అన్వేషించండి

Kohli In RCB: పేస‌ర్ కోసం విరాట్ ను వదులుకున్న ఫ్రాంచైజీ.. ఆర్సీబీలోకి తన ఎంట్రీని గుర్తు చేసుకున్న కోహ్లీ

ఐపీఎల్లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఈ ఏడాదితో కలిపి వ‌రుస‌గా 18 సీజ‌న్లు ఆడ‌బోతున్నాడు. లీగ్ లో విరాట్ మిన‌హా మ‌రే క్రికెట‌ర్ ఇంత‌కాలం ఒకే జ‌ట్టు త‌ర‌పున ఆడిన దాఖ‌లా లేదు. 

Virat Kohi Comments; భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి అందరికీ తెలిసిందే. చాలా రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇక ఐపీఎల్లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఈ ఏడాదితో కలిపి వ‌రుస‌గా 18 సీజ‌న్లు ఆడ‌బోతున్నాడు. లీగ్ లో విరాట్ మిన‌హా మ‌రే క్రికెట‌ర్ ఇంత‌కాలం ఒకే జ‌ట్టు త‌ర‌పున ఆడిన దాఖ‌లా లేదు. అయితే నిజానికి విరాట్ ను 2008 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) కొనుగోలు చేయాల్సింది. అయితే వారి లెక్క‌లు త‌ప్ప‌డంతో విరాట్ లాంటి బ్యాట‌ర్ ను మిస్ చేసుకున్నారు. అప్పుడున్న ప‌రిస్థితుల్లో కోహ్లీ కంటే ఒక పేస‌రే మిన్న అని ఢిల్లీ ఆలోచించ‌డంతో ఆర్సీబీ చెంత‌కు కోహ్లీ చేరాడు. అప్పుడు జ‌రిగిన విష‌యాల‌ను తాజాగా కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. 2008 అండ‌ర్ -19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిశాక‌, త‌న‌పై ఢిల్లీకి ఆసక్తి ఉంద‌ని తెలిసింద‌ని, త‌న‌ను వాళ్లు పిక్ చేస్తార‌ని భావించిన‌ట్లు కోహ్లీ తెలిపాడు. అయితే అనూహ్యంగా తాను ఆర్సీబీకి వ‌చ్చాన‌ని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

స్పెష‌ల్ వేలం..
అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్ క‌ప్ ముగిశాక ఇందులో పాల్గొన్న ఆట‌గాళ్ల కోసం ప్ర‌త్యేకంగా వేలం నిర్వ‌హించారు. అయితే ఢిల్లీ తొలుత త‌న వైపు ఆస‌క్తి చూపించినా, అప్పుడున్న ప‌రిస్థితుల్లో పేస‌ర్ ప్ర‌దీప్ సాంగ్వాన్ వైపు ఫోక‌స్ పెట్టార‌ని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అప్ప‌టికే వాళ్ల బ్యాటింగ్ టీమ్ లో వీరేంద్ర సెహ్వాగ్, శిఖ‌ర్ ధావ‌న్, గౌతం గంభీర్, దినేశ్ కార్తీక్, మ‌నోజ్ తివారీ లాంటి దేశీ ప్లేయ‌ర్ల‌తోపాటు తిల‌క‌ర‌త్నే దిల్షాన్, ఏబీ డివిలియ‌ర్స్ వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్లు ఉన్నార‌ని అందుకే వారికి పెద్ద‌గా బ్యాట‌ర్ అవ‌స‌రం ప‌డ‌లేద‌ని కోహ్లీ విశ్లేషించాడు. అందుకే ఆ టోర్నీలో స‌త్తా చాటిన సాంగ్వాన్ ను తీసుకుని, బౌలింగ్ ను  ప‌టిష్ట ప‌రుచుకున్నాడ‌ని తెలిపాడు. 

ఇప్పుడు ఆశ్చ‌ర్య‌మే..
ఐపీఎల్లో వ‌రుస‌గా 18వ ఏడాది ఆర్సీబీ త‌ర‌పున కోహ్లీ పాల్గొవ‌డం విశేషం. అయితే తొలుత త‌ను ఒక‌లా భావిస్తే, డెస్టినీ మ‌రోలా చేసింద‌ని కోహ్లీ తెలిపాడు. అయినా ఆట‌ను ఆస్వాదించ‌డం ఎప్పుడు కొన‌సాగించాన‌ని పేర్కొన్నాడు. ఢిల్లీకి చెందిన కోహ్లీని ఢిల్లీ జ‌ట్టు తీసుకుంటుంద‌ని అప్ప‌ట్లో భావించినా, వివిధ స‌మీక‌ర‌ణాల‌తో ఆర్సీబీలోకి వ‌చ్చి చేరాడు. ఆ త‌ర్వాత త‌న స‌త్తా చాట‌డంతో ఆర్సీబీ పెర్మినెంట్ మెంబ‌ర్ గా మారిపోయాడు. ఇక ఐపీఎల్ 2025 శ‌నివారం నుంచి ప్రారంభ‌మ‌వుతోంది. స్టార్టింగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ కోల్ క‌తా నైట్ రైడర్స్ తో ఆర్సీబీ ఢీకొననుంది. మూడుసార్లు ఫైనల్స్ కు చేరినా, ర‌న్న‌ర‌ప్ తోనే సంతృప్తి ప‌డినా ఆర్సీబీ, ఈ సీజన్ లో క‌ప్పు గెల‌వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. మరోవైపు గతేడాది టీ20లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ ఏడాది ఐపీఎల్లో తను ఎలా ఆడతాడో అనే దానిపై అందరి ఫోకస్ నిలిచింది. అంతర్జాతీయంగా ఎన్నో టోర్నీలు సాధించినా, ఐపీఎల్ టైటిల్ మాత్రం విరాట్  కోహ్లీ జీవితంలో వెలితిగా నిలిచి పోయింది. 



మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Fair Delimitation Meet In Chennai: డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ
బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR in Chennai: డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు, దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం: చెన్నైలో కేటీఆర్
Fair Delimitation Meet In Chennai: డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
డీలిమిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరు- స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ
బాయ్‌ఫ్రెండ్‌ను 300 ముక్కలుగా నరికి చంపిన నటి... సినిమాలను మించిన ట్విస్ట్‌లతో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ
UPI Payment: ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్‌
ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్‌
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Embed widget