అన్వేషించండి

CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

AP Betting Act | ఆన్‌లైన్ బెట్టింగ్స్ ద్వారా జీవితాలు నాశనం అవుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ బెట్టింగ్ యాక్ట్ తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Collectors conference in Andhra Pradesh | అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్ తో ఎన్నో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ నేరాలపై ఫోకస్ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ ద్వారా ఒక్కరి జీవితం కాదు కుటుంబాలు సైతం నాశనం అవుతున్నాయని వీటికి చెక్ పెట్టాలంటే బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక చట్టం అవసరమని చంద్రబాబు అన్నారు. 

ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లతో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న మూడో సమావేశం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు సహా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నేరాలకు అడ్డుకట్ట వేయాలని, లేకపోతే ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఉన్నతాధికారులకు సూచించారు. ‘ఏపీలో ఇతర నేరాలు క్రమంగా తగ్గుతున్నా.. ఆర్థిక నేరాలు మాత్రం పెరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గంజాయి సాగు తగ్గింది. ఎక్కడైనా గంజాయి వినియోగం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోండి. టెక్నాలజీ వినియోగం పెంచడం ద్వారా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్స్ లాంటి వాటికి చెక్ పెట్టాలి.

బెట్టింగ్ యాప్‌లకు చెక్ పెట్టేందుకు ఏపీలో చట్టం

సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న  ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు అడ్డుకట్ట వేయాలంటే ఏపీలో ప్రత్యేక చట్టం అవసరం. గేమింగ్ బెట్టింగ్, క్రికెట్, ఐపీఎల్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్లను సైతం అరికట్టేలా బెట్టింగ్ యాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. నేరస్తులు రోజు రోజుకు తెలివితేరిపోతున్నారు. సాక్షాలు దొరకకుండా తప్పులు చేసేది కొందరైతే, వాటిని వేరే వారిపై మోపేవారు మరికొందరు. మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ను ఉదాహరణగా పేర్కొన్నారు. నేరాలు నియంత్రణలో టెక్నాలజీ వినియోగం బాగా పెరగాలి. టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నేరాలను నియంత్రించాలి. అవసరమైతే కొన్ని సందర్భాలలో ప్రజల సహాయం తీసుకోవాలని’ ఉన్నతాధికారులకు చంద్రబాబు సూచించారు.

ఏపీలో తగ్గిన నేరాలు 
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంతో పాటు నేరాల తగ్గుదలకు తాము ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా  తెలిపారు. సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో డీజీపీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘2014 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి కాలంలో అంతకు ముందు ఏడాదితో పోల్చితే  నేరాలు 17 శాతం తగ్గాయి. 75,500 సీసీటీవీలు ఏర్పాటు చేయడంతో పాటు 187 డ్రోన్లతో నిఘా పెంచాం. 2023 జూన్‌ నుంచి 2024 జనవరి నెల వరకూ మహిళలపై 18,114 నేరాలు జరిగాయి. అదే కూటమి ప్రభుత్వ హయాంలో 2024 జూన్‌ నుంచి 2025 జనవరి వరకూ 16,809 నేరాలు జరిగాయి. 

శక్తి యాప్‌ ద్వారా నిరంతరం రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో గంజాయి సాగును వేల ఎకరాల నుంచి వందల ఎకరాలకు వచ్చేలా చేయగలిగాం. త్వరలో పూర్తిగా బంద్ కానుంది. గంజాయి స్మగ్లింగ్‌ కేసులలో 2,911 మందిని అరెస్టు చేశాం. గంజాయి రహిత ఏపీగా మార్చుతాం’ అని డీజీపీ అన్నారు. నేరాల నియంత్రణతో ప్రజలకు భరోసా కల్పించాలని మీ ‘లాఠీ టూ డేటా’ను మరింత ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget