అన్వేషించండి

చెత్తే సంపద-హైదరాబాద్ చుట్టూ ఎనర్జీ ప్లాంట్‌ల ఏర్పాటుకు వేగంగా అడుగులు

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జవహర్‌నగర్‌లో 19.5  మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తాజాగా దాన్ని 24 మెగా వాట్స్‌కు  పెంచారు. మరో 24 మెగావాట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది.


చెత్తే సంపద-హైదరాబాద్ చుట్టూ ఎనర్జీ ప్లాంట్‌ల ఏర్పాటుకు వేగంగా అడుగులు

హైదరాబాద్ నగరం రోజురోజుకూ వేగంగా అభివృద్ది చెందటంతోపాటు అంతే వేగంగా నలుదిశలా విస్తరిస్తోంది. రోజువారి అవసరాలతోపాటు వ్యర్థాలు కూడా పెరుగుతున్నాయి. భాగ్యనగరంలో రోజువారీ సేకరించిన చెత్తను నిల్వ ఉంచకుండా, ట్రీట్మెంట్ డిస్పోజల్ తరహాలో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ వేగంగా అడుగులేస్తోంది. దీనిలో భాగంగా జిహెచ్ఎంసి పరిధితోపాటు, చుట్టూ పక్కల నగర పాలక సంస్థలలో సేకరించిన టన్నుల కొద్ది వ్యర్థాలను ఎప్పటి కప్పుడు నిల్వ ఉండకుండా డిస్పోజల్ చేసే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది జిహెచ్ ఎంసీ.

భాగ్యనగరంతోపాటు చుట్టుప్రక్కల మున్సిపాలిటీల పరిధిలో రోజువారి వ్యర్థాలు ప్రతిరోజు సుమారు 7000 నుంచి 7500 మెట్రిక్ టన్నుల చెత్త ఉంటుంది. సేకరించిన చెత్తను నిల్వ ఉంచకుండా ట్రీట్మెంట్ డిస్పోజల్ చేసే ప్రక్రియ అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువుగా మార్చడం, బయోగ్యాస్ తయారు చేయడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం అంతేకాదు పొడి చెత్తలో మండే గుణం ఉన్న వ్యర్థాలను పోగు చేసి విద్యుత్ తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఇలా చెత్తతో సంపదను సృష్టించేందుకు జిహెచ్‌ఎంసీ వేగంగా అడుగులేస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జవహర్‌నగర్‌లో 19.5  మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తాజాగా దాన్ని 24 మెగా వాట్స్‌కు  పెంచారు. మరో 24 మెగావాట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. జవహర్ నగర్‌లో మొత్తం 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ త్వరలో సిద్దం కాబోతోంది. ఇప్పటికే వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ గతంలో ఉన్న 19.8 మెగా వాట్ ప్లాంట్ కోసం రోజుకు సుమారు 1300 టన్నుల నుంచి 1500 టన్నుల వ్యర్థాలు (ఆర్.డి.ఎఫ్) ఉపయోగిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 6.35 లక్షల ఆర్ డి ఎఫ్ (Refuse Derived Fuel) ను వినియోగించుకొని 225 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు.

ఇలా చెత్తతో సంపద సృష్టించాలని ఉద్దేశ్యంతో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పేందుకు జిహెచ్ఎంసి చర్యలు తీసుకుంది. సేకరించిన చెత్తను వెను వెంటనే నిల్వ ఉంచుకోకుండా మొత్తాన్ని వినియోగించుకోవాలని జిహెచ్ఎంసి ముఖ్య ఉద్దేశ్యం. చెత్తతో సంపద సృష్టించేందుకు నగరం నలువైపులా వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌లను ఏర్పాటుకు జిహెచ్ఎంసి సిద్దమవుతోంది. ఇప్పటికే దుండిగల్‌లో మరో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. ఇవి మార్చి నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్లాంట్ ఉత్పత్తి ఆరంభించిన వేళ మరో 1000 నుంచి 1200 మెట్రిక్ టన్నుల చెత్త అవసరం ఉంటుంది.

సంగారెడ్డి జిల్లా ప్యారా నగర్‌లో జిహెచ్ఎంసి ద్వారా 15 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల, ఉత్తర ప్రాంతం నుంచి సేకరించిన చెత్త ప్యారా నగర్ తరలించి విద్యుత్ తయారీకి రోజుకు సుమారు 800 నుంచి 1000 టన్నుల ఆర్.డి.ఎఫ్ ని వినియోగించుకుంటున్నారు. బీబీ నగర్‌లో 11 మెగావాట్ల వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం పూర్తైంది. కానీ ఆ కంపెనీ యాజమాన్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఆ సంస్థను వేరే సంస్థ ఆధ్వర్యంలో ఆ ప్లాంట్‌ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. 

ఈ ప్లాంట్ మూలంగా 800 నుంచి 900 వరకు చెత్తను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇబ్రహీంపట్నం మండలం, యాచారంలో 12 మెగావాట్ల వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. అయితే 12 మెగా వాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను 14 మెగా వాట్ల కెపాసిటీ పెంచనున్నారు. ఇలా రోజువారి సేకరించిన చెత్తను నిల్వ ఉండకుండా ట్రీట్మెంట్, డిస్పోజల్ ద్వారా మొత్తం చెత్తను వినియోగించాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో జిహెచ్ఎంసి ఏర్పాటు చేయనున్న వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా సాధ్యమైనంత విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది తెలంగాణా ప్రభుత్వం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Telangana Group 2 Result: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!
FASTag New Rules: బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
బ్లాక్‌ లిస్ట్‌ నుంచి బయటకురాకపోతే 'డబుల్‌ ఫీజ్‌' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్‌
Nara Lokesh At Prayagraj: మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు - త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు
Reliance: యాపిల్ కన్నా రిలయన్స్ బ్రాండ్ వాల్యూ ఎక్కువ - రికార్డులకెక్కిన అంబానీల కంపెనీ
యాపిల్ కన్నా రిలయన్స్ బ్రాండ్ వాల్యూ ఎక్కువ - రికార్డులకెక్కిన అంబానీల కంపెనీ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.