అన్వేషించండి

Jagan Letter to PM Modi: ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి: ప్రధాని మోదీకి జగన్ లేఖ

Fair Delimitation | దేశ వ్యాప్తంగా జరగనున్న నియోజకవర్గాల పునర్ విభజనతో ఏ రాష్ట్రం నష్టపోకూడదని, ఎవరి ప్రాతినిథ్యం లోక్ సభ రాజ్యసభలో తగ్గకుండా చూడాలని ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు.

Jagan on Delimitation | అమరావతి: డీలిమిటేషన్ ప్రతిపాదన ద్వారా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, చట్టాల రూపకల్పనలో మన ప్రాధాన్యత అవసరమే లేకుండా పోతుందని చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో విపక్ష నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమయంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్ విభజన ప్రజాస్వామ్య సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టాలన్నారు. లోక్‌సభ లేక రాజ్యసభలో ఏ రాష్ట్రానికీ సీట్ల వాటా తగ్గకుండా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని కోరారు. ప్రతి ప్రాంతం యొక్క గొంతకకు సమాన ప్రాధాన్యం కల్పించేలా చూడాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. 


Jagan Letter to PM Modi: ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి: ప్రధాని మోదీకి జగన్ లేఖ

జగన్ లేఖలో ఏం ప్రస్తావించారంటే..
లోక్‌సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిథ్యం తగ్గకూడదు. సీట్ల సంఖ్య విషయంపై కేంద్రం దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూడాలి. దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. డీలిమిటేషన్ ద్వారా కొన్ని రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయి. దాని వల్ల చట్టాల రూపకల్పన, సవరణలలో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం ఏమాత్రం ఉండదు. రాజకీయంగానే కాదు ప్రజల ప్రయోజనాల్ని ఇది దెబ్బతీస్తుంది. డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే కనుక ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా జాగ్రత్తగా చేయాలి. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియ జరగనుంది. 2026 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలి. కోవిడ్19 కారణంగా 2021లో ప్రారంభించాల్సిన జనాభా లెక్కలు తేల్చలేదు. జనాభా సర్వే లెక్కలు తేల్చిన తరువాత నియోజకవర్గాల పునర్ విభజన ప్రక్రియ ఉంటుంది.

జనాభా పెరుగుదలలో హెచ్చుతగ్గులు

జనాభా నియంత్రణ కోసం పలు రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. దీని వల్ల వివిధ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల హెచ్చుతగ్గులున్నాయి. దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. దీని వల్ల డీమిలిటేషన్‌ ఆందోళనకు దారి తీస్తోంది. 42, 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటి స్థాయికి చేరుకుంటుందని భావించారు. కానీ, 2011 జనాభా లెక్కలు చూస్తే జనాభా వృద్ధి, దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవు. 1971, 2011 మధ్య 40 ఏళ్లలో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది.

1971 లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.08 శాతం, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వృద్ధి రేటు 20.88 శాతం. ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్‌ ప్రక్రియ జరిగితే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్‌ చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు.  ఆర్టికల్‌ 81 (2) (ఎ) ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలి. ఈ నిబంధనతో హోంమంత్రి అమిత్‌షా ఇచ్చిన హామీని అమలులో అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాలి. దాంతో ఆయా రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదు అని లేఖలో జగన్ పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget