అన్వేషించండి

Satyakumar News: ఇంగ్లీష్ తోనే అభివృద్ధి అనే భావన పిల్లలకు ఎక్కించొద్దు: మంత్రి సత్య కుమార్

ఇంగ్లీష్ తో మాత్రమే అభివృద్ధి సాధిస్తామనే భావన పిల్లల మనసుల్లోకి ఎక్కించొద్దు. తల్లిదండ్రులకు వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ సూచన

Andhra Pradesh News | ప్రధాని  నరేంద్ర మోడీ కలలు కంటున్న వికసిత్ భారత్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలు కంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో విద్యార్ధులు భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.  బాపట్ల జిల్లా రేపల్లె రూరల్ మండలం చాట్రగడ్డ గ్రామంలో సనాతన వేదాంత నిష్టాశ్రమ శ్రీ సరస్వతీ విద్యామందిర్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో  ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  

మాతృ భాషలో అధ్యయనం కొనసాగించాలి

ఈ సందర్భంగా మంత్రి  సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మాతృ భాషలో అధ్యయనం కొనసాగించాలన్నారు.  ఆంగ్లభాషతో మాత్రమే అభివృద్ధి చెందగలమన్న అపోహను విడనాడాలని హితవు పలికారు.  ఆంగ్లభాష వుంటేనే వున్నత స్థాయికి వెళ్తామన్న అపోహలను పిల్లల మనసుల్లో చొప్పించే ప్రయత్నాలను తల్లిదండ్రులు విరమించాలనీ,  మాతృ భాషలో విద్య అభ్య‌సించిన వారికి సృజనాత్మకత ఉంటుంద‌నీ మంత్రి తెలిపారు. ఆంగ్లభాష కేవలం ఒక సమాచార మాధ్యమం మాత్రమేనని, ఆంగ్లభాషలో చదివినంత మాత్రాన ఎవరూ ఎక్కువ స్థాయికి ఎదగలేరని ఆయన స్పష్టం చేశారు.  మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ,  ప్రధాని నరేంద్రమోడీ వంటి వారు ఇందుకు ఉదాహరణగా నిలుస్తారన్నారు.   జపాన్, చైనా వంటి దేశాలు తమ త‌మ‌ మాతృ భాషలోనే  విద్య అభ్యసించి ఎదిగాయ‌న్నారు.  విద్యాదానం అన్నిదానాల కన్నా గొప్పదన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించి సరస్వతీ విద్యా మందిర్ సంస్థకు శతాబ్ది కాలం క్రితమే ఇంత పెద్ద స్థలాన్ని విరాళంగా ఇచ్చి దాత్రుత్వాన్ని చాటుకున్న వీరమాచినేని వీరాంజనేయ శాస్త్రి , మైనేని రాజగోపాలరావు, వెలగపూడి రామక్రుష్ణ , శీతారామయ్య గార్ల సామాజిక సేవా దృక్ప‌ధానికి ప్ర‌ణ‌మిల్లుతున్నాన‌నీ అన్నారు.

ఆస్తుల కబ్జా పెరిగింది

గతంలో విద్య ప్రాశస్త్యాన్ని తెలుసుకుని స్థలం రూపంలో కానీ, ఆర్థిక రూపేణా కానీ సహాయం అందించి వెన్నుదన్నుగా నిలబడిన మహానుభావులెందరో వున్నారన్నారు. ఈ సంస్కృతి కాలక్రమేణా తగ్గుముఖం పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సంస్కృతి మళ్ళీ రావాలని తాను కోరుకుంటున్నానన్నారు.   ఇలాంటి తరుణంలో దాతలు విద్యా సంస్థలకు సమకూర్చిన ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నాలు గత ఐదేళ్లకాలంలో పెరిగిపోయాయన్నారు. దీన్ని అంతం చేసి విద్యా, వైద్య సౌకర్యాల కోసం దాదలు ముందుకొచ్చే సంస్క్రుతిని తీసుకు రావాల్సిన అవసరం ఎంతయినా వుందన్నారు. ఆంగ్లభాషపై మోజుతో అనేక పాఠశాలలు మూతపడుతున్న తరుణంలో మూతపడిన ఈ పాఠశాలను 2023లో పున:ప్రారంభించి ఆదర్శ పాఠశాలగా అభివ్రుద్ధి చేస్తున్న యాజమాన్యానికి, అందుకు సహకరిస్తున్న గజపతిరావుగారి వంటి విశ్రాంత ఉపాధ్యాయునికి తాను అభినందిస్తున్నాన్నారు.  దీనిని విస్తరించే కార్యక్రమంలో తన‌ను భాగస్వాములను చేసిన యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానన్నారు.  

రేపల్లెలో సౌకర్యాల అభివృద్ధిపై ఫోకస్

సరస్వతి విద్యా మందిర్ మాతృ సంస్థ అయిన విద్యాభారతి సంస్థ దేశంలో 24,128 పాఠశాలల్ని నిర్వహిస్తోందన్నారు. ఇటీవల ఒక అమెరికన్ సంస్థ నిర్వహించిన ఇంపాక్ట్ స్టడీలో సరస్వతీ విద్యా మందిర్ సంస్థలు కొన్ని కోట్ల కుటుంబాలలో వెలుగులు నింపిన విషయం బయటపడిందన్నారు. రేపల్లె ప్రాంతంలో వైద్య సౌకర్యాల అభివృద్ధిపై తాను దృష్టి పెడతానని రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ కు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.
 ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎపిఎస్సార్టీసి చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, క‌మిటీ అధ్య‌క్షులు మ‌రియు క‌ర‌స్పాండెంట్ పి.ర‌మేష్ చంద్ర‌,  స‌ర‌స్వ‌తీ విద్యా పీఠం రాష్ట్ర కార్య‌ద‌ర్శి కొసం జ‌గ‌దీష్ తదితరులు  ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget