వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై 31 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 13 సంవత్సరాలు గడిచినా, ఈ కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
వైఎస్ జగన్పై ఉన్న 31 కేసుల విచారణ 13 ఏళ్లుగా సాగుతోందని తెదేపా ఎంపీ విజయ్ రాజ్యసభలో పేర్కొన్నారు. సీబీఐ కోర్టుల జాప్యం చట్టంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

- టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ జగన్ 31 కేసుల జాప్యంపై ప్రస్తావించారు.
- డిశ్చార్జ్ పిటిషన్లు, జడ్జీల బదిలీల వల్ల విచారణ ఆలస్యమవుతోందన్నారు.
- పదమూడేళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు.
Andhra Pradesh News | న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన 31 క్రిమినల్ కేసులలో, 13 ఏళ్లు గడిచినా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో చర్చలో ఆయన మాట్లాడుతూ కేసుల పెండింగ్ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
డిశ్చార్జ్ పిటిషన్లకే అన్నేళ్లు పడితే.. అసలు విచారణకు ఎన్నేళ్లు..
మాజీ సీఎం జగన్తో పాటు ఈ కేసుల్లో ఉన్న ఇతర నిందితులు పదే పదే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తుండటం, ఈ విచారణలు చేపడుతున్న వేర్వేరు న్యాయమూర్తులు తుది తీర్పు ఇవ్వకముందే బదిలీ కావడంతో ప్రక్రియ తీవ్రంగా జాప్యమవుతోందని ఎంపీ చింతకాయల విజయ్ పేర్కొన్నారు. జడ్జీల కొరత ఉండటంతో పాటు మరోవైపు వరుస బదిలీల కారణంగా కేసుల విచారణ ముందుకు సాగడం లేదన్నారు. కేవలం డిశ్చార్జ్ పిటిషన్లకే 13 ఏళ్లు పడితే ఇక ప్రధాన విచారణ ఎప్పుడు మొదలవుతుందని, తుది తీర్పు ఎప్పటికి వస్తుందని ఎంపీ విజయ్ ప్రశ్నించారు.
కేసుల పరిష్కారంపై కేంద్రం ఫోకస్ చేయాలి
ఈ కేసు విచారణల జాప్యం అనేది కేవలం ఒక్క వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, దేశంలో చట్టపరిపాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. కనుక ప్రత్యేక సీబీఐ కోర్టుల పనితీరు, కేసుల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా కోరారు. కాగా, రాజ్యసభలో న్యాయమూర్తుల పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ విజయ్ జగన్ కేసులను ప్రస్తావించడంపై వైసీపీ ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. అయితే తాను సమస్యను మాత్రమే ప్రస్తావించానని, ఎవరినీ టార్గెట్ చేయలేదని ఎంపీ పేర్కొన్నారు.న
Frequently Asked Questions
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి?
జగన్ కేసుల విచారణ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
పదే పదే డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం, న్యాయమూర్తుల బదిలీలు, జడ్జీల కొరత కారణంగా విచారణ ప్రక్రియ తీవ్రంగా జాప్యమవుతోంది.
కేసుల పరిష్కారంపై ఎంపీ చింతకాయల విజయ్ కేంద్రానికి ఏమని సూచించారు?
ప్రత్యేక సీబీఐ కోర్టుల పనితీరు, కేసుల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ఇది చట్టపాలనపై ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశం అన్నారు.
ఎంపీ చింతకాయల విజయ్ జగన్ కేసులను ఏ చర్చలో ప్రస్తావించారు?
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ఈ కేసులను ప్రస్తావించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























