అన్వేషించండి

Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు

Ration Card EKYC In AP : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. ఈకేవైసీ గడువును మరో నెలరోజులు పెంచింది.

Ration Card EKYC In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నివసించే వాళ్ల రేషన్ కార్డులు ఈకేవైసీ గడువును ప్రభుత్వం మరోసారి పొడగిచింది. వాస్తవంగా మార్చి 31తోనే గడువు ముగియనుంది. అయినా ఇంకా చాలా మంది ఇంకా ఈకేవైసీ చేసుకోవడం లేదు. అందుకే ఈ గడువును మరో నెల రోజుల పాటు పెంచింది. ఆ లోపు ఈకేవాసీ చేసుకోవాలని పౌరుసరఫరాల శాఖ అధికారులు సూచించారు. మరోసారి పెంపుదల ఉండదని చెబుతున్నారు. ఏప్రిల్ 30 లోపు ఈకేవైసీ చేసుకోని కార్డులను తొలగిస్తామని వాళ్లకు రేషన్ అందబోదని స్పష్టం చేశారు.  

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొత్తరేషన్ కార్డులు జారీ చేయనుంది. మార్పులు చేర్పులకు కూడా అవకాశం  కల్పించనుంది. ఈ లోపు ఉన్న కార్డుల్లో ఎన్ని అర్హమైనవి ఎన్ని ఫేక్ కార్డులో లెక్కలు తేల్చేందుకు సిద్ధమైంది. అందుకే కార్డు హోల్డర్లు అందరూ ఈకేవైసీ చేసుకోవాలని ప్రజలకు సూచించింది. మార్చి 31 వరకు ఈకేవైసీ పూర్తి చేసి ఏప్రిల్‌లో స్క్రూట్నీ ప్రక్రియ చేపట్టాలని భావించింది. కానీ ఇంకా లక్షల్లో ఈకేవైసీ చేసుకోని వాళ్లు ఉన్నారు. దీని వల్ల అర్హత లేని వాళ్లకు కార్డులు తీసివేయడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని యోచించింది.  

ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న కార్డుల్లో ఫ్యామిలీలో ఒకరిద్దరు ఇంటి వద్దే ఉంటున్నారు. రేషన్ ఇచ్చే టైంలో వాళ్లు మాత్రమే వేలి ముద్ర వేసి రేషన్ తీసుకుంటున్నారు. ఇందులో చాలా మంది ఫ్యామిలీ మెంబర్‌ లోకల్‌గా లేకపోవడం, చదువులు ఉద్యోగాల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో వారి వివరాలు అప్‌డేట్ కావడం లేదు. అందుకే అలాంటి వారి వివరాలు తెలుసుకునేందుకు ఈకేవైసీ చేసింది.  

ఈ ఈకేవైసీ ప్రక్రియను డీలర్ల ద్వారా చేపడుతున్నారు. రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉన్నా సరే  సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవచ్చు.  గడువు ముగుస్తుందని చెప్పడంతో ఆఖరి నిమిషంలో ఎక్కువ మంది ఈకేవైసీ కోసం ఎగబడుతున్నారు. దీంతో సర్వర్ సమస్యలు వస్తున్నాయి. రేషన్ డీలర్ల వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నారు. అందుకే ప్రభుత్వం గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పెంచింది.  

కేంద్రం ఆదేశాలతో గడువు పెంపు  

జాతీయ ఆహార భద్రత పథకం కింద దేశవ్యాప్తంగా చాలా మంది లబ్ధిదారులు ఇంకా eKYCని పూర్తి చేయలేదని కేంద్రం గమనించింది. అందుకే ఈ ప్రక్రియను ఏప్రిల్ 30, 2025 నాటికి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పూర్తి చేయాలని సూచించారు.  eKYC పూర్తి చేయడంలో విఫలమైతే ఆయా రాష్ట్రాలకు ఇచ్చే సబ్సిడీ నిలుపుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !

వీడియోలు

అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Bondi Beach Shooting: తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
Traffic challan cyber scam: సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
Embed widget