Ind vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాం
పాతికేళ్ళ నాటి సీన్ రిపీట్ అవుతోంది. ఈరోజు చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా -న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. బలమైన టీమ్స్ మధ్య జరుగుతున్న టైటిల్ రేసు లో మరోసారి 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సీన్ రిపీట్ అవ్వకూడదని ఇండియన్ టీం ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది అప్పుడు. ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ గంగూలి సెంచరీ కొట్టాడు, సచిన్ ఆఫ్ సెంచరీ బాదాడు..అయినా మనం కివీస్ చేతిలో దెబ్బ తిన్నామా ఎలా అంటే మీరిప్పుడు 25ఏళ్లు వెనక్కి టైమ్ ట్రావెల్ చేయాలి.
కెన్యాలో క్రికెట్ను డెవలప్ చేయడం కోసం ఐసీసీ 2000 సంవత్సరం లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆదేశం లో నిర్వహించింది. అప్పట్లో దాన్ని నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవారు. క్వార్టర్ ఫైనల్ లో ఆస్ట్రేలియా ను, సెమీ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ను ఓడించిన ఇండియా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. మరో వైపు సెమీఫైనల్ ల్లో పాకిస్తాన్ టీమ్ ను ఓడించిన న్యూజిలాండ్ ఫైనల్లో ఇండియాకు ఎదురు నిలిచింది. నైరోబి లో జరిగిన ఈ మ్యాచ్ లో దిగ్గజాలతో నిండిన ఇండియన్ టీం దే ట్రోఫీ అని అందరూ భావించారు. దానికి తగ్గట్టే ఓపెనర్లు సచిన్ టెండూల్కర్ 69,సౌరవ్ గంగూలి 117 రన్స్ కొట్టారు. తొలి వికెట్ పడేసరికి ఇండియా స్కోర్ 26.3 ఓవర్ల లో 141.కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించకపోవడంతో ఇండియా 50 ఓవర్లు ఆడి 264/6 పరుగులు మాత్రమే చేసింది. ఇది మనోళ్లు అస్సలు ఊహించలేదు. అంత బాగా ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ లభించినా..చాలా తక్కువ కొట్టామని ఫీలయ్యారు మనోళ్లు. సరే తర్వాత బ్యాటింగ్కు వచ్చిన న్యూజిలాండ్ ను అప్పటి టీమిండియా బౌలర్ వెంకటేష్ ప్రసాద్ బాగా భయపెట్టాడు. అద్భుతంగా బౌలింగ్ వేసి 3 వికెట్స్ తీసినా న్యూజిలాండ్ మిడిల్ అర్డర్ బ్యాట్స్ మెన్ అయిన క్రిస్ కెయిన్స్ అడ్డం పడ్డాడు. సూపర్ సెంచరీ అసలు. 113 బంతుల్లో 102 బాదాడు అటు వైపు క్రిస్ హామ్స్ ను పెట్టుకుని న్యూజిలాండ్ ను లక్ష్యంగా దిశగా తీసుకువెళ్లాడు. క్రిస్ హామ్స్ కూడా 46 పరుగులు చేయటంతో కివీస్ జట్టు మనం ఇచ్చిన టార్గెట్ ను మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చేదించింది.
సెంచురీ చేసిన క్రిస్ కైర్న్స్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. చాలామంది 2003 వరల్డ్ కప్ ఫైనల్ అంటారు కానీ నిజానికి 2000 నాకొట్ ట్రోఫీ పరాజయం ఇంకా చాలామంది ఇండియన్ టీమ్ అభిమానులకు ఒక పీడ కల లా మిగిలిపోయిన మాట వాస్తవం.మరి మళ్ళీ పాతికేళ్ళ తర్వాత ఇండియా - న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో ఇండియా చేతిలో ఓటమి పాలయ్యింది న్యూజిలాండ్. అయినా గానీ న్యూజిలాండ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనగానే పాతికేళ్ళ నాటి చేదు జ్ఞాపకం గుర్తుకు వస్తోంది. పైగా రచిన్ రవీంద్ర,కేన్ విలియమ్సన్ దక్షిణాఫ్రికా మ్యాచ్ లో సెంచరీలు చేసి భీకర ఫామ్ లో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ లో చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 362/6 పరుగులు చేసింది న్యూజిలాండ్ జట్టు. మరి మనోళ్లు వాళ్ల స్పీడ్ కు మన స్పిన్ తో వలేసి ఆపితే చాలు పాతికేళ్ల క్రితం పగకు ఫ్రెష్ గా బదులు తీర్చుకున్నట్లే.





















