అన్వేషించండి

Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం

Adilabad Crime News: ఆదిలాబాద్ లో మహిళ మర్డర్ కేసు పోలీసులు ఛేదించారు. ఆమెతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకున్నవారే ఈ పని చేసినట్లుగా గుర్తించారు.

Police solved murder case of a woman in Adilabad:   ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఒంటరి మహిళ అదృశ్యం కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. అది కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే కాదని, పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణ హత్య అని తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఈ హత్యలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.            

నవంబర్‌లో కనిపించకుండా పోయిన మహిళ                

పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ కేంద్రంలోని పిట్టలవాడకు చెందిన ఇమ్రానా జబీన్ (39) నవంబర్ 26, 2025 నుంచి కనిపించకుండా పోయింది. ఈ మేరకు ఆమె సోదరి ఫిర్యాదుతో మావల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, లోతుగా విచారణ జరిపిన పోలీసులకు ఇంద్రవెల్లికి చెందిన మొహమ్మద్ ఫారూక్  అనే వ్యక్తితో మృతురాలికి ఆర్థిక వివాదాలు ఉన్నట్లు తెలిసింది. ఫారూక్ ఆమె వద్ద నుండి రూ. 8.8 లక్షల నగదు తీసుకోవడంతో పాటు 8.5 తులాల బంగారాన్ని కూడా తన వద్ద ఉంచుకున్నాడు. తన సొంత అవసరాల కోసం ఆ డబ్బును, బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ఇమ్రానా గట్టిగా నిలదీయడంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఫారూక్ తన డ్రైవర్  బస్సీ రమేష్  తో కలిసి పథకం వేశాడు.                 

దర్యాప్తులో  అప్పు తీసుకున్న వ్యక్తే చంపినట్లు గుర్తించిన పోలీసులు                  

నిందితులు నవంబర్ 26న పథకం ప్రకారం ఇమ్రానా ఇంటికి వెళ్లి, డ్రైవర్ రమేష్ ఆమె కాళ్లు పట్టుకోగా, ఫారూక్ ఆమెను ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారులో మహారాష్ట్రలోని సర్కాని ఘాట్ అటవీ ప్రాంతానికి తరలించి, రోడ్డు కల్వర్ట్ సమీపంలోని గుంతలో పూడ్చిపెట్టారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను జనవరి 14న దస్నాపూర్ కూరగాయల మార్కెట్ వద్ద అదుపులోకి తీసుకోగా, వారు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితులు చూపిన సమాచారంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీయగా, దుస్తుల ఆధారంగా కుటుంబ సభ్యులు ఆమెను గుర్తించారు.           

మిస్సింగ్ కేసు .. హత్య కేసుగా మార్పు                 

ఈ కేసును మిస్సింగ్ సెక్షన్ నుంచి బీఎన్‌ఎస్ సెక్షన్ 103 (హత్య) కిందికి మార్చినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసును ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించిన సీఐ స్వామి నేతృత్వంలోని బృందాన్ని ఎస్పీ అభినందించారు.      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
IAS groom turns Fake: ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
Advertisement

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Embed widget