అన్వేషించండి

IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు

రైల్వే స్టేషన్‌కు వెళ్లి కౌంటర్లలో తీసుకున్న టికెట్లు రద్దు చేసుకోవడానికి తిరిగి కౌంటర్లకు వెళ్లల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్లో కూడా రద్దు చేసుకోవచ్చు అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Train Tickets Cancel Process | సామాన్యులు సుదీర్ఘ ప్రయాణం చేయాలంటే రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడం రైల్వే ద్వారా సామాన్యులకు ఆర్థికంగా కలిసొస్తుంది. ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు రైల్వే శాఖ మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సల్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఒకవేళ మీరు రైల్వే టికెట్ కౌంటర్లు టికెట్ కొన్నప్పటికీ దాన్ని ఆన్లైన్ ద్వారా సైతం క్యాన్సల్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పించింది. ప్రయాణికులు 139 కి ఫోన్ చేసి తమ వివరాలు తెలిపి టికెట్ రద్దు చేసుకోవచ్చని అశ్విని వైష్ణవ్ చెప్పారు. లేదా ఐఆర్సిటిసి (IRCTC) అధికారిక వెబ్సైట్లో సైతం ప్రయాణికులు క్యాన్సల్ చేసుకోవచ్చు అని.. తద్వారా ప్రయాణికులకు టైం, శ్రమ తగ్గుతుందని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాలో తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కౌంటర్ టికెట్ రద్దు చేసుకోవాలంటే మీరు టికెట్ బుకింగ్ సమయంలో కరెక్ట్ మొబైల్ నంబర్ ఇస్తేనే ఆన్‌లైన్‌లో టికెట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. రైలు ఆలస్యం, రద్దు సమయాల్లో టికెట్ క్యాన్సల్ వర్తించదు. నార్మల్ సిచ్యువేషన్లో మాత్రమే కౌంటర్ టిక్కెట్ల క్యాన్సలేషన్, వాపసును రైల్వే శాఖ అనుమతిస్తుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

టికెట్ రద్దు చేసుకునే ప్రాసెస్ ఇదీ..
- ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మోర్ (More) అనే ఆప్షన్‌ మీద సెలక్ట్ చేసుకోవాలి. కౌంటర్‌ టికెట్‌ క్యాన్సిలేషన్‌ మీద క్లిక్‌ చేయాలి.
- అక్కడ కౌంటర్‌ టికెట్‌ క్యాన్సిలేషన్‌ కు రీ డైరెక్ట్ అయి పేజీ ఓపెన్ అవుతుంది.
- అనంతరం మీ పీఎన్ఆర్ నంబర్, ట్రైన్ నంబర్‌ సహా క్యాప్చాను ఎంటర్ చేయాలి. 
- కండీషన్లు చెక్ చేసుకునే చెక్‌బాక్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి, సబ్మిట్ క్లిక్ చేయాలి.
- టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్ కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
- ఆ ఓటీపీని వెరిఫై చేశాక మీ పీఎన్‌ఆర్‌ వివరాలు స్క్రీన్‌పై వస్తాయి. టికెట్ రద్దు చేయండి పై క్లిక్ చేయాలి
- మీ టికెట్ క్యాన్సల్ అయి, రావాల్సిన నగదు ఎంతన్నది స్క్రీన్‌ మీద కనిపిస్తుంది.
- పీఎన్‌ఆర్‌ క్యాన్సల్ వివరాలతో మీ మొబైల్‌కు మెస్సేజ్ వస్తుంది. రైల్వే స్టేషన్‌ కౌంటర్లలో అది చూపించి నగదు తిరిగి పొందాలి.

ఈటికెట్లకు బదులుగా కౌంటర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు రైలు బయలుదేరే ముందే స్టేషన్‌కు వెళ్లి టికెట్ రద్దు చేసుకోవాలా అని బీజేపీ ఎంపి మేధా విశ్రామ్ కులకర్ణి పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైల్వే ప్రయాణీకుల (టిక్కెట్ల రద్దు, ఛార్జీల వాపసు) నియమాలు 2015లో సూచించిన టైమ్ లిమిట్ ప్రకారం, వెయిట్‌లిస్ట్ లో ఉన్న PRS కౌంటర్ టికెట్ రద్దు చేసుకోవచ్చు అని తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget