అన్వేషించండి

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్

వైఎస్ జగన్‌పై ఉన్న 31 కేసుల విచారణ 13 ఏళ్లుగా సాగుతోందని తెదేపా ఎంపీ విజయ్ రాజ్యసభలో పేర్కొన్నారు. సీబీఐ కోర్టుల జాప్యం చట్టంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ జగన్ 31 కేసుల జాప్యంపై ప్రస్తావించారు.
  • డిశ్చార్జ్ పిటిషన్లు, జడ్జీల బదిలీల వల్ల విచారణ ఆలస్యమవుతోందన్నారు.
  • పదమూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు.

Andhra Pradesh News | న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన 31 క్రిమినల్ కేసులలో, 13 ఏళ్లు గడిచినా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో చర్చలో ఆయన మాట్లాడుతూ కేసుల పెండింగ్ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

డిశ్చార్జ్ పిటిషన్లకే అన్నేళ్లు పడితే.. అసలు విచారణకు ఎన్నేళ్లు..
మాజీ సీఎం జగన్‌తో పాటు ఈ కేసుల్లో ఉన్న ఇతర నిందితులు పదే పదే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తుండటం, ఈ విచారణలు చేపడుతున్న వేర్వేరు న్యాయమూర్తులు తుది తీర్పు ఇవ్వకముందే బదిలీ కావడంతో ప్రక్రియ తీవ్రంగా జాప్యమవుతోందని ఎంపీ చింతకాయల విజయ్ పేర్కొన్నారు. జడ్జీల కొరత ఉండటంతో పాటు మరోవైపు వరుస బదిలీల కారణంగా కేసుల విచారణ ముందుకు సాగడం లేదన్నారు. కేవలం డిశ్చార్జ్ పిటిషన్లకే 13 ఏళ్లు పడితే ఇక ప్రధాన విచారణ ఎప్పుడు మొదలవుతుందని, తుది తీర్పు ఎప్పటికి వస్తుందని ఎంపీ విజయ్ ప్రశ్నించారు.

కేసుల పరిష్కారంపై కేంద్రం ఫోకస్ చేయాలి

ఈ కేసు విచారణల జాప్యం అనేది కేవలం ఒక్క వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, దేశంలో చట్టపరిపాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. కనుక ప్రత్యేక సీబీఐ కోర్టుల పనితీరు, కేసుల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా కోరారు. కాగా, రాజ్యసభలో న్యాయమూర్తుల పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ విజయ్ జగన్ కేసులను ప్రస్తావించడంపై వైసీపీ ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. అయితే తాను సమస్యను మాత్రమే ప్రస్తావించానని, ఎవరినీ టార్గెట్ చేయలేదని ఎంపీ పేర్కొన్నారు.న

Also Read: YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!

Frequently Asked Questions

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై 31 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 13 సంవత్సరాలు గడిచినా, ఈ కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.

జగన్ కేసుల విచారణ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

పదే పదే డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం, న్యాయమూర్తుల బదిలీలు, జడ్జీల కొరత కారణంగా విచారణ ప్రక్రియ తీవ్రంగా జాప్యమవుతోంది.

కేసుల పరిష్కారంపై ఎంపీ చింతకాయల విజయ్ కేంద్రానికి ఏమని సూచించారు?

ప్రత్యేక సీబీఐ కోర్టుల పనితీరు, కేసుల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ఇది చట్టపాలనపై ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశం అన్నారు.

ఎంపీ చింతకాయల విజయ్ జగన్ కేసులను ఏ చర్చలో ప్రస్తావించారు?

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ఈ కేసులను ప్రస్తావించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Embed widget