అన్వేషించండి

YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్

Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణా జాతీయ కుంభకోణమని.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.

YS Sharmila Comments On Ration Mafia: రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఓ పెద్ద మాఫియా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమన్న ఆమె.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రేషన్ బియ్యం (Ration Rice) స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని.. పేదల పొట్టకొట్టి రూ.48 వేల కోట్ల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తిని దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్లు దీని వెనుక కింది నుంచి ఉన్నత స్థాయి వరకూ కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని విమర్శించారు. 'ఈ వ్యవహారంలో ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కుతుండడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరిగిందంటే.. మన చెక్ పోస్టుల పని తీరు ఎలా ఉందో అంచనా వెయ్యొచ్చు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.' అని పేర్కొన్నారు.

'దీని వెనుకున్న దొంగలెవరు.?'

'పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అక్రమంగా పోర్టు వరకూ ఎలా చేర్చారు.?. మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు.? దీని వెనుక ఉన్న దొంగలెవరు? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు.?, అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా.? తీగ లాగితే వెనుకున్న డొంక ఎక్కడ?. మిల్లర్ల చేతివాటం ఉందా?. రేషన్ డీలర్ల మాయాజాలమా? అనునిత్యం తనిఖీల సంగతేంటి.?. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలి. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారు.' అని షర్మిల మండిపడ్డారు.

కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టును సందర్శించి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. సదరు షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. జగన్ ప్రభుత్వ హయాంలో చివరి మూడేళ్లలో కాకినాడ పోర్టు నుంచి రూ.48,537 కోట్ల విలువైన 1.31 టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతున్నట్లు చెప్పారు.

Also Read: Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Balakrishna: అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
Breaking News: ఢిల్లీలో కిషన్ రెడ్డితో పాటు వెళ్లి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీలో కిషన్ రెడ్డితో పాటు వెళ్లి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
Chandrababu Naidu RTGS Review Meeting: ఫేక్ ప్రచారాలపై ఉక్కుపాదం మోపాల్సిందే - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు సీరియస్
ఫేక్ ప్రచారాలపై ఉక్కుపాదం మోపాల్సిందే - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు సీరియస్
Duvvada Madhuri Kotturu Police Station: దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandamuri Balakrishna: అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
Tungabhadra Dam New Gates Inauguration 2026: తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
Duvvada Madhuri Kotturu Police Station: దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
Revanth Reddy Delhi Tour: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
AP Weather Update Rains: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
Keir Starmer Resigns UK PM 2026: బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
Sreeleela : శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
Embed widget