అన్వేషించండి

Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం

Adilabad Crime News: ఆదిలాబాద్ లో మహిళ మర్డర్ కేసు పోలీసులు ఛేదించారు. ఆమెతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకున్నవారే ఈ పని చేసినట్లుగా గుర్తించారు.

Police solved murder case of a woman in Adilabad:   ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఒంటరి మహిళ అదృశ్యం కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. అది కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే కాదని, పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణ హత్య అని తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఈ హత్యలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.            

నవంబర్‌లో కనిపించకుండా పోయిన మహిళ                

పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ కేంద్రంలోని పిట్టలవాడకు చెందిన ఇమ్రానా జబీన్ (39) నవంబర్ 26, 2025 నుంచి కనిపించకుండా పోయింది. ఈ మేరకు ఆమె సోదరి ఫిర్యాదుతో మావల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, లోతుగా విచారణ జరిపిన పోలీసులకు ఇంద్రవెల్లికి చెందిన మొహమ్మద్ ఫారూక్  అనే వ్యక్తితో మృతురాలికి ఆర్థిక వివాదాలు ఉన్నట్లు తెలిసింది. ఫారూక్ ఆమె వద్ద నుండి రూ. 8.8 లక్షల నగదు తీసుకోవడంతో పాటు 8.5 తులాల బంగారాన్ని కూడా తన వద్ద ఉంచుకున్నాడు. తన సొంత అవసరాల కోసం ఆ డబ్బును, బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ఇమ్రానా గట్టిగా నిలదీయడంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఫారూక్ తన డ్రైవర్  బస్సీ రమేష్  తో కలిసి పథకం వేశాడు.                 

దర్యాప్తులో  అప్పు తీసుకున్న వ్యక్తే చంపినట్లు గుర్తించిన పోలీసులు                  

నిందితులు నవంబర్ 26న పథకం ప్రకారం ఇమ్రానా ఇంటికి వెళ్లి, డ్రైవర్ రమేష్ ఆమె కాళ్లు పట్టుకోగా, ఫారూక్ ఆమెను ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారులో మహారాష్ట్రలోని సర్కాని ఘాట్ అటవీ ప్రాంతానికి తరలించి, రోడ్డు కల్వర్ట్ సమీపంలోని గుంతలో పూడ్చిపెట్టారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను జనవరి 14న దస్నాపూర్ కూరగాయల మార్కెట్ వద్ద అదుపులోకి తీసుకోగా, వారు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితులు చూపిన సమాచారంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీయగా, దుస్తుల ఆధారంగా కుటుంబ సభ్యులు ఆమెను గుర్తించారు.           

మిస్సింగ్ కేసు .. హత్య కేసుగా మార్పు                 

ఈ కేసును మిస్సింగ్ సెక్షన్ నుంచి బీఎన్‌ఎస్ సెక్షన్ 103 (హత్య) కిందికి మార్చినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసును ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించిన సీఐ స్వామి నేతృత్వంలోని బృందాన్ని ఎస్పీ అభినందించారు.      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Advertisement

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
I-PAC Raid Case: బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
Zubeen Garg Death: మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
TMMTMTTM Box Office: రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
Embed widget