అన్వేషించండి

Shivsena Supreme Court : సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ థాక్రే - అత్యవసర విచారణకు నో !

శివసేన పార్టీ పేరు, గుర్తు షిండే వర్గానికి ఈసీ కేటాయించడంపై సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ వేసింది.


Shivsena Supreme Court :   మహారాష్ట్రలోని శివసేన పార్టీ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. విల్లు, బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే కు  ఈసీ  కేటాయించడాన్ని సవాలు చేస్తూ  ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.  ఈ పిటిషన్  అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది.  మంగళవారం  బెంచ్ ముందు ప్రస్తావించాలని సూచించింది. ఈ నెల 17 ఎన్నికల సంఘం  షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి దానికి విల్లు, బాణం  ఎన్నికల గుర్తును కేటాయించాలని ఆదేశించింది. అయితే దీనిని ఉద్ధవ్ ఠాక్రే వర్గం తీవ్రంగా ఖండించింది. ఈసీ నిర్ణయాన్ని తప్పబట్టింది. శివసేన పార్టీ పేరు,గుర్తు ఏక్ నాథ్ షిండేకు కేటాయించడం వెనుక రూ.2000 కోట్ల డీల్ జరిగిందని సంజయ్ రౌత్ ఆరోపించారు. త్వరలోనే దీనికి సంబంధించి చాలా విషయాలు బయటకొస్తాయని చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఉ  విధాన్ భవన్ లోని శివసేన పార్టీ కార్యాలయాన్ని షిండే వర్గం స్వాధీనం చేసుకుంది. షిండే వర్గానికి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు శాసనసభలోని శివసేన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందు కార్యాలయం ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు నియంత్రణలో ఉండేది. అక్కడ ఏర్పాటు చేసిన ఉద్ధవ్ ఠాక్రే బోర్డులు, బ్యానర్లను తొలగించారు.  శివసేన మా పార్టీ, ఇక నుంచి ఇతర కార్యాలయాలను మా స్వాధీనంలోకి తెచ్చుకొనేలా న్యాయపరమైన ప్రయత్నాలు చేస్తామని షిండే వర్గం ప్రకటించింది. 

థాక్రే మరణం తర్వాత ఆ కుటుంబ ఆలోచనల్లో మార్పు వచ్చింది. తండ్రి వారసత్వంగా పార్టీ పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే అనంతరం బీజేపీతో కలసి నడిచారు. అప్పుడు కూడా ఆ కుటుంబం నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు. కానీ గత ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే తనకు ముఖ్యమంత్రిని కావాలని కోరిక కలగడం, తన కుమారుడు ఆదిత్య థాక్రేను ప్రత్యక్ష ఎన్నికల్లోకి దించడం ద్వారా శివసేనను ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగిన శివసేన కౌంటింగ్ అనంతరం మనసు మార్చుకుంది. తమకు బద్ధ విరుద్ధులైన, సిద్ధాంతాలకు దూరమైన సెక్యులర్ పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాను ముఖ్యమంత్రిగా, కుమారుడు మంత్రిగా కొన్నాళ్లు అధికారం చెలాయించిన ఉద్ధవ్ ను ఏక్‌నాథ్ షిండే గట్టి దెబ్బ కొట్టారు. అత్యధిక శాతం ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి అయ్యారు. 

ఇప్పుడు చివరకు శివసేన పేరు దూరమయింది. ధనస్సు గుర్తు కూడా దూరమయింది. థాక్రే భావజాలానికి దూరమయిన ఉద్ధవ్ నుంచి గుర్తు, పార్టీ పేరు వెళ్లడం కూడా సరైనదేనని ఏక్‌నాథ్ షిండే అంటున్నారు. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే కొత్త గుర్తుతో ప్రజల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం అంతసులువు కాదు. ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అతి పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో కొత్త గుర్తుతో వెళ్లి ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా అదే సలహా ఇచ్చారు. అయితే పార్టీ గుర్తు, పేరు వదులుకుంటే చాలా సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో  ఉద్దవ్ థాక్రే న్యాయపోరాటానికి మొగ్గు చూపుతున్నారు. 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
TTD Board Decisions : టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP DesamSRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
MPs Salaries Hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం- 2023 ఏప్రిల్ నుంచి అమలు
TTD Board Decisions : టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- 3 నెలలకోసారి సుపథం టికెట్లు- రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
Robinhood OTT Partner: నితిన్ 'రాబిన్ హుడ్' ఓటీటీ డీల్ ఫిక్స్! - థియేట్రికల్ రన్ తర్వాత ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
నితిన్ 'రాబిన్ హుడ్' ఓటీటీ డీల్ ఫిక్స్! - థియేట్రికల్ రన్ తర్వాత ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
NTR: జపాన్‌లో ఎన్టీఆర్ సందడి - అభిమానితో 'దేవర' స్టెప్పులు, మాస్ జాతర మామూలుగా లేదంతే..!
జపాన్‌లో ఎన్టీఆర్ సందడి - అభిమానితో 'దేవర' స్టెప్పులు, మాస్ జాతర మామూలుగా లేదంతే..!
Vidadala Rajinivs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
BR Shetty Story: 12 వేల కోట్ల వ్యాపారాన్ని 74 రూపాయలకు అమ్మేశాడు - నమ్మలేరా - బీఆర్ షెట్టి కథ మీరే చదవండి!
12 వేల కోట్ల వ్యాపారాన్ని 74 రూపాయలకు అమ్మేశాడు - నమ్మలేరా - బీఆర్ షెట్టి కథ మీరే చదవండి!
Embed widget