అన్వేషించండి

Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం

Adilabad Crime News: ఆదిలాబాద్ లో మహిళ మర్డర్ కేసు పోలీసులు ఛేదించారు. ఆమెతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకున్నవారే ఈ పని చేసినట్లుగా గుర్తించారు.

Police solved murder case of a woman in Adilabad:   ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఒంటరి మహిళ అదృశ్యం కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. అది కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే కాదని, పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణ హత్య అని తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఈ హత్యలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.            

నవంబర్‌లో కనిపించకుండా పోయిన మహిళ                

పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ కేంద్రంలోని పిట్టలవాడకు చెందిన ఇమ్రానా జబీన్ (39) నవంబర్ 26, 2025 నుంచి కనిపించకుండా పోయింది. ఈ మేరకు ఆమె సోదరి ఫిర్యాదుతో మావల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, లోతుగా విచారణ జరిపిన పోలీసులకు ఇంద్రవెల్లికి చెందిన మొహమ్మద్ ఫారూక్  అనే వ్యక్తితో మృతురాలికి ఆర్థిక వివాదాలు ఉన్నట్లు తెలిసింది. ఫారూక్ ఆమె వద్ద నుండి రూ. 8.8 లక్షల నగదు తీసుకోవడంతో పాటు 8.5 తులాల బంగారాన్ని కూడా తన వద్ద ఉంచుకున్నాడు. తన సొంత అవసరాల కోసం ఆ డబ్బును, బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ఇమ్రానా గట్టిగా నిలదీయడంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఫారూక్ తన డ్రైవర్  బస్సీ రమేష్  తో కలిసి పథకం వేశాడు.                 

దర్యాప్తులో  అప్పు తీసుకున్న వ్యక్తే చంపినట్లు గుర్తించిన పోలీసులు                  

నిందితులు నవంబర్ 26న పథకం ప్రకారం ఇమ్రానా ఇంటికి వెళ్లి, డ్రైవర్ రమేష్ ఆమె కాళ్లు పట్టుకోగా, ఫారూక్ ఆమెను ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారులో మహారాష్ట్రలోని సర్కాని ఘాట్ అటవీ ప్రాంతానికి తరలించి, రోడ్డు కల్వర్ట్ సమీపంలోని గుంతలో పూడ్చిపెట్టారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను జనవరి 14న దస్నాపూర్ కూరగాయల మార్కెట్ వద్ద అదుపులోకి తీసుకోగా, వారు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితులు చూపిన సమాచారంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీయగా, దుస్తుల ఆధారంగా కుటుంబ సభ్యులు ఆమెను గుర్తించారు.           

మిస్సింగ్ కేసు .. హత్య కేసుగా మార్పు                 

ఈ కేసును మిస్సింగ్ సెక్షన్ నుంచి బీఎన్‌ఎస్ సెక్షన్ 103 (హత్య) కిందికి మార్చినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసును ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించిన సీఐ స్వామి నేతృత్వంలోని బృందాన్ని ఎస్పీ అభినందించారు.      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
AP Assembly Sessions: అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్
మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
Kanpur Bank employee: నేను ఠాకూర్‌ను.. బ్యాంకులో రెచ్చిపోయిన ఉద్యోగిని - సోషల్ మీడియా కడిగేసింది!
నేను ఠాకూర్‌ను.. బ్యాంకులో రెచ్చిపోయిన ఉద్యోగిని - సోషల్ మీడియా కడిగేసింది!
Advertisement

వీడియోలు

Allu Arjun 42 New Rules Viral Video | బన్నీతో మాట్లాడాలంటే 42 రూల్స్ ఉన్నాయా.? వైరల్ వీడియోలో నిజమెంత.? | ABP Desam
Attack on PM Modi at Parliament | ప్రధాని మోదీపై మహిళా ఎంపీల ప్రీ ప్లాన్డ్ ఎటాక్.? | ABP Desam
India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
ICC Shocking Decision against PCB | ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలని ఐసీసీని కోరిన పాక్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
AP Assembly Sessions: అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్
మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
Kanpur Bank employee: నేను ఠాకూర్‌ను.. బ్యాంకులో రెచ్చిపోయిన ఉద్యోగిని - సోషల్ మీడియా కడిగేసింది!
నేను ఠాకూర్‌ను.. బ్యాంకులో రెచ్చిపోయిన ఉద్యోగిని - సోషల్ మీడియా కడిగేసింది!
Medchal Earthquake: మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
Chandrababu In Delhi: రాజధాని అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
Ustaad Bhagat Singh: పవన్ 'ఉస్తాద్' టీమ్‌కు షాక్... రిలీజుకు ముందు రెండో సాంగ్ లీక్!
పవన్ 'ఉస్తాద్' టీమ్‌కు షాక్... రిలీజుకు ముందు రెండో సాంగ్ లీక్!
Bad Hair Cut Case: రాంగ్ హెయిర్ కట్ కేసు.. మోడల్ కు 25 లక్షలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
రాంగ్ హెయిర్ కట్ కేసు.. మోడల్ కు 25 లక్షలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
Embed widget