అన్వేషించండి

ప్రసవించే కప్పకు.. పాము పడగవిప్పి నీడనిచ్చిన ప్రదేశం - అందుకే అత్యంత పవిత్ర స్థలం!

Sri Sringeri Sharada Peetham: కర్ణాటక రాష్ట్రం తుంగనది ఒడ్డున ఉన్న శృంగేరిలో ఆది శంకరాచార్యులు మొదట పీఠం స్థాపించారు. భక్తులకు ఇది అత్యంత పవిత్ర యాత్రా స్థలం. ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది...

Story of Frog and Snake in Sringeri: విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం.  శృంగేరి కి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చిందంటారు. రోమపాదుడు పాలిస్తున్న ఈ రాజ్యంలో అడుగు పెట్టిన ఋష్యశృంగుడు ఆ రాజ్యాన్ని కరవు నుంచి విముక్తి కలిగించి...వర్షాలు కురిసేలా చేశాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కరవు అనే మాట వినిపించలేదు. అదే సమయంలో ధర్మ ప్రచారం కోసం ఆదిశంకరాచార్యులు దేశాటన చేస్తూ తన శిష్యులతో కలసి ఇక్కడ అడుగుపెట్టారు. ఆ సమయంలో ప్రసవిస్తున్న ఓ కప్పకు  పాము తన పడగతో నీడ కల్పిస్తుంది. బద్ధ శత్రువులైన పాము, కప్ప మధ్య స్నేహం చిగురించిందంటే ఇదంతా ఆ ప్రదేశం గొప్పతమనే అని భావించారు. అందుకే తాను నిర్మించాలి అనుకున్న నాలుగు మఠాల్లో మొదటి మఠాన్ని ఏర్పాటు చేశారు. అదే శృంగేరి శారదా పీఠం. మఠాన్ని స్థాపించిన తర్వాత 12 ఏళ్ల పాటూ ఆదిశంకరాచార్యులు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత పూరి , బదరీ, ద్వారకలో మరో మూడు మఠాలు స్థాపించారు. హిందూ సనాతన ధర్మాలను పరిరక్షిస్తూ ఈ పీఠాలు ప్రచారం చేస్తుంటాయి..

Also Read: మే 16 or 17 సీతానవమి ఎప్పుడు - విశిష్టత ఏంటి!
 
ఎన్నో అద్భుతాల నిలయం
శృంగేరి ఆలయ పరిసరాలు 20 వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించి ఉండేవి..అగ్నిప్రమాదం జరగడంతో పాత దేవాలయం స్థానంలో కొత్త దేవాలయాన్ని ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంలో దర్శనమిస్తారు. స్వామివారికి ఇరువైపులా వినాయకుడు, అమ్మవారు కొలువయ్యారు. మండపంలో స్తంభాలపై 12 రాశులు చెక్కి ఉంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన కిటికీల నుంచి సూర్యకిరణాలు..నెలల ప్రకారం ఆయా రాశులపై పడేలా ఏర్పాట్లు చేశారు. మరో విశేషం ఏంటంటే ఆలయంలో స్తంభాలపై ఉన్న గండ్రటి రాళ్లు గోళాకారంగా సింహం నోటి నుంచి బయటకు జారినట్టు చెక్కడం అద్భుతం అనిపిస్తుంది. తుంగ నదికి ఓ వైపు విద్యాశంకర దేవాలయం..దానిని అనుసంధానంగా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడున్న సూర్య నారాయణ స్వామి ఆలయం ధ్యానానికి చాలా అనువైనది. నరసింహ వనము అత్యంత ప్రత్యేకం. 20వ శతాబ్ధంలో ఈ ప్రదేశం మొత్తం దట్టమైన అడవిలా ఉండేది.. అప్పుడు జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవనృసింహభారతీ మహాస్వామివారు నిత్యం ఆ వనంలో ధ్యానం చేసేవారు. అలా అప్పటి మఠం ప్రధాన కార్యనిర్వహణాధికారి ఆ ప్రాంతంలో చిన్న కుటీరం నిర్మించి..జగద్గురువులు ఉండేందుకు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఆ చిన్న నిర్మాణం విస్తరించి శ్రీసచ్చిదానంద విలాస్ పేరుతో జగద్గురువుల ఆశ్రమంగా పరిణామం చెందింది. ఆ పక్కనే గురునివాస్ అనే పూజాప్రాంగణం, వేదపాఠశాల ఉన్నాయి. 

Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!

పరమేశ్వరుడు ప్రసాదించిన స్పటిక లింగం

శృంగేరిలో శ్రీ శారదా పీఠాన్ని నెలకొల్పిన సమయంలో సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే శంకరాచార్యులవారికి స్పటిక లింగం ప్రసాదించారు. ఆ మహిమాన్విత లింగాన్ని నిత్యారాధన కోసం అక్కడే ఏర్పాటు చేశారు. వందల ఏళ్లుగా ఈ అపూర్వ శివలింగానికి నిత్యం రెండుసార్లు ప్రత్యేక అభిషేక ఆరాధనలు జరుగుతున్నాయి.  

శ్రీ శృంగేరి పీఠానికి 4 దిక్కులా నలుగురు రక్షకులు

తూర్పున - శ్రీ కాలభైరవ స్వామి ఆలయం
పశ్చిమాన- శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం
దక్షిణాన - శ్రీ దుర్గాంబ అమ్మవారి ఆలయం
ఉత్తరాన - శ్రీ కాళికాంబ అమ్మవారి ఆలయం 
మఠం ప్రాంగణానికి కొద్దిదూరంలో చిన్న కొండపై శ్రీ మలహానికారేశ్వర దేవాలయం వెలసింది.  కశ్యప మహర్షి కుమారుడైన విభాండక మహర్షి ఈ కొండపై తపస్సు చేసి జ్యోతి స్వరూపంతో శ్రీ మలహానికారేశ్వర లింగంలో ఐక్యం అయినట్టు ఆధారాలున్నాయి. 

Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!

గమనిక: కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం..దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం... 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
Ishan Kishan Viral Video: టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget