Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Parthiban Reaction : హీరోయిన్ త్రిషపై కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన వేళ కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ పార్తిబన్ ఆమెకు క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి.

Director Parthiban Apologise To Actress Trisha On His Comments : హీరోయిన్ త్రిషకు కోలీవుడ్ నటుడు, దర్శకుడు పార్తిబన్ సారీ చెప్పారు. రీసెంట్గా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో ఆయన త్రిషపై చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. తాజాగా త్రిష దీనిపై ఇండైరెక్ట్గా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో ఆయన అపాలజీ చెబుతూ ట్విట్ చేశారు.
వివాదానికి ఫుల్ స్టాప్
ఈ విషయంలో జరిగినదంతా తప్పుగా భావించారని అన్నారు పార్తిబన్. 'ఇప్పుడు నాకు పశ్చాత్తపపడడం, సారీ చెప్పడం తప్ప మరో మార్గం లేదు.' అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. త్రిషపై ఆయన చేసిన కామెంట్స్కు తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా పార్తిబన్ సారీ చెప్పడం ఇక ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పడుతుందనే చెప్పాలి.
Also Read : రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్
అసలేం జరిగిందంటే?
ఇళయ దళపతి విజయ్కు ఆయన భార్య సంగతీ విడాకుల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తన భర్తకు నటితో వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత విజయ్, త్రిష ఇద్దరూ కలిసి ఓ ఈవెంట్లో కలిసి పాల్గొన్నారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ రూమర్స్కు మరింత బలం చేకూర్చింది.
తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో నటుడు పార్తిబన్... త్రిషను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. 'ఈ కుందనైవి (పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష పాత్ర పేరు) కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి. బయటకు వస్తే ఎక్కడా లేని సమస్యలు వస్తున్నాయి.' అంటూ కామెంట్స్ చేశారు. వీటిపై తీవ్ర విమర్శలు రాగా... హీరోయిన్ త్రిష సైతం ఇండైరెక్ట్గా స్ట్రాంగ్గానే రియాక్ట్ అయ్యారు.
త్రిష స్ట్రాంగ్ కౌంటర్
'రీసెంట్గా జరిగిన కార్యక్రమంలో నా పేరు, ఫోటో చేరుస్తున్నామని లాస్ట్ మినిట్లో నాకు చెప్పారు. ఓ వ్యక్తి తన అసిస్టెంట్ను పంపించి కోరడం వల్లే చివరి నిమిషంలో నా పేరు, ఫోటో ఆ ఈవెంట్లో చేర్చారు. మైక్రో ఫోన్లో మాట్లాడినంత మాత్రాన అది తెలివైన కామెంట్ లేదా కామెడీనో కాదు. అది కేవలం మూర్ఖత్వం ఎక్కువ వినిపించేలా చేస్తుంది. అవతలి వ్యక్తి గురించి తెలియకుండా వాడే అసభ్యకర పదజాలం... ఆ వ్యక్తి గురించి కంటే మాట్లాడే వారి సంస్కారం గురించే ఎక్కువ చెబుతుంది.' అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు, దళపతి విజయ్ సైతం డివోర్స్ అంశంపై రియాక్ట్ అయ్యారు. రీసెంట్గా చెన్నైలో జరిగిన ఈవెంట్లో... తనకు ఎదురవుతున్న సమస్యల గురించి ఎవరూ ఇబ్బంది పడాల్సిన పని లేదని అన్నారు. తన వ్యక్తిగత సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తనకు తెలుసని అన్నారు. ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే బాధగా ఉందని... వాటి సంగతి తర్వాత చూస్తానంటూ రియాక్ట్ అయ్యారు. కాగా, విజయ్, సంగీత విడాకుల కేసు ఏప్రిల్ 20న కోర్టులో విచారణకు రానుంది.
ట్రెండింగ్ వార్తలు




















