BR Naidu Deepfake Videos: టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
TTD Chairman BR Naidu | మహిళతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అవన్నీ డీప్ ఫేక్ వీడియోలు అంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

అమరావతి: సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రంగా స్పందించారు. కొందరు వ్యక్తులు నకిలీ డీప్ఫేక్ వీడియోలను సృష్టించి, తన వ్యక్తిగత ప్రతిష్టను భంగపరచడమే కాకుండా, పవిత్రమైన టీటీడీ సంస్థ గౌరవాన్ని దిగజార్చేందుకు కుట్ర పన్నారని బీఆర్ నాయుడు ఆరోపించారు. ఈ మేరకు అప్రతిష్ట పాలు చేసేలా సాగుతున్న ఈ ప్రచారాన్ని అరికట్టాలని కోరుతూ ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర..
ఆధునిక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తన రూపాన్ని అనుకరించేలా కృత్రిమ వీడియోలను తయారు చేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. ఈ వీడియోల్లోని కంటెంట్ అంతా పూర్తిగా అసత్యమని, కావాలనే వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పక్కా పథకం ప్రకారం ఈ కుట్ర సాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
— B R Naidu (@BollineniRNaidu) March 1, 2026
వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు.
AI సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం…
వైసీపీ వ్యక్తుల హస్తం ఉందని ఆరోపణలు..
ఈ దుష్ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని బి.ఆర్. నాయుడు ఆరోపించారు. ప్రధానంగా వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు తనపై ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, దీనిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఇటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ విభాగం తన ఫిర్యాదుపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ నాయుడు కోరారు.
























