అన్వేషించండి

MMTS Train Incident: ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

Women Safety In MMTS Trains | ఇటీవల హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం జరగడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకుంది.

Panic mode buttons in MMTS Trains | హైదరాబాద్: మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ మోడ్ బటన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.  పానిక్ బటన్ ప్రెస్ చేయగానే క్షణాల వ్యవధిలో రైల్వే పోలీస్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. RPF తో ఎల్లప్పుడూ నిఘా ఉంటుందని చెబుతున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆరా తీశారు. 

ఇటీవల హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైలులోనే మహిళపై అత్యాచారయత్నం జరగడం కలకలం రేపింది. దాంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్లు, ప్రైవేట్ ప్రాంతాలతో పాటు పబ్లిక్ స్థలాల్లోనూ బాలికలు, మహిళలకు రక్షణ కరువైందని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై ఎంఎంటీఎస్ రైళ్లలో  ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక రైల్వే పోలీస్ అధికారి పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. ఇకపై రైళ్లలో ఒక పోలీస్ తో బందోబస్తు ఉంటుందని, మహిళలకు మరింత భద్రత కల్పిస్తామని అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు.

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం
ఈ ఘటన తెలంగాణ మొత్తాన్ని షేక్ చేసింది. కదులుతున్న రైలు నుంచి యువతి భయాందోళనతో కిందకి దూకేసిందంటే మహిళలకు రక్షణపై సందేహాలు నెలకొన్నాయి. శనివారం (మార్చి 22న) సాయంత్రం ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు ఓ యువతి మేడ్చల్ నుంచి ఎంఎంటీఎస్ రైలులో సికింద్రాబాద్ కు వెళ్లింది. పని పూర్తి చేసుకుని రాత్రి 8 గంటలకు తిరిగి ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. అల్వాల్ స్టేషన్లో కంపార్ట్ మెంట్లో ఉన్న ఇద్దరు మహిళలు దిగిపోయారు. యువతి ఒంటరిగా ఉందని గమనించి నిందితుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆమెను అసభ్యకరంగా తాకుతూ తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు. ఆందోళనకు గురైన యువతి అతడ్ని ప్రతిఘటించి కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ఆమెను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వంగా 108లో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

ఎంఎంటీఎస్‌ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలించడంతో మంగళవారం ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు గంజాయికి బానిసైన పాత నేరస్తుడు అని పోలీసులు తెలిపారు. మేడ్చల్‌ జిల్లా గౌడవల్లికి చెందిన జంగం మహేశ్‌ యువతిని వేధించాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి ఫొటోను చూపించగా.. యువతి సరిగ్గా గుర్తించలేదని సమాచారం. మరోవైపు నిందితుడ మహేశ్‌కు వివాహం కాగా, కొన్ని నెలల కిందట భార్య అతడ్ని వదిలేసింది. తల్లిదండ్రులు సైతం చనిపోవడంతో మహేశ్ ఒంటరయ్యాడు. గంజాయి సేవించడం లాంటి చెడు వ్యసనాలకు బానిస అయ్యాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Thala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSKKavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్CSK Failures in IPL 2025 | MS Dhoni కెప్టెన్ అయినా రాతను మార్చుకోలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
IPL 2025 SRH VS CSK Result Update: చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
చేపాక్ కోట బద్దలు.. చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Embed widget