అన్వేషించండి

Supreme Court On Ration Card: 'రేషన్ కార్డు పాపులార్టీ కార్డుగా మారింది' సుప్రీంకోర్టు ఆందోళన

Supreme Court On Ration Card: రేషన్ కార్డుపై సుప్రీంకోర్టు: సబ్సిడీ ప్రయోజనం నిజమైన లబ్ధిదారులకు చేరాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Supreme Court On Ration Card: రేషన్ కార్డుల వినియోగంపై సుప్రీంకోర్టు బుధవారం (మార్చి 19, 2025) ఆందోళన వ్యక్తం చేసింది. నిజమైన అవసరమైన లబ్ధిదారులకు చేరేలా చూసుకోవడం చాలా ముఖ్యం అని కోర్టు పేర్కొంది. పేదల కోసం రూపొందించిన ఈ కార్డులు అనవసరమైన వ్యక్తులకు చేరుతున్నాయని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

వార్తా సంస్థ PTI ప్రకారం... జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం సబ్సిడీ ప్రయోజనం నిజమైన లబ్ధిదారులకు చేరాలని పేర్కొంది. "పేద ప్రజల కోసం ఉద్దేశించిన ప్రయోజనాలు అర్హులు కాని వారికి నిజంగా చేరుతున్నాయా లేదా అనేది మా ఆందోళన" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. రేషన్ కార్డు ఇప్పుడు పాపులారిటీ కార్డుగా మారిందని అన్నారు. 

'తలసరి ఆదాయం పెరిగిందని రాష్ట్రాలు చెబుతున్నాయి'
"రాష్ట్రాలు చాలా కార్డులు జారీ చేశామని అంటున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు తమ అభివృద్ధిని చూపించాలనుకున్నప్పుడు మన తలసరి ఆదాయం పెరుగుతోందని చెబుతున్నాయి. బిపిఎల్ గురించి మాట్లాడేటప్పుడు, జనాభాలో 75 శాతం మంది బిపిఎల్ అని అంటున్నారు. దీన్ని ఎలా పరిష్కరించాలి? ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూసుకోవాలి" అని న్యాయమూర్తి అన్నారు.

అభివృద్ధి సూచిక గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రాష్ట్రాల తమ తలసరి వృద్ధిని చూపిస్తున్నాయని, కానీ సబ్సిడీల విషయంలో వారి జనాభాలో 75 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని పేర్కొన్నాయని కోర్టు పేర్కొంది.

ఏ కేసు విచారణలో ఉంది?
కోవిడ్-19 మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న బాధలను తగ్గించడానికి దాఖలు చేసిన సుమోటో పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ప్రజల ఆదాయంలో అసమానతల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని అన్నారు. "ఎక్కువ సంపద కలిగి ఉన్న కొద్దిమంది మాత్రమే ఉన్నారు. తలసరి ఆదాయం రాష్ట్ర మొత్తం ఆదాయంలో సగటు మాత్రమే. ధనవంతులు ధనవంతులు అవుతున్నారు, పేదలు పేదలుగానే ఉన్నారు" అని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న పేద వలస కార్మికులకు ఉచిత రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ సంఖ్య దాదాపు ఎనిమిది కోట్లు అని న్యాయవాది భూషణ్ అన్నారు.

'రేషన్ కార్డులో రాజకీయాలు ఉండకూడదు'
"రేషన్ కార్డుల జారీలో ఎటువంటి రాజకీయ అంశాలు లేవని ఆశిస్తున్నాము. పేదల స్థితిగతులు ఎల్లప్పుడూ తెలుసుకోవాలనుకుంటాం. ఇప్పటికీ పేదరికంలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కేంద్రం 2021 జనాభా లెక్కలను నిర్వహించలేదని, 2011 జనాభా లెక్కల డేటాపైనే ఆధారపడిందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఉచిత రేషన్ అవసరమైన దాదాపు 10 కోట్ల మంది ప్రజలు బిపిఎల్ కేటగిరీకి దూరంగా ఉన్నారని తెలిపారు.

పేదలకు పంపిణీ చేసే ఉచిత రేషన్‌ వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ధర్మాసనం ఈ కేసును వాయిదా వేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 ప్రకారం, 81 కోట్ల మందికి ఉచితంగా, సబ్సిడీ ధరలకు రేషన్ ఇస్తున్నట్లు కేంద్రం చెప్పినప్పుడు కోర్టు ఆశ్చర్యపోయింది. దీనిపై కోర్టు స్పందిస్తూ, పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఈ సదుపాయాన్ని కోల్పోతారని కామెంట్ చేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Kannappa Songs: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
Embed widget