.  రేవంత్ రెడ్డి సమక్షంలో ఇదంతా జరగనుంది. 

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం ఇదే తొలిసారి. అందిన సమాచారం ప్రకారం మొత్తం 126 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వీడి, హింసా మార్గాన్ని వదిలి సాధారణ పౌరులుగా జీవించేందుకు ముందుకు వచ్చారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా సరెండర్ కానున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఈ లొంగుబాటులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, దేవ్‌జీ చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ కాబోతుండటం మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ విభాగం అత్యంత కీలకమైన సాయుధ విభాగంగా పరిగణిస్తుంటారు. అటువంటి విభాగంలోకి  ఒక పూర్తి కమిటీ జన జీవన స్రవంతిలోకి రావడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. అయితే, మావోయిస్టు పార్టీ సుప్రీంకమాండర్‌ గణపతి ఈ లొంగిపోయిన వారిలో లేరని ప్రాథమిక సమాచారం. 

ఈ భారీ లొంగుబాటుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బంజారా హిల్స్‌లోని అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికకానుంది. సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మీడియాతో మాట్లాడనున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు, వారికి ప్రభుత్వం తరఫున అందే పునరావాస ప్యాకేజీలు, ఈ పరిణామం వెనుక ఉన్న కీలక అంశాలను సీఎం వివరించే అవకాశం ఉంది. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం తక్షణ సహాయంతో పాటు, వారు సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి అవసరమయ్యే ఉపాధి, ఇతర వసతులను కల్పిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, హింసను వీడి వచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని బలమైన సందేశాన్ని పంపాలని భావిస్తున్నారు. 

ఈ లొంగుబాటులో ఎవరెవరు ఉన్నారు, ఏ స్థాయి నేతలు లొంగిపోనున్నారు ఏ ప్రాంతాలకు చెందిన వారు ఇందులో ఉన్నారనే పూర్తి వివరాలు సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడికానున్నాయి. 

Frequently Asked Questions

ఎంతమంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోనున్నారు?

126 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరంతా తమ ఆయుధాలను విడిచి, హింసా మార్గాన్ని వదిలి సాధారణ పౌరులుగా జీవించేందుకు ముందుకు వచ్చారు.

ఈ లొంగుబాటు కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది?

బంజారా హిల్స్ లోని అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ చారిత్రాత్మక ఘట్టం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ లొంగుబాటు ప్రక్రియ అధికారికంగా జరగనుంది.

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తుంది?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం తక్షణ సహాయంతో పాటు, సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన ఉపాధి, ఇతర వసతులను కల్పిస్తుంది.

ఈ లొంగుబాటులో ఏ కీలక విభాగం చెందినవారు ఉన్నారు?

ఈ లొంగుబాటులో దేవ్‌జీ చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ కాబోతోంది. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Kaleshwaram Project: కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ నేత రామచందర్‌రావు లేఖ
కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్, NDSA నివేదిక పట్టించుకోలేదు: CM రేవంత్‌‌కు రామచందర్‌రావు లేఖ
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget