కృష్ణబాబు కాలనీలో తాగునీటి మోటార్ తొలగింపు విషయంలో మొదలైన వివాదం దాడికి దారితీసింది. మల్లెల మూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ గొడవ పెద్దదైంది.
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం
గుంటూరులో అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళలను కొందరు వ్యక్తులు నీచంగా వివస్త్రను చేసి దాడి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. బాధ్యులను అరెస్టు చేయాలని ఆదేశించారు.

- గుంటూరులో నీటి మోటార్ వివాదంపై మహిళను వివస్త్రను చేసి దాడి.
- టీడీపీ నేత మల్లెల మూర్తి సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు.
- సీఎం చంద్రబాబు స్పందన, నిందితుడి అరెస్టు, పార్టీ సస్పెన్షన్.
Guntur Crime News: గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో తాగునీటి విషయంలో జరిగిన గొడవలో ఓ మహిళను అతి నీచంగా కొట్టారు. ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. ఈ దాడిలో మల్లెల మూర్తి అనే టీడీపీ నేత హస్తం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఓ మహిళ ఇంటి మోటార్ తొలగించడంపై వివాదం మొదలైంది.
చాలా కాలంగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ ఇంటి పైప్లైన్కు ఒక మోటార్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ మధ్య ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డువేశారు. దీంతో ఆ మోటార్ను తొలగించాలని స్థానిక నేత మల్లెల వెంకటరమణ మూర్తి మహిళకు చెప్పారు. వినకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ మోటార్తో సిమెంట్ రోడ్డుకు ఎలాంటి ఇబ్బంది లేదని వాదించారు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూర్తి అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్కు వెళ్లి వచ్చిన తర్వాత ఆ మహిళపై దాడి జరిగింది. మూర్తీ, ఆయన చెల్లి వరుస అయ్యే ట్రాన్స్ జెండర్ మాధవితోపాటు అంతా కలిసి మహిళపై దాడి చేశారు. ఆమెను కిందపడేసి తొక్కారు.ఆమె వేసుకున్న బట్టలను చించేశారు. బూతులు తిడుతూ కొట్టారు. స్థానికులు వచ్చి నిలదీయడంతో అక్కడి నుంచి వారంతా జారుకున్నారు. చుట్టుపక్కల వారంతా ఆమెను నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు మూర్తితోపాటు దాడి చేసిన 8 మందిపై కేసులు నమోదు చేశారు.
గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం చంద్రబాబు సీరియస్
దీని గురించి తెలుసుకున్న ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఎక్స్వేదికగా స్పందించారు. ఘటన తనను కలచివేసిందని అన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి ఘటనలకు సమాజంలో తావు లేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
I am deeply disturbed by the incident reported from Guntur. The humiliation of any woman is completely unacceptable and has no place in our society.
— N Chandrababu Naidu (@ncbn) July 18, 2026
I have ordered immediate and stringent action. A criminal case has been registered, the accused has been arrested, and the party…
ఇప్పటికే దీనిపై హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు. గుంటూరులో మహిళపై దాడి చేసిన వారని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని ఆదేశించారు.. ఎస్పీతో మాట్లాడిన ఆమె కేసు పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
గుంటూరు నగరంలోని కృష్ణబాబు కాలనీలో ఓ మహిళపై జరిగిన అమానుష దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన అత్యంత ఖండనీయమైనది.
— Anitha Vangalapudi (@Anitha_TDP) July 18, 2026
మహిళలపై అన్యాయం చేసిన వారెవరైనా, వారు ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి పలుకుబడి ఉన్న వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. నిందితులందరినీ గుర్తించి కఠినంగా…
Frequently Asked Questions
గుంటూరులో మహిళపై దాడికి కారణం ఏమిటి?
మహిళపై దాడిలో ఎవరు పాల్గొన్నారు?
మల్లెల మూర్తి, అతని చెల్లి వరుస అయ్యే ట్రాన్స్జెండర్ మాధవితో పాటు మరో ఆరుగురు (మొత్తం 8 మంది) ఈ దాడిలో పాలుపంచుకున్నారు. పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందించారు?
సీఎం చంద్రబాబు ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ దాడిపై పోలీసులు తీసుకున్న చర్యలు ఏమిటి?
బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు మల్లెల మూర్తితో సహా దాడికి పాల్పడిన 8 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసినట్లు సీఎం తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు






















