అన్వేషించండి

YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్

Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణా జాతీయ కుంభకోణమని.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.

YS Sharmila Comments On Ration Mafia: రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఓ పెద్ద మాఫియా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమన్న ఆమె.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రేషన్ బియ్యం (Ration Rice) స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని.. పేదల పొట్టకొట్టి రూ.48 వేల కోట్ల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తిని దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్లు దీని వెనుక కింది నుంచి ఉన్నత స్థాయి వరకూ కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని విమర్శించారు. 'ఈ వ్యవహారంలో ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కుతుండడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరిగిందంటే.. మన చెక్ పోస్టుల పని తీరు ఎలా ఉందో అంచనా వెయ్యొచ్చు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.' అని పేర్కొన్నారు.

'దీని వెనుకున్న దొంగలెవరు.?'

'పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అక్రమంగా పోర్టు వరకూ ఎలా చేర్చారు.?. మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు.? దీని వెనుక ఉన్న దొంగలెవరు? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు.?, అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా.? తీగ లాగితే వెనుకున్న డొంక ఎక్కడ?. మిల్లర్ల చేతివాటం ఉందా?. రేషన్ డీలర్ల మాయాజాలమా? అనునిత్యం తనిఖీల సంగతేంటి.?. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలి. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారు.' అని షర్మిల మండిపడ్డారు.

కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టును సందర్శించి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. సదరు షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. జగన్ ప్రభుత్వ హయాంలో చివరి మూడేళ్లలో కాకినాడ పోర్టు నుంచి రూ.48,537 కోట్ల విలువైన 1.31 టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతున్నట్లు చెప్పారు.

Also Read: Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Tamilnadu ED: క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
Advertisement

వీడియోలు

Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
Hurricane Melissa batters Jamaica | జ‌మైకాను నాశనం చేసిన మెలిసా హరికేన్ | ABP Desam
US Airforce Records Inside Hurricane Melissa | హరికేన్ మెలిస్సా ఎంత ఉద్ధృతంగా ఉందో చూడండి | ABP Desam
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Tamilnadu ED: క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
Alert for train passengers: రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ -  తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ - తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
New districts in AP: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది  దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
Amazon layoff: ఉద్యోగుల్ని విచ్చలవిడిగా  తీసేస్తున్న అమెజాన్ - ఏఐనే కారణమా?
ఉద్యోగుల్ని విచ్చలవిడిగా తీసేస్తున్న అమెజాన్ - ఏఐనే కారణమా?
Hero Splendor Price : హీరో స్ప్లెండర్ ఢిల్లీలో కొనడం మంచిదా? హైదరాబాద్‌లో కొనడం బెటరా? ఎక్కడ చౌకగా లభిస్తుంది?
హీరో స్ప్లెండర్ ఢిల్లీలో కొనడం మంచిదా? హైదరాబాద్‌లో కొనడం బెటరా? ఎక్కడ చౌకగా లభిస్తుంది?
Embed widget