అన్వేషించండి

Supreme Court On Ration Card: 'రేషన్ కార్డు పాపులార్టీ కార్డుగా మారింది' సుప్రీంకోర్టు ఆందోళన

Supreme Court On Ration Card: రేషన్ కార్డుపై సుప్రీంకోర్టు: సబ్సిడీ ప్రయోజనం నిజమైన లబ్ధిదారులకు చేరాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Supreme Court On Ration Card: రేషన్ కార్డుల వినియోగంపై సుప్రీంకోర్టు బుధవారం (మార్చి 19, 2025) ఆందోళన వ్యక్తం చేసింది. నిజమైన అవసరమైన లబ్ధిదారులకు చేరేలా చూసుకోవడం చాలా ముఖ్యం అని కోర్టు పేర్కొంది. పేదల కోసం రూపొందించిన ఈ కార్డులు అనవసరమైన వ్యక్తులకు చేరుతున్నాయని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

వార్తా సంస్థ PTI ప్రకారం... జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం సబ్సిడీ ప్రయోజనం నిజమైన లబ్ధిదారులకు చేరాలని పేర్కొంది. "పేద ప్రజల కోసం ఉద్దేశించిన ప్రయోజనాలు అర్హులు కాని వారికి నిజంగా చేరుతున్నాయా లేదా అనేది మా ఆందోళన" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. రేషన్ కార్డు ఇప్పుడు పాపులారిటీ కార్డుగా మారిందని అన్నారు. 

'తలసరి ఆదాయం పెరిగిందని రాష్ట్రాలు చెబుతున్నాయి'
"రాష్ట్రాలు చాలా కార్డులు జారీ చేశామని అంటున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు తమ అభివృద్ధిని చూపించాలనుకున్నప్పుడు మన తలసరి ఆదాయం పెరుగుతోందని చెబుతున్నాయి. బిపిఎల్ గురించి మాట్లాడేటప్పుడు, జనాభాలో 75 శాతం మంది బిపిఎల్ అని అంటున్నారు. దీన్ని ఎలా పరిష్కరించాలి? ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూసుకోవాలి" అని న్యాయమూర్తి అన్నారు.

అభివృద్ధి సూచిక గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రాష్ట్రాల తమ తలసరి వృద్ధిని చూపిస్తున్నాయని, కానీ సబ్సిడీల విషయంలో వారి జనాభాలో 75 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని పేర్కొన్నాయని కోర్టు పేర్కొంది.

ఏ కేసు విచారణలో ఉంది?
కోవిడ్-19 మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న బాధలను తగ్గించడానికి దాఖలు చేసిన సుమోటో పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ప్రజల ఆదాయంలో అసమానతల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని అన్నారు. "ఎక్కువ సంపద కలిగి ఉన్న కొద్దిమంది మాత్రమే ఉన్నారు. తలసరి ఆదాయం రాష్ట్ర మొత్తం ఆదాయంలో సగటు మాత్రమే. ధనవంతులు ధనవంతులు అవుతున్నారు, పేదలు పేదలుగానే ఉన్నారు" అని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న పేద వలస కార్మికులకు ఉచిత రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ సంఖ్య దాదాపు ఎనిమిది కోట్లు అని న్యాయవాది భూషణ్ అన్నారు.

'రేషన్ కార్డులో రాజకీయాలు ఉండకూడదు'
"రేషన్ కార్డుల జారీలో ఎటువంటి రాజకీయ అంశాలు లేవని ఆశిస్తున్నాము. పేదల స్థితిగతులు ఎల్లప్పుడూ తెలుసుకోవాలనుకుంటాం. ఇప్పటికీ పేదరికంలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కేంద్రం 2021 జనాభా లెక్కలను నిర్వహించలేదని, 2011 జనాభా లెక్కల డేటాపైనే ఆధారపడిందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఉచిత రేషన్ అవసరమైన దాదాపు 10 కోట్ల మంది ప్రజలు బిపిఎల్ కేటగిరీకి దూరంగా ఉన్నారని తెలిపారు.

పేదలకు పంపిణీ చేసే ఉచిత రేషన్‌ వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ధర్మాసనం ఈ కేసును వాయిదా వేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 ప్రకారం, 81 కోట్ల మందికి ఉచితంగా, సబ్సిడీ ధరలకు రేషన్ ఇస్తున్నట్లు కేంద్రం చెప్పినప్పుడు కోర్టు ఆశ్చర్యపోయింది. దీనిపై కోర్టు స్పందిస్తూ, పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఈ సదుపాయాన్ని కోల్పోతారని కామెంట్ చేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget