Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారతీయ స్టాక్ మార్కెట్ సోమవారం ( మార్చి 9న) భారీ నష్టాలతో ప్రారంభమైంది. BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ 50 సూచీలు వరుసగా 2000 పాయింట్లు, 600 పాయింట్లకు పైగా పడిపోయాయి.

Stock Market Today March 9 in India భారత స్టాక్ మార్కెట్లో సోమవారం (మార్చి 9) నాడు ట్రేడింగ్ చాలా దారుణంగా ప్రారంభమైంది. ప్రధాన బెంచ్మార్క్ సూచికలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ 50 బ్లడ్ బాత్ చూపించాయి. 30 షేర్ల BSE సెన్సెక్స్ సూచిక 1862.15 పాయింట్లు లేదా 2.36 శాతం పడిపోయింది. సెన్సెక్స్ 77,056.75 వద్ద ప్రారంభమైంది.
NSE నిఫ్టీ 50 కూడా భారీగా క్షీణించింది. నేటి మార్కెట్ సెషన్ నిఫ్టీ 50 582.40 పాయింట్లు లేదా 2.38 శాతం పడిపోయి 23,868.05 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఉదయం 9:20 గంటలకు, సెన్సెక్స్ 2301 పాయింట్లు పడిపోయి 76,617 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 ఏకంగా 687 పాయింట్లు పడిపోయి 23,762 స్థాయి వద్ద ట్రేడవుతోంది.
BSE టాప్ లూజర్స్
BSE బాస్కెట్ నుండి ఇండిగోతో పాటు టాటా స్టీల్, మారుతి, ఎటర్నల్, L&T భారీగా నష్టాలు చవిచూశాయి.
శుక్రవారం మార్కెట్ ఎలా ఉంది?
భారత స్టాక్ మార్కెట్లో, మార్చి 6న వీక్ ట్రేడింగ్ చివరి రోజున భారీ పతనం కనిపించింది. ప్రధాన బెంచ్మార్క్ సూచికలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ 50 ఎరుపు గుర్తుతో ట్రేడింగ్ చేస్తూ ముగిశాయి. సెన్సెక్స్ 1097.00 పాయింట్లు లేదా 1.37 శాతం క్షీణించి 78,918.90 పాయింట్ల వద్ద ముగిసింది. అదే సమయంలో NSE నిఫ్టీ 50 315.45 పాయింట్లు లేదా 1.27 శాతం పడిపోయి 24,450.45 స్థాయి వద్ద ముగిసింది.
BSE బాస్కెట్ నుండి రిలయన్స్, NTPC, సన్ఫార్మా, HCL టెక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే, ఎటర్నల్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ ఉన్నాయి.
నిఫ్టీ 100, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ FMCG, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 మరియు నిఫ్టీ మిడ్క్యాప్ 100 షేర్లలో క్షీణత ఉంది. నిఫ్టీ IT షేర్లలో వృద్ధి నమోదైంది. శుక్రవారం ట్రేడింగ్ రోజున BSE బాస్కెట్ నుండి 6 షేర్లు ఆకుపచ్చ గుర్తుతో ముగియగా, 24 షేర్లలో క్షీణత నమోదైంది.
నిరాకరణ: (ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీకు సమాచారం కోసం మాత్రమే అందిస్తున్నాం. మార్కెట్లో పెట్టుబడి రిస్క్లకు లోబడి ఉంటుందని గమనించాలి. పెట్టుబడిదారుడిగా మనీ ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోండి. ABP Desam ఎవరికీ స్టాక్ మార్కెట్లో మీ మనీని పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని ఎప్పుడూ సలహా ఇవ్వదు.)
ట్రెండింగ్ వార్తలు



















