Half Day Schools 2025: ఏపీలో ఒంటిపూట బడుల్లో స్వల్ప మార్పులు, విద్యాశాఖ కీలక ప్రకటన
Half Day Schools In Andhra Pradesh | ఏపీలో ఒంటిపూట బడులు మార్చి15 న ప్రారంభం కాగా, టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణ కారణంగా స్కూల్ టైమింగ్స్ లో విద్యాశాఖ మార్పులు చేసింది.

Andhra Pradesh Half Day Schools | అమరావతి: ఏపీలో ఇదివరకే ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఒంటిపూట బడులు మార్చి15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించనున్నారు. అయితే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణ కారణంగా ఒంటిపూట బడుల్లో స్వల్ప మార్పులు చేశారు. ఏపీలో టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్న స్కూళ్లలో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు మధ్యాహ్నం 1.15 గంటలకే స్కూల్స్ ప్రారంభమయ్యేవి. తాజాగా స్కూల్ టైమింగ్స్ మార్చారు. టెన్త్ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్న స్కూల్స్లో మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. టెన్త్ ఎగ్జామ్ సెంటర్ లేని మిగిలిన స్కూళ్లకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు యథాతథంగా తరగతులు జరుగుతాయని విద్యాశాఖ తెలిపింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

