అన్వేషించండి

Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !

Telangana Latest News: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. విజయశాంతికి అవకాశం ఇచ్చింది.

Telangana Latest News: ఉదయం నుంచి జరుగుతున్న చర్చలు పూర్తి అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌కు అవకాశం ఇచ్చారు. 

విజయశాంతి చాలా సైలెంట్‌గా తన పేరు లిస్ట్‌లో చేర్చుకునేలా చేశారు. ఈ మధ్యే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన విజయశాంతి  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం చేసిన త్యాగాలు  గురించి చెప్పుకొచ్చారు.  ఎన్నికలకు ముందు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇప్పటి వరకు తనను పట్టించుకోవడం లేదని ఆమె ఫీల్ అవుతున్నారు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్‌ ఎన్నికల్లో కానీ టికెట్‌ ఇవ్వలేదు. ఆమెను ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గోనివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కూడా ఆమె యాక్టివ్‌గా లేకుండా పోయారు. ఆమె ఫేడవుట్ అయ్యారని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ పెద్దలను ఒప్పించి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారు. 

మొదటగా తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టిన విజయశాంతి తర్వాత చాలా పార్టీలు మారారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి మారు. ఇదే ఆమెకు పెద్ద మైనస్‌గా చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓసారి గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీకి, కేసీఆర్‌కు దూరమయ్యారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించారు. తెలంగాణ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓసారి మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

అద్దంకి దయాకర్ తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 2023లో టికెట్ దక్కలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే లేదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వాడిన పదాలపై పార్టీలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనపై కోమ‌టిరెడ్డి అభిమానులు టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీకి ఫిర్యాదు చేశారు. ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై స్పందించిన ద‌యాక‌ర్ ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడాన‌ని తాను వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. వెంక‌ట్ రెడ్డికి వ్యక్తిగ‌తంగా బేషరతుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Embed widget