అన్వేషించండి

The Fall of Mamata Banerjee: మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 

The Fall of Mamata Banerjee: మమతా బెనర్జీ రాజకీయ ప్రయాణం విఫలమయ్యే అవకాశాలు అంతకంతకూ పెరుగుతున్నాయని చెప్పడానికి నేను జ్యోతిష్యంపై ఆధారపడటం లేదు. 1917లో లియోన్ ట్రాట్‌స్కీ తన ప్రత్యర్థి వ్లాదిమిర్ లెనిన్ గురించి చెప్పినట్లుగా, అత్యంత శక్తివంతమైన నాయకులు కూడా చివరికి "చరిత్ర చెత్తబుట్టలలో" కలిసిపోతారని చరిత్ర మనకు బోధిస్తుంది. 

మరో వివాదాస్పద బ్రిటిష్ రాజకీయవేత్త, ఎనోక్ పావెల్, 1977లో "సంతోషకరమైన సమయంలో ముగిస్తే తప్ప, అన్ని రాజకీయ జీవితాలు వైఫల్యంతోనే ముగుస్తాయి" అని వ్యాఖ్యానించారు. దీని ద్వారా ఆయన చెప్పదలిచినది ఏంటంటే, రాజకీయ నాయకులు తమ విజయ శిఖరాగ్రంలో ఉన్నప్పుడు పదవీ విరమణ చేయాలి లేదా పదవిలో ఉండగానే మరణించాలి. 1977 నుండి, పావెల్ యొక్క ఈ పరిశీలన ఆశ్చర్యకరంగా కచ్చితమైనదిగా కనిపిస్తోంది. ఒకప్పుడు అత్యున్నత పదవులను అధిష్టించిన లెక్కలేనంత మంది రాజకీయ నాయకులు తమ రాజకీయ జీవితాన్ని నిరాశతో ముగించడం మనం చూశాం. 

రాజీవ్ గాంధీ, పి. వి. నరసింహారావు భారతదేశ ప్రధానమంత్రులుగా పనిచేశారన్నది నిజమే. అయితే, వారిద్దరూ మరణించేనాటికి, వారు పదవిలో లేరు. అప్పటికే అధికారాన్ని కోల్పోయారు. ఒక్క భారతదేశంలోనే ఇటువంటి వందలాది ఉదాహరణలు ఉన్నాయి. 

మమతా బెనర్జీ ఎదుగుదల, పతనం

మమతా బెనర్జీ 1985లో పార్లమెంట్ సభ్యురాలిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1998లో తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఆమె ఒక మంచి పోరాట యోధురాలు, పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్‌ను అధికారం నుంచి విజయవంతంగా గద్దె దింపారు. ఆమె 2011లో ముఖ్యమంత్రి అయ్యారు, 2016లో తిరిగి ఎన్నికయ్యారు, మళ్ళీ 2021లో కూడా గెలిచారు. 

అయితే, 2026లో ఘోర పరాజయం తర్వాత, ఆమె పార్టీ, ఆమె వ్యక్తిగత రాజకీయ పలుకుబడి వేగంగా క్షీణించే దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. నిజాయితీపరుడు, నిష్కపటమైన వ్యక్తిగా భావించే రాజకీయ నాయకులు అధికారాన్ని కోల్పోయినప్పుడు, తరచుగా ప్రజల సానుభూతి ఉంటుంది. కానీ ఒక రాజకీయ నాయకుడు వివాదాల మధ్య ఓడిపోయి, అధికారంలో ఉన్నప్పుడు అహంకారిగా కనిపించినప్పుడు, ప్రతిస్పందన చాలా భిన్నంగా ఉంటుంది. అటువంటి సందర్భాలలో, ప్రత్యర్థులు ఆ పతనాన్ని వేడుక చేసుకుంటారు. స్నేహితులు కూడా రహస్యంగా దానిని స్వాగతించవచ్చు. ఈ రోజు మమతా బెనర్జీ విషయంలో ఇదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రత్యర్థులు ఆనందంగా ఉన్నారు, ఆమె మాజీ మిత్రులు చాలామంది కూడా, బహిరంగంగా అంగీకరించకపోయినా, సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. 

మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోయారు?

ప్రజల్లో విసుగు 

బెంగాల్‌లోని చాలా మంది ఓటర్లు ఆమె నాయకత్వంపై విసిగిపోయారనడంలో సందేహం లేదు. వివాదాస్పదంగా, ఘర్షణపూరితంగా, లేదా అవినీతి, హింసతో సంబంధం ఉన్నట్లు కనిపించే రాజకీయ నాయకుల పట్ల ప్రజలు తరచుగా విముఖత చూపుతారు. మమతా బెనర్జీ తరచుగా అటువంటి వివాదాలను ఆకర్షించారు. అయితే, ముఖ్యమంత్రిగా, ప్రజలు ఆమె నుంచి హుందాతనం, సంయమనం, రాజనీతిజ్ఞతను ఆశించారు. చాలా మంది బెంగాలీలు గౌరవం, ప్రజా ప్రవర్తన వంటి విషయాల పట్ల ప్రత్యేకంగా సున్నితంగా ఉంటారు. చివరికి, వారు బ్యాలెట్ పెట్టె వద్ద ఆమెను శిక్షించారు.

నెపోటిజం ప్రభావం 

మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ప్రోత్సహించి ముఖ్యమైన పదవికి ఆయనే వారసుడు అనే వాతావరణాన్ని సృష్టించారు. దీంతో ఆయన షాడో సీఎంగా మారిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ అభిషేక్ బెనర్జీ సమర్థవంతమైన నాయకుడిగా, వినయశీలిగా, ప్రభావవంతమైన వ్యక్తిగా భావించి ఉంటే ఈ వాతావరణాన్ని అందరూ స్వాగతించేవారు. అయితే, చాలా మంది ఓటర్లు ఆయనలో ఈ లక్షణాలు లేవని నమ్మారు. ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కేవలం ఒక అవకాశం కోసం ఎదురుచూశారు. 

ఎన్నికల షాక్

జనాభాలో దాదాపు 32% మైనారిటీలు ఉన్న రాష్ట్రంలో, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నందున, మమతా బెనర్జీ ఓటమి దాదాపు అసాధ్యమని చాలామంది నమ్మారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, గణనీయమైన మైనారిటీ జనాభా ఉన్న నియోజకవర్గాలలో తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. మెజారిటీ తగ్గినా, మమత మళ్లీ గెలుస్తారని చాలా మంది పరిశీలకులు అంచనా వేశారు. దానికి బదులుగా, ఒక నాటకీయ పరిణామం జరిగింది. హిందూ సమాజంలోని ఒక వర్గం ఆమెకు, ఆమె రాజకీయ వైఖరికి వ్యతిరేకంగా మారిందని సమాచారం. ఫలితంగా, బీజేపీ 294 స్థానాలకు గాను 207 స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది. ఇది ఒక అద్భుతం.

పరిపాలన లోపం

మమతా బెనర్జీ పరిపాలనకు ఎప్పుడూ తగినంత ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. ఆమె ప్రభుత్వం రైల్వేలు, విమానాశ్రయాలు, రోడ్లు, కాలువలకు సంబంధించిన అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ఆలస్యం చేసిందని లేదా అడ్డుకుందని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా, అనేక కేంద్ర ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలు కాలేదు లేదా ఆలస్యమయ్యాయి. ఫలితంగా, పశ్చిమ బెంగాల్ అభివృద్ధి దెబ్బతిందని చాలా మంది భావించారు. కేవలం రాజకీయాలు చాలు అని మమత అనుకుంటే, ప్రజలు మెరుగైన పాలన కోరుకున్నారు. మమతా బెనర్జీ ఓటమికి ఇలా చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు ఏవైనప్పటికీ, ఈ ఓటమి నిర్ణయాత్మకమైనది. రాజకీయ పునరాగమనాన్ని అత్యంత కష్టతరం చేస్తుంది. 

మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు 

సువేందు అధికారి ఎదుగుదల 

బహుశా మమతా బెనర్జీకి అతిపెద్ద సవాలు బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి. ఆయన ఒకప్పుడు రెండు దశాబ్దాలకుపైగా ఆమెకు సన్నిహితుడు, బలమైన క్షేత్రస్థాయి సంబంధాలున్న రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అధికారికి బెంగాల్ రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. అనేక విధాలుగా, ఆయనను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో పోల్చవచ్చు. ఆయనకు రాజకీయ చతురత ఉంది. ఇటీవలి నెలల్లో మమతా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, ఆమె మద్దతుదారులను పక్షం మార్చుకునేలా ప్రోత్సహించడానికి కృషి చేశారు. 

తగ్గుతున్న శాసనసభ మద్దతు 

పెద్ద సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమెకు దూరమయ్యారని సమాచారం. ఇది అసెంబ్లీలో ఆమె స్థానాన్ని చాలా బలహీనపరిచి, పార్టీపై ఆమె అధికారాన్ని తగ్గించింది. 

పార్టీని వీడుతున్న నాయకులు

ఒకప్పుడు విధేయులైన మద్దతుదారులుగా ఉన్న పార్లమెంట్ సభ్యులు కూడా పార్టీని వీడటం ప్రారంభించారు. ఈ నాయకులలో కొందరు సంవత్సరాల తరబడి మమతా బెనర్జీకి అండగా నిలిచారు, కానీ ఇప్పుడు వేరే రాజకీయ మార్గాలను ఎంచుకున్నారు. పార్టీ నుంచి ముఖ్యమైన రాజకీయ అవకాశాలు పొందిన సుష్మితా దేవ్ నిష్క్రమణ చాలా పెద్ద మార్పు. ఆమె రాజీనామా తృణమూల్ కాంగ్రెస్ నుంచి పెరుగుతున్న వలసలకు ప్రతీకగా నిలిచింది. 

విధేయత కంటే ఆత్మగౌరవమే ముఖ్యం

మమతా బెనర్జీని వీడే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమె జెండా కింద ఎన్నికయ్యారు కాబట్టి రాజీనామా చేయాలని చాలా మంది వ్యాఖ్యాతలు వాదిస్తారు. అయితే, ఈ వ్యక్తులు వారి సొంత బలాలు, ప్రజాదరణ కారణంగా ఎంపికయ్యారని కూడా వాదించవచ్చు. ఉదాహరణకు, పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు స్వతంత్రంగా ఓట్లను ఆకర్షించగలరనే కారణంతో అభ్యర్థులుగా ఎంపికయ్యారు. అందువల్ల, వారి విజయం కేవలం మమతా బెనర్జీ వల్లే సాధ్యమైందని చెప్పడం పూర్తిగా సరైనది కాదు. 

మమతాలో భయాందోళన కనిపిస్తోందా? 

2011 నుంచి, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లోని కాంగ్రెస్, వామపక్ష పార్టీలను క్రమపద్ధతిలో బలహీనపరిచి, వారి రాజకీయ ప్రాముఖ్యతను తగ్గించారు. అయినప్పటికీ, ఓటమి తర్వాత, ఆమె మద్దతు, రక్షణ కోరుతూ అవే పార్టీల వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. చాలా మంది పరిశీలకులకు, ఇది భయాందోళనను, రాజకీయ విశ్వాసం కోల్పోవడాన్ని సూచించింది. రాజకీయాలు చాలా క్రూరంగా ఉంటాయి. ప్రతీకారం తీర్చుకోవాలనుకునేది శత్రువులు మాత్రమే కాదు. ఒకప్పుడు నిర్లక్ష్యం చేసిన లేదా అవమానాలకు గురైన మాజీ మిత్రులు కూడా పాత లెక్కలు తేల్చుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓటమి ఒక రాజకీయ నాయకుడిలో భయాందోళన కలిగించకూడదు. అయినప్పటికీ, మమతా బెనర్జీ ఇప్పుడు బలం కన్నా భయంతోనే పనిచేస్తున్నారని చాలామంది నమ్ముతున్నారు. ఆమె ప్రత్యర్థులు ఆమె మద్దతుదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుండగా, మాజీ మిత్రులు ఆమె అవమానాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్నారు. 

మంచి సలహా ప్రాముఖ్యత 

మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు మెరుగైన సలహాదారులు అవసరమయ్యారు. నేడు, రాజకీయ ప్రతికూలతను ఎదుర్కొంటున్న నాయకురాలిగా, ఆమెకు గతంలో కంటే మెరుగైన సలహాదారులు అవసరమని చెప్పవచ్చు. 

భవిష్యత్తును అంచనా వేయడం ఎల్లప్పుడూ కష్టం. అయినప్పటికీ, పావెల్ ఫేమస్‌  కామెట్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులను వెంటాడుతూనే ఉంది: "అన్ని రాజకీయ జీవితాలు వైఫల్యంతోనే ముగుస్తాయి." చరిత్రను పరిశీలిస్తే, అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులు కూడా చివరికి ఓటమిని చవిచూస్తారని తెలుస్తుంది. చాలామంది తమ చివరి కాలంలో రాజకీయ వైభవానికి చాలా దూరంగా ఉంటారు. మమతా బెనర్జీ తన తలరాతను మార్చుకోగలరా లేదా అనేది అనిశ్చితంగానే ఉంది, కానీ ప్రస్తుతం ఆమె రాజకీయ ప్రయాణం అత్యంత క్లిష్టమైన దశలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తోంది.

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget