Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
Ration Card EKYC In AP : ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. ఈకేవైసీ గడువును మరో నెలరోజులు పెంచింది.

Ration Card EKYC In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో నివసించే వాళ్ల రేషన్ కార్డులు ఈకేవైసీ గడువును ప్రభుత్వం మరోసారి పొడగిచింది. వాస్తవంగా మార్చి 31తోనే గడువు ముగియనుంది. అయినా ఇంకా చాలా మంది ఇంకా ఈకేవైసీ చేసుకోవడం లేదు. అందుకే ఈ గడువును మరో నెల రోజుల పాటు పెంచింది. ఆ లోపు ఈకేవాసీ చేసుకోవాలని పౌరుసరఫరాల శాఖ అధికారులు సూచించారు. మరోసారి పెంపుదల ఉండదని చెబుతున్నారు. ఏప్రిల్ 30 లోపు ఈకేవైసీ చేసుకోని కార్డులను తొలగిస్తామని వాళ్లకు రేషన్ అందబోదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొత్తరేషన్ కార్డులు జారీ చేయనుంది. మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించనుంది. ఈ లోపు ఉన్న కార్డుల్లో ఎన్ని అర్హమైనవి ఎన్ని ఫేక్ కార్డులో లెక్కలు తేల్చేందుకు సిద్ధమైంది. అందుకే కార్డు హోల్డర్లు అందరూ ఈకేవైసీ చేసుకోవాలని ప్రజలకు సూచించింది. మార్చి 31 వరకు ఈకేవైసీ పూర్తి చేసి ఏప్రిల్లో స్క్రూట్నీ ప్రక్రియ చేపట్టాలని భావించింది. కానీ ఇంకా లక్షల్లో ఈకేవైసీ చేసుకోని వాళ్లు ఉన్నారు. దీని వల్ల అర్హత లేని వాళ్లకు కార్డులు తీసివేయడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని యోచించింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న కార్డుల్లో ఫ్యామిలీలో ఒకరిద్దరు ఇంటి వద్దే ఉంటున్నారు. రేషన్ ఇచ్చే టైంలో వాళ్లు మాత్రమే వేలి ముద్ర వేసి రేషన్ తీసుకుంటున్నారు. ఇందులో చాలా మంది ఫ్యామిలీ మెంబర్ లోకల్గా లేకపోవడం, చదువులు ఉద్యోగాల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో వారి వివరాలు అప్డేట్ కావడం లేదు. అందుకే అలాంటి వారి వివరాలు తెలుసుకునేందుకు ఈకేవైసీ చేసింది.
ఈ ఈకేవైసీ ప్రక్రియను డీలర్ల ద్వారా చేపడుతున్నారు. రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉన్నా సరే సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవచ్చు. గడువు ముగుస్తుందని చెప్పడంతో ఆఖరి నిమిషంలో ఎక్కువ మంది ఈకేవైసీ కోసం ఎగబడుతున్నారు. దీంతో సర్వర్ సమస్యలు వస్తున్నాయి. రేషన్ డీలర్ల వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నారు. అందుకే ప్రభుత్వం గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పెంచింది.
కేంద్రం ఆదేశాలతో గడువు పెంపు
జాతీయ ఆహార భద్రత పథకం కింద దేశవ్యాప్తంగా చాలా మంది లబ్ధిదారులు ఇంకా eKYCని పూర్తి చేయలేదని కేంద్రం గమనించింది. అందుకే ఈ ప్రక్రియను ఏప్రిల్ 30, 2025 నాటికి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పూర్తి చేయాలని సూచించారు. eKYC పూర్తి చేయడంలో విఫలమైతే ఆయా రాష్ట్రాలకు ఇచ్చే సబ్సిడీ నిలుపుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.





















