అన్వేషించండి

Telangana News: తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్

Ponguleti Srinivasa Reddy: ఏపీలో పేలిన పొలిటికల్ బాంబు సౌండ్ ఇంకా తగ్గలేదు అప్పుడే తెలంగాణలో బాంబు పేలుస్తామంటున్నారు మంత్రి. తప్పు చేసిన వాళ్లు ఎవరూ తప్పించుకోలేరని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.

Telangana News: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ బాంబుల పేలుళ్లు ఎక్కువైపోతున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ బాంబులు పేలిస్తే ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. ఇక్కడ కూడా ఓ బాంబు పేలపోతోందని మంత్రి ప్రకటించడం సంచలనంగా మారింది. ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబు  పేలుతుందని సమాచారం ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. 

అసలు ప్రభత్వం ఏం చేయబోతోంది... శ్రీనివాస్ రెడ్డి చెబుతున్న ఆ బాంబు ఏంటనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఇది కచ్చితంగా కేసులు రిలేటెడ్‌గానే ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని వార్నింగ్ కూడా ఇచ్చారు. సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్దమయ్యాయంటూ లీకు కూడా ఇచ్చేశారు. ఇదంతా చట్టం పరిధిలోనే ఉంటుందని కక్ష సాధింపులు అనుకోవద్దని కూడా క్లారిటీ ఇచ్చేశారు. 

ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. విచారణ కూడా చేపట్టింది. ఈ కేసుల్లో కొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది కూడా. విచారణలో వివిధ దశల్లో ఉన్న ఈ కేసుల విషయమే శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించి ఉంటారని అంటున్నారు. ఈ కేసుల్లో ఇప్పటి వరకు విచారణలో వెలుగు చూసిన అంశాలను అరెస్టు అయిన వాళ్లు ఇచ్చిన సమాచారంతో ముఖ్యనేతల పేర్లు ఉంటాయనే అనుమానం బలపడుతోంది. అదే ఈ బాంబు అని అంటున్నారు. 

ఏపీలో పేలిన పొలిటికల్ బాంబులు

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన పొలిటికల్ బాంబు స్టేట్మెంట్‌ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిందని అంటున్నారు ప్రజలు. ఏపీలో ఏం జరిగిందంటే.... గురువారం 12 గంటలకు పెద్ద పేలుడు జరగబోతోందని టీడీపీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి ఓ పోస్టు వచ్చింది. క్షణాల్లోనే అది వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగబోతోంది ఎవరిపై ఆ బాంబు పడబోతోందన్న చర్చ మొదలైంది. అదే టైంలో తామూ రెండు బాంబులు పేలుస్తున్నామంటూ వైసీపీ తన అధికారి హ్యాండిల్ నుంచి పోస్టు పెట్టింది. వైఎస్‌ఆర్‌సీపీనే టీడీపీ టార్గెట్ చేసి ఏదో చర్చిస్తోందని గ్రహించి జాగ్రత్తపడింది. 

అంతే ఇరు వర్గాలు పొలికిటల్ బాంబులతో సోషల్ మీడియాను షేక్ చేశారు. అయితే గురువారం 12 గంటల వరకు అవసరం లేదని... రాత్రి 8 గంటలకే బాంబు వేయబోతున్నామని చెప్పిన టీడీపీ... అనుకున్నట్టుగానే పెద్ద బాంబు వేసింది. ఆస్తుల్లో వాటాలు ఇవ్వబోనంటూ షర్మిలకు జగన్ రాసిన లెటర్‌, తేల్చుకుందాం అంటూ షర్మిల ఇచ్చిన రిప్లైను సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పటికే ఇద్దరి మధ్య ఉన్న పొలిటికల్ పంచాయితీ కాస్త పంపకాల పంచాయితీగా మారింది. దీనిపై తెలుగు రాష్ట్రాన్నే కాకుండా జాతీయ మీడియా కూడా కథనాలు ప్రచురిస్తోంది. 

వైఎస్ కుటుంబంలో జరుగుతున్న అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతుండగానే ఇటు తెలంగాణలో బాంబు పేలుస్తామంటూ మంత్రి చెప్పారు. దీంతో ఇక్కడ కూడా ఏం జరుగుతుందా అన్న ఆసక్తి జనంలో మొదలైంది. 

Also Read: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
US Army Training In Thailand: ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం-  హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు- ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ మంత్రి
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Embed widget