అన్వేషించండి

CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

AP Betting Act | ఆన్‌లైన్ బెట్టింగ్స్ ద్వారా జీవితాలు నాశనం అవుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ బెట్టింగ్ యాక్ట్ తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Collectors conference in Andhra Pradesh | అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్ తో ఎన్నో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ నేరాలపై ఫోకస్ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ ద్వారా ఒక్కరి జీవితం కాదు కుటుంబాలు సైతం నాశనం అవుతున్నాయని వీటికి చెక్ పెట్టాలంటే బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక చట్టం అవసరమని చంద్రబాబు అన్నారు. 

ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లతో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న మూడో సమావేశం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు సహా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నేరాలకు అడ్డుకట్ట వేయాలని, లేకపోతే ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఉన్నతాధికారులకు సూచించారు. ‘ఏపీలో ఇతర నేరాలు క్రమంగా తగ్గుతున్నా.. ఆర్థిక నేరాలు మాత్రం పెరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గంజాయి సాగు తగ్గింది. ఎక్కడైనా గంజాయి వినియోగం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోండి. టెక్నాలజీ వినియోగం పెంచడం ద్వారా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్స్ లాంటి వాటికి చెక్ పెట్టాలి.

బెట్టింగ్ యాప్‌లకు చెక్ పెట్టేందుకు ఏపీలో చట్టం

సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న  ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు అడ్డుకట్ట వేయాలంటే ఏపీలో ప్రత్యేక చట్టం అవసరం. గేమింగ్ బెట్టింగ్, క్రికెట్, ఐపీఎల్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్లను సైతం అరికట్టేలా బెట్టింగ్ యాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. నేరస్తులు రోజు రోజుకు తెలివితేరిపోతున్నారు. సాక్షాలు దొరకకుండా తప్పులు చేసేది కొందరైతే, వాటిని వేరే వారిపై మోపేవారు మరికొందరు. మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ను ఉదాహరణగా పేర్కొన్నారు. నేరాలు నియంత్రణలో టెక్నాలజీ వినియోగం బాగా పెరగాలి. టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నేరాలను నియంత్రించాలి. అవసరమైతే కొన్ని సందర్భాలలో ప్రజల సహాయం తీసుకోవాలని’ ఉన్నతాధికారులకు చంద్రబాబు సూచించారు.

ఏపీలో తగ్గిన నేరాలు 
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంతో పాటు నేరాల తగ్గుదలకు తాము ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా  తెలిపారు. సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో డీజీపీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘2014 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి కాలంలో అంతకు ముందు ఏడాదితో పోల్చితే  నేరాలు 17 శాతం తగ్గాయి. 75,500 సీసీటీవీలు ఏర్పాటు చేయడంతో పాటు 187 డ్రోన్లతో నిఘా పెంచాం. 2023 జూన్‌ నుంచి 2024 జనవరి నెల వరకూ మహిళలపై 18,114 నేరాలు జరిగాయి. అదే కూటమి ప్రభుత్వ హయాంలో 2024 జూన్‌ నుంచి 2025 జనవరి వరకూ 16,809 నేరాలు జరిగాయి. 

శక్తి యాప్‌ ద్వారా నిరంతరం రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో గంజాయి సాగును వేల ఎకరాల నుంచి వందల ఎకరాలకు వచ్చేలా చేయగలిగాం. త్వరలో పూర్తిగా బంద్ కానుంది. గంజాయి స్మగ్లింగ్‌ కేసులలో 2,911 మందిని అరెస్టు చేశాం. గంజాయి రహిత ఏపీగా మార్చుతాం’ అని డీజీపీ అన్నారు. నేరాల నియంత్రణతో ప్రజలకు భరోసా కల్పించాలని మీ ‘లాఠీ టూ డేటా’ను మరింత ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget