అన్వేషించండి

Balapur Ganesh 2024: అయోధ్య మందిరంలో బాలాపూర్ వినాయకుడు - ఈ సారి వేలంలో లడ్డూ ధర ఎంత పలుకుతుందో!

Ganesh Chaturthi 2024: హైదరాబాద్ బాలాపూర్ వినాయకుడు ఈ సారి అయోధ్య రామ మందిరంలో కొలువుతీరనున్నాడు. ప్రముఖ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ నమూనాను రూపొందించారు ఉత్సవ సమితి...

Balapur Ganesh 2024: బాలాపూర్ వినాయక మండపాన్ని ఈ సారి అయోధ్య రామాలయ నమూనాలో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే బాలాపూర్ లో అయోధ్య నమూనా సిద్ధం కావడంతో...వారం ముందునుంచే అక్కడ భక్తుల సందడి పెరిగింది. సెల్ఫీలు తీసుకుంటూ అయోధ్య ఆలయ పరిసరాల్లో ఉన్నట్టే భావిస్తున్నారు..గతేడాది బెజవాడ దుర్గమ్మ ఆలయ నమూనా ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఈ ఏడాది అయోధ్య రామాలయ నమూనాను దించేసింది

వినాయక చవితి అనగానే ముందుగా గుర్తుకువచ్చేది బాలాపూర్ వినాయకుడు. నగరంలో బాలాపూర్ గణేష్ యాత్ర మొదలైన తర్వాతే భాగ్యనగరంలో మిగిలిన మండపాలనుంచి గణనాథుడు తరలివెళతాడు. బాలాపూర్ గణేష్ కి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే లడ్డూ వేలం. ఏటికేడు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తోన్న లడ్డూ వేలం..ఈ ఏడాది ఎంత ధర పలుకుతుందో అని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చివరి పూజ జరిగిన అనంతరం ఊరేగింపు నిర్వహించే ఉత్సవసమితి..బాలాపూర్‌ బొడ్రాయి దగ్గర వేలం పాట నిర్వహిస్తుంది. బాలాపూర్ గణేషుడి లడ్డూ  దక్కించుకుంటే సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పోటీపడి మరీ వేలంపాటలో పాల్గొంటారు. ముందుగా కొంత మొత్తం డిపాజిట్ చేసినవారికి మాత్రమే వేలంపాటలో పాల్గొనే అవకాశం ఇస్తుంది బాలాపూర్‌ గణేష్ ఉత్సవ సమితి. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు..

Also Read: వినాయక చవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో తెలియజేయండి!

లడ్డూ వేలంకి ఆద్యుడు బాలాపూర్ గణేషుడు

బాలాపూర్ గణేషుడి లడ్డూ బరువు 21 కిలోలు.. చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏంటంటే అసలు లడ్డూ వేలాన్ని ప్రారంభించిందే బాలాపూర్ గణనాథుడి దగ్గరే. లంబోదరుడికి లడ్డూ నైవేద్యంగా పెట్టే సంప్రదాయం 1980 నుంచి ప్రారంభమైంది కానీ...1994 నుంచి వేలం పాట నిర్వహించడం మొదలుపెట్టారు. మొదటిసారిగా కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి 450 రూపాయలకు ఆ లడ్డూ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత సంవత్సరం కూడా ఆయనే రూ.4,500కు లడ్డూ దక్కించుకున్నాడు. ఆ తర్వాత సంవత్సరాల్లోనూ 18వేలు, 28 వేలు, 51 వేలకు వేలంలో లడ్డూ కొనుగోలు చేశాడు. 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి 65వేలకు..2000 లో అంజిరెడ్డి 66వేలకు, 2001లో రఘునందన్ చారి 85వేలకు లడ్డూ కొనుగోలు చేశారు. ఆ తర్వాత గల్లీల్లో గణనాథుడి మండపాల దగ్గర కూడా లడ్డూ వేలం నిర్వహిస్తూవస్తున్నారు. 

2002 లో లక్ష దాటిన లడ్డూ ధర

2002 లో మొదటిసారిగా బాలాపూర్ గణేషుడి లడ్డూ ధర లక్ష దాటింది... కందాడ మాధవ రెడ్డి కొనుగోలు చేశారు. 2003లో చిగిరింత బాల్ రెడ్డి లక్షా 55వేలకు, 2004లో కొలను మోహన్ రెడ్డి 2లక్షల  వెయ్యి రూపాయలకు వేలం పాడారు. 2005లో ఇబ్రహీం శేఖర్ 2లక్షల 8వేలకు దక్కించుకోగా… 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి  3లక్షలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత నుంచి ఏటికేడు వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వచ్చింది. 

Also Read: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!

2007లో  4 లక్షల 15 వేలు, 2008లో 5లక్షల 7వేలు, 2009లో 5లక్షల 15వేలు, 2010లో  5లక్షల 35వేలు, 2011లో 5 లక్షల 45వేలు పలికింది. 2012 నుంచి ఆ ధర 7  లక్షలు దాటింది. ఆ ఏడాది  7లక్షల 50వేలు,  2013లో 9లక్షల 26వేలు, 2014లో 9లక్షల 50వేలు, 2015లో 10 లక్షల 32వేలు, 2016లో 14లక్షల 65వేల, 2017లో  15లక్షల 60వేలు, 2018లో 16లక్షల 60వేలు, 2019లో 17లక్షల 67వేలు ధర పలికింది..

2020లో కరోనా కారణంగా లడ్డూ వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవసమితి. 2021 లో 18 లక్షల 90 వేలు పలికింది. 2022 లో 24 లక్షల 60 వేలు, 2023 లో 27 లక్షలు ధర పలికింది. మరి ఈ ఏడాది బాలాపూర్ గణేషుడి లడ్డూ ధర 30 లక్షలకు చేరుతుందేమో చూడాలి..
 
ఏటా ఏడాది గణేష్‌ వేలం పాట ద్వారా వచ్చే సొమ్మును పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటివరకూ లడ్డూ దక్కించుకున్న వారి వివరాలను, ఎంతకు కొనుగోలు చేశారో ఫ్లెక్లీలు ఏర్పాటు చేసే బాలాపూర్ ఉత్సవ సమితి.. తద్వారా వచ్చిన సొమ్ముతో ఏం చేశారో కూడా స్పష్టంగా వెల్లడిస్తూనేఉన్నారు. వివిధ ఆలయాల అభివృద్ధితో పాటూ.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు కూడా ఆ డబ్బులు వినియోగిస్తున్నారు. 

Also Read: ఈ ఏడాది వినాయకచవితికి మీరు సందర్శించుకోవాల్సిన ప్రముఖ ఆలయాలివే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget