Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Sandeepa Virk Money Laundering Case: రూ. 6 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సందీపా విర్క్ జైలుకు వెళ్లి వచ్చారు. అనంతరం తన బాధను పంచుకున్నారు. జైలు అనుభవం నరకమన్నారు. చావు కోసం ప్రార్థించినట్లు తెలిపారు.

బాలీవుడ్ నటి సందీపా విర్క్ దాదాపు 4 నెలల పాటు తీహార్ జైలులో ఉన్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదైన కేసులో ఆమెను అరెస్టు చేశారు. రూ. 6 కోట్ల కేసులో ఇరుక్కున్న సందీపాకు ఇటీవల బెయిల్ లభించింది. ఇప్పుడు ఆమె జైలు అనుభవాన్ని వెల్లడించారు. అంతే కాకుండా... తాను ప్రతిరోజూ ఎలా మరణం కోసం ప్రార్థించేదో కూడా చెప్పారు.
బాధను వెళ్ళగక్కిన సందీపా విర్క్
ఇటీవల సిమ్రాన్ జోత్ మక్కర్తో సందీపా విర్క్ మాట్లాడుతూ... జైలులో తాను గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆవిడ మాట్లాడుతూ... ''తీహార్ లాంటి ప్రదేశానికి శత్రువును కూడా పంపించకూడదు. నేను అయితే నా శత్రువులను అసలు పంపించను. తీహార్కు మొదటిసారి వెళ్ళినప్పుడు... దేవుడితో 'దీనికి నేను అర్హురాలిని కాదు' అన్నాను. మొదటి రోజు వాష్రూమ్కి వెళ్ళిన అనుభవాన్ని అసలు మరువలేను. సాధారణంగా ప్రజలు అంతా కర్మ ఫలం అంటారు కదా... బహుశా గత జన్మలో తెలిసో తెలియకుండానో నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. అయినా సరే ఆ జైలు జీవితానికి నేను అర్హురాలిని కాదనిపించింది'' అని చెప్పారు.
దేవుణ్ని చావు కోసం ప్రార్థించాను!
జైలు జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణాలను సందీపా విర్క్ ప్రస్తావించారు. అలసిపోయినప్పుడు మరణం వచ్చి తనను తీసుకు వెళ్లాలని ప్రార్థించేదాన్ని అని ఆమె చెప్పారు. ''నా కారణంగా తల్లిదండ్రులు నన్ను కలవడానికి జైలుకు రావాల్సి వచ్చినప్పుడు ఎంతో బాధ వేసేది. వారిని క్షమించమని కూడా అడిగాను. నా తల్లిదండ్రులు, తోబుట్టువులు నాకు ఎంతో అండగా నిలబడ్డారు. ఎందుకంటే... నేను ఎవరో నా వాళ్ళకు, ప్రజలకు తెలుసు'' అని సందీపా విర్క్ అన్నారు.
Also Read: Vijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?
View this post on Instagram
సందీపా విర్క్ ఇంకా మాట్లాడుతూ... ''తీహార్ జైలు లోపల 500 మందితో కలిసి జీవిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి? నా ఆరోగ్యం చాలా క్షీణించింది. ఒత్తిడి కారణంగా నేను ఎవరి సహాయం లేకుండా నిలబడలేకపోయాను. ఇప్పుడు ఆ రోజుల గురించి ఆలోచిస్తే నాకు ఏడుపు వస్తుంది'' అని అన్నారు. తీహార్ జైలు గురించి మాట్లాడుతూ... ''వాష్రూమ్ చాలా మురికిగా ఉంది. నేలపై పడుకోవాలి. బ్యారక్లు ఉదయం 6 గంటలకు తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు మూస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు తెరుస్తారు. సాయంత్రం 6 గంటలకు మూస్తారు. ఫుడ్ బాగోదు... ప్రతి రోజూ అదే పప్పు, అదే కూరలు, నాలుగు రొట్టెలు, అన్నం ఇస్తారు. ఏమీ తినాలనిపించదు'' అని చెప్పారు.
Also Read: Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్కు రి'యాక్షన్'... గీతూ రాయల్కు ఏడుపు ఒకటే తక్కువ
అసలు సందీపా విర్క్ కేసు ఏమిటి?
ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 27, 2025న సందీపా విర్క్కు బెయిల్ మంజూరు చేసింది. అప్పటికే నాలుగు నెలలకు పైగా జైలులో ఉండటంతో పాటు ఆ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ గుప్తా ఇంకా పరారీలో ఉన్నందున కేసును త్వరగా ముగిసే అవకాశం లేదని కోర్టు పేర్కొంది. ఓ కుంభకోణానికి సంబంధించిన డబ్బును తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సందీపా విర్క్. ఓ వ్యక్తికి సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తామని ప్రామిస్ చేసి దాదాపు 6 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించారట. ఈ కేసులో 2008 నుంచి 2013 మధ్య జరిగిన పాత లావాదేవీలకు సంబంధించినవని కోర్టు కూడా గుర్తించింది. సాధారణ చట్టపరమైన నిబంధనల ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయబడింది.
Also Read: Renu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు























