అన్వేషించండి

Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Kakinada Port News | ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.

PD Act Against Illegal Transportation of PDS Rice | అమరావతి: పేదలకు ప్రభుత్వాలు అందించే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న విదేశీ నౌక (Stella Ship)పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రి నాదెండ్ల అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులతో  సమీక్ష సమావేశం జరిగింది. కాకినాడ పోర్టులోని అయిదు వేర్ హౌసుల్లో సార్టెక్స్ మిషన్లు ఉన్న అంశంపై చర్చించారు. వేర్ హౌసుల్లో యంత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారని మారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను రాష్ట్ర మంత్రులు ప్రశ్నించారు. సార్టెక్స్ యంత్రాలను ఏర్పాటుపై విచారణ చేపట్టాలని, అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఆంధ్రప్రదేశ్ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న బియ్యం, ఇతరత్రా అక్రమ రవాణా వ్యవహారంపై మంత్రులు సమీక్షలో కీలకంగా చర్చించారు. నాదెండ్ల, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ జరిపిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకనుంచి ఎవరైనా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం. కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థ బలోపేతం చేయాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టు భద్రత కోసం ఛీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నియమించాలని చర్చించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని మంత్రులు భావిస్తున్నారు. 

కాకినాడ పోర్టుపై స్పెషల్ ఫోకస్
కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకూ జరిగిన రవాణా కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కాకినాడ పోర్టుకు వెళ్లే లారీల నుంచి అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నాదెండ్ల మనోహర్. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా ఓడ ఘటనలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదట కాకినాడ కలెక్టర్ , కొందరు ఉన్నతాధికారులతో వెళ్లి కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ సాహసం దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. 

ఆ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి వచ్చాక కాకినాడ పోర్టు విషయంపై ఫోకస్ చేశారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కొందరు ఉన్నతాధికారులతో కలిసి వెళ్లి పవన్ కళ్యాణ్ కాకినాడ యాంకరేజ్ పోర్టులో తనిఖీలు చేయడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను అధికారులు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ తూర్పు దేశంలో భద్రతకు ముప్పు పొంచి ఉందని, కాకినాడ పోర్టులో కేవలం 16, 17 మంది అధికారులే ఉన్నారని.. టన్నుల కొద్దీ రేషన్ బియ్యం విదేశాలకు రవాణా చేశారని ఆరోపించారు. సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. అయితే కేంద్రం పరిధిలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి చర్యలు తీసుకునే అధికారం లేదని, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిబంధనలు చెబుతున్నారు. 

Also Read: Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Embed widget