ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు వంటి అనర్హుల చేత పేపర్లను దిద్దించి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆరోపణలున్నాయి.
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల పేపర్లను ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించి, అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

- సీఎం చంద్రబాబు APPSC గ్రూప్-1 అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
- ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లతో పేపర్లు దిద్దించి, కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారు.
- అక్రమాలు అభ్యర్థుల జీవితాలు నాశనం చేయగా, సీఎం పారదర్శకత హామీ.
అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో చోటుచేసుకున్న తీవ్ర అక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరకు గ్రూప్-1 స్థాయి అధికారులను ఎంపిక చేసే ఎగ్జామ్ పేపర్లను ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించి, అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 344 నిబంధన కింద జరిగిన ప్రత్యేక చర్చలో భాగంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం అత్యంత పారదర్శకంగా పనిచేయాల్సిన ఏపీపీఎస్సీని గత పాలకులు నిర్వీర్యం చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు ఎంతో కీలకమైన గ్రూప్-1 అధికారులను ఎంపిక చేసే ఈ వ్యవస్థలో, అభ్యర్థులు రాత్రింబవళ్లు శ్రమించి ఉద్యోగాలు సాధించడానికి ప్రయత్నిస్తే, వారి భవిష్యత్తుతో బరితెగించి ఆడుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ అనేది ప్రజలకు జవాబుదారీతనంతో విషయాలు వెల్లడించే ప్రాథమిక వేదిక కాబట్టి, ఈ విధ్వంసాన్ని ప్రజా క్షేత్రంలో స్పష్టంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం ప్రారంభం..
2019 నుండి 2024 మధ్య కాలంలో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను మాత్రమే కాకుండా, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని సైతం పూర్తిగా దెబ్బతీసిందని సీఎం విమర్శించారు. 2018లో విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్కు దాదాపు 1.14 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 325 మందిని షార్ట్లిస్ట్ చేయడం జరిగింది. సాధారణంగా పదో తరగతి పరీక్ష పత్రాలను కూడా పోలీసు ఎస్కార్ట్తో అత్యంత భద్రంగా తరలిస్తుంటే, రాష్ట్రాన్ని పాలించే ఉన్నతాధికారుల ఎంపిక పరీక్ష విషయంలో అన్ని నిబంధనలను గాలికి వదిలేసి తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైకోర్టు డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కన పెట్టి మాన్యువల్ మూల్యాంకనం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కోర్టును తప్పుదోవ పట్టిస్తూ అసత్య అఫిడవిట్లు సమర్పించారని దుయ్యబట్టారు. న్యాయస్థానం ఉత్తర్వుల తర్వాత అయినా పరిస్థితిని సరిదిద్దాల్సింది పోయి, మరొక కేసులో సీఐడీ స్వాధీనంలో ఉన్న 'హాయ్ లాండ్' కేంద్రంగా మాన్యువల్ ఎవాల్యుయేషన్ నిర్వహించేందుకు రూ.1.19 కోట్లకు జీవో జారీ చేశారని వెల్లడించారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, ప్రైవేటు వ్యక్తులకు పేపర్ వాల్యుయేషన్ బాధ్యతలను అప్పగించారని ధ్వజమెత్తారు.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Frequently Asked Questions
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో గుర్తించిన ప్రధాన అక్రమాలు ఏమిటి?
ఈ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏమిటి?
భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం APPSC పారదర్శకంగా పనిచేసేలా చూస్తామన్నారు.
మూల్యాంకనం విషయంలో APPSC హైకోర్టు ఆదేశాలను ఎలా ఉల్లంఘించింది?
డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కన పెట్టి మాన్యువల్ మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించినా, కోర్టును తప్పుదోవ పట్టించి అసత్య అఫిడవిట్లు సమర్పించారు. సీఐడీ స్వాధీనంలోని 'హాయ్ లాండ్'లో ప్రైవేటు వ్యక్తులతో మాన్యువల్ ఎవాల్యుయేషన్ నిర్వహించారు.
ట్రెండింగ్ వార్తలు






















