అన్వేషించండి

Jagan Wrote A Letter To Sharmila: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే

YS Jagan: జగన్, షర్మిల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రాజకోట రహస్యంగా ఉన్న ఆస్తులపంచాయితీ ఇప్పుడు బహిర్గతమైంది. దీంతో సగటు రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

YS Jagan Vs YS Sharmila : ఇన్ని రోజులు గుట్టుగా ఉన్న ఆస్తుల వివాదం మరింత రచ్చకెక్కింది. ఒకరిపై ఒకరు లేఖలతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. న్యాయపోరాటాలు చేస్తున్నారు. ఎందాకైనా అంటూ సవాళ్లు చేస్తున్నారు. అన్నాచెల్లెల మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల తగాదాను చూస్తున్న సగటు వైఎస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డల మధ్య ఉన్నది కేవలం రాజకీయ వారసత్వ పోరు అనుకున్నారు చాలా మంది. ఆస్తుల వివాదాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నా ఇంకా చాలా మందిలో అదంతా ఫేక్ అని నమ్మేవాళ్లు లేకపోలేదు. అయితే జగన్ న్యాయపోరాటంతో గుప్పెట విప్పేశారు. నాలుగు గోడల మధ్య జరుగుతున్న ఆస్తుల అంతర్యుద్ధాన్ని బహిర్గతం చేశారు. 
అన్నాచెల్లెల మధ్య రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రచారం ఈ మధ్య మళ్లీ మొదలైంది. ఆస్తుల పంపకానికి జగన్ ఓకే చెప్పారని కూడా వార్తలు లీకు అయ్యాయి. అలాంటిదేమీ లేదని ప్యాచ్‌ అయ్యే అవకాశమే లేదన్నట్టు వైఎస్‌ఆర్‌ శిబిరం నుంచి కౌంటర్ వచ్చింది. తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిలపై చేస్తున్న న్యాయపోరాటానికి సంబంధించిన వివరాలు బహిర్గతమయ్యాయి. సర్వతి పవర్ అండ్ అండస్ట్రీలో గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన వాటాను ఉపసంహరించుకుంటున్నట్టు ఎన్‌సీఎల్‌టీలో వేసిన పిటిషన్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. 

జగన్ మోహన్ రెడ్డి ఎన్‌సీఎల్‌టీలో వేసిన పిటిషన్‌పై చర్చ జరుగుతున్న టైంలో మరో బాంబు పేలింది. ఈ పిటిషన్ వేయక ముందు జగన్ మోహన్ రెడ్డి రాసిన ఓ లేఖ బహిర్గతమైంది. తనను వ్యతిరేకిస్తున్న షర్మిలకు ఆస్తులు ఎందుకు రాయాలంటూ ప్రశ్నిస్తూ ఆ లెటర్‌ రాశారు. ఈ లెటర్‌ను జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 27న రాశారు. అయితే ఎన్‌సీఎల్‌టీ పిటిషన్‌కు ఆ లెటర్‌ జత చేయడంతో ఇప్పుడు వెలుగు చూసింది.  

Image

వారసత్వంగా తండ్రి నుంచి వచ్చే ఆస్తులను ఆయన సమానంగా ఇద్దరికి పంచేశారు. అయితే తనకు వచ్చిన వాటాలను కష్టపడి తన తెలివితేటలతో వృద్ధి చేశానని చెప్పుకొచ్చిన జగన్ అందులో షర్మిలకు హక్కులేదని చెప్పేశారు. అయితే చెల్లెలు అన్న ప్రేమానురాగాలతో ఆ ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చేందుకు అంగీకరించానని వెల్లడించారు. ఆస్తుల్ని బదిలీ చేసేందుకు గిఫ్టు డీడ్‌ కింద అమ్మ పేరిట రాశానని అన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలగిపోయిన తర్వాత అవి నీ పేరు మీద బదిలీ అయ్యేవి. ఇవి కాకుండా చెల్లెలు అన్న ప్రేమతో చాలా సార్లు నేరుగా, అమ్మ ద్వారా 200 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పుకొచ్చారు జగన్. 

Image

ఇంతలా నీ కోసం ఇన్ని చేస్తే కృతజ్ఞత లేకుండా నన్ను వ్యతిరేకించావు అనేక మాటలు అన్నావు అని జగన్ అసహనం వ్యక్త చేశారు. వీటి కారణంగా చెల్లెలపై ప్రేమ తగ్గిపోయిందన్నారు జగన్. ఇకపై నీ ఆలోచనల్లో మార్పు వస్తే ప్రేమ పుడుతుందేమో అంటూ చెప్పారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక ఆస్తులపై ఆలోచిస్తానంటూ వెల్లడించారు. అయితే ఇంతలో తన ఫ్యామిలీ గురించి(జగన్, భారతీ) అవినాష్ రెడ్డి గురించి ఎక్కడా మాట్లాడొద్దు, రాజకీయంగా వ్యతిరేకించవద్దని షరుతులు పెడుతూ జగన్ లేఖ రాశారు.  

దీనిపై షర్మిల ఘాటుగా స్పందించారు. తను ఎలా రాజకీయాలు చేయాలో, ఎలా మాట్లాడాలో నువ్వు డిసైడ్ చేయడం ఏంటని రిప్లై ఇచ్చారు. తన ఆస్తుల్లో మనవలూ మనవరాళ్లకు సమాన వాటా ఇవ్వాలని ఆనాడు తండ్రి చెప్పారని గుర్తు చేశారు. కానీ స్వార్థంతో అరకొర ఇస్తానని ఒప్పుకున్నా సరే అన్నానని తెలిపారు. అది కూడా ఇవ్వకుండా ఇప్పుడు తన కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. అంతే కాకుండా ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడొద్దని నియంత్రించడం ఎంత సమంజసమని నిలదీశారు. షర్మిల లేఖపై పూర్తి కథనాన్ని ఇక్కడ చదవండి.

వైఎస్‌ కుటుంబంలో రగుతున్న ఆస్తుల అంతస్తుల వివాదాన్ని చూస్తున్న రాజశేఖర్ రెడ్డి అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాజన్న కుటుంబంలో ఎందుకిలా జరుగుతోందని చర్చించుకుంటున్నారు. 

Also Read: షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
BCCI Awards: సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP DesamUnion Budget 2025 Income Tax Nirmala Sitharaman 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP DesamPM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
BCCI Awards: సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
Capital Expenditure : రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
Hyderabad News: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు యత్నం, పోలీసులపైనే కాల్పులు
గచ్చిబౌలిలో కాల్పుల కలకలం - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు యత్నం, పోలీసులపైనే కాల్పులు
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
Embed widget