అన్వేషించండి

YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!

YS Jagan Tobacco Procurement Centre: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు బ్యారెన్లను పరిశీలించిన మాజీ సీఎం వైఎస్ జగన్. కూటమి పాలనలో దళారుల రాజ్యం నడుస్తోందని, పొగాకు ధరలు పడిపోయాయని తీవ్ర ఆగ్రహం.

YSRCP Farmers Protest: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం లోని పొగాకు కొనుగోలు కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించారు. అక్కడ నిల్వ ఉంచిన పొగాకు బ్యారెన్లను నేరుగా పరిశీలించిన అనంతరం, పంటకు గిట్టుబాటు ధర రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పొగాకు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్‌.. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి రైతులను కోలుకోలేని విధంగా దగా చేస్తుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శించారు.
 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు ధర రూ. 289 వరకు పలికిందని, కానీ నేడు కూటమి పాలనలో ధర ఏకంగా రూ. 236కి దిగజారిపోయిందని జగన్‌ గణాంకాలతో సహా వివరించారు. ఓవైపు ఎరువులు, కూలీల ఖర్చు పెరిగి పెట్టుబడులు భారమవుతుంటే, మరోవైపు దిగుబడికి వచ్చే రాబడి దారుణంగా తగ్గిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 12 శాతం పొగాకు పంటను మాత్రమే కొనుగోలు చేసిందని, మిగిలిన 88 శాతం పంటను వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి దళారులతో రాజీ పడిందని మండిపడ్డారు. 

తమ పాలనా కాలంలో రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలను సమర్థవంతంగా అందించామని, కానీ నేడు ఆ సదుపాయాలు పూర్తిగా నిలిచిపోయాయని జగన్ గుర్తుచేశారు.  ఎన్నికల ముందు పీఎం కిసాన్ పథకానికి అదనంగా ప్రతి రైతుకూ రూ. 20 వేలు ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు.. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని నీరుగార్చడమే కాకుండా, తమ ప్రభుత్వంలో అమలైన  ఉచిత పంటల బీమా  పథకాన్ని కూడా రద్దు చేసి రైతుల పొట్ట కొట్టారు" అని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధర లేక దిగుబడి అమ్ముకోలేక వెంకటేశ్వరరావు అనే పొగాకు రైతు ఆత్మహత్య చేసుకుంటే, ఆ కుటుంబాన్ని పరామర్శించే కనీస మానవత్వం కూడా ప్రభుత్వ పెద్దల్లో లేకపోవడం శోచనీయమన్నారు.

తెలుగుదేశం పాలనలో వ్యవసాయంతో పాటు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు పూర్తిగా విధ్వంసమయ్యాయని మాజీ సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులు రోడ్డున పడి ఆక్రోశిస్తున్నా సీఎం చంద్రబాబుకు ఆత్మహత్యలు కనిపించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, రైతులపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ మొదటి నుంచీ ప్రజలను, రైతులను వెన్నుపోటు పొడిచే రాజకీయాన్నే నమ్ముకుందని ఘాటుగా విమర్శించారు.

కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని, రైతులకు రావాల్సిన ప్రతి పైసా గిట్టుబాటు ధర లభించే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని జగన్ స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి పొగాకు రైతుకూ తక్షణమే ప్రభుత్వం మద్దతు ధర కల్పించి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని రూ. 10 లక్షల నష్టపరిహారంతో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము విశ్రమించేది లేదని భరోసా ఇచ్చారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget