అన్వేషించండి

Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ

Kakinada Latest News : వైఎస్‌ఆర్‌సీపీ లీడర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆక్వా ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు సీజ్ చేశారు. గడువు ఇచ్చినా లోపాలు సరి చేసుకోలేదని తేల్చారు.

Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి కాలుష్య నియంత్రణ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన రొయ్యల ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అక్కడి నుంచి వ్యర్థాలను బయటకు వదులుతున్నారని నిర్దారించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఈ పేరు కేంద్రంగా కాకినాడలో చాలా కాలం నుంచి రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీలో కీలక వ్యక్తిగా ఎదిగిన ఆయన వివాదాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా  ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు వెలికితీయడం మొదలు పెట్టింది. 

ద్వారంపూడి అక్రమాల్లో భాగంగా ప్రత్తిపాడు మండలం లంపకలోవలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలను శుద్ధి చేయకుండానే బయటకు విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఆ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఇన్ని రోజులు తప్పుడు సమాచారంతో అధికారులను ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారని ఇప్పుడు మాత్రం దొరికిపోయారని అంటున్నారు. ఆ పరిశ్రమలో వ్యర్థాలను బయటకు వదలడమే కాకుండా అనుమతి లేకుండా ఓ ఐస్‌ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇలా చాలా రూల్స్ అతిక్రమించారని అధికారులు నిర్దారణకు వచ్చారు. 

Also Read: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్

ద్వారంపూడి నిర్వహించే రొయ్యల ఫ్యాక్టరీలో అక్రమాలను గుర్తించిన తర్వాత సరిదిద్దుకోవడానికి అధికారులు మూడు నెలలు గడువు ఇచ్చారు. అయినా అక్కడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. వారి నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. దీంతో మరోసారి తనిఖీలు చేసిన అధికారులు ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేశారు. 

కాకినాడ జిల్లాలో ద్వారంపూడికి రెండు రొయ్యల ఫ్యాక్టరీలు ఉన్నాయి. రూల్స్ పాటించలేదని కరప మండలం గురజనాపల్లిలో ఉన్న ఫ్యాక్టరీని ఇప్పటికే సీజ్ చేశారు. ఇప్పుడు రెండో ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశారు. మొదట ఈ ఫ్యాక్టిరీని జులై 11 తనిఖీలు చేసిన అధికారులు రూల్స్ పాటించడం లేదని గుర్తించారు. ఆర్‌టీపీఎంస్‌ వ్యవస్థ , సూయేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ లేదని తేలింది. ఫ్యాక్టరీ వాడే విద్యుత్ విషయంలో కూడా తేడాలు ఉన్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా ఐస్‌ప్లాంట్‌ రన్ చేస్తున్నట్టు స్పష్టమైంది. కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థజలాలు పరీక్షిస్తే  శుద్ధి చేయలేదని కూడా గుర్తించారు. 

ఫ్యాక్టరీలో ఇలాంటి నియమాల ఉల్లంఘన జరగడానికి కారణాలు చెప్పాలని వివరణ కోరుతూ కంపెనీ యాజమాన్యానికి ఆగస్టులో నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన కంపెనీ... నవంబర్ వరకు గడువు కోరింది. నవంబర్ పూర్తినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి పీసీబీ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించారు. మార్పులు లేవని గుర్తించి కంపెనీ సీజ్‌ చేశారు. 

Also Read: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

మరోవైపు కాకినాడ కేంద్రం జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా అంశంపై కూడా అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ రవాణా వెనుక ద్వారంపూడి హస్తం ఉందని కూటమి నేతలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని పవన్ లాంటి వాళ్లు అస్త్రంగా మార్చుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
MEGA157: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
Venkaiah Naidu: మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP DesamGT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
MEGA157: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
Venkaiah Naidu: మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
TGPSC Group1 Results: గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
LRS In Telangana: సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
Happy Ugadi  Shubh Muhurat 2025: ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
Happy Ugadi Wishes in Telugu 2025: మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
Embed widget