అన్వేషించండి

Breaking News: తెలుగు రాష్ట్రాల్లో వీడని ముంపు భయం- ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

Breaking News: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ ఖమ్మం, విజయవాడ ఇంకా చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్త వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండిక్కడ.

LIVE

Key Events
Breaking News: తెలుగు రాష్ట్రాల్లో వీడని ముంపు భయం- ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

Background

Breaking News: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ముంచెత్తిన వరదలు కారణంగా భారీగానే నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వేల కోట్ల నష్టం జరిగినట్టు ప్రభుత్వాలు ప్రాథమికంగా అంచనా వేసింది. ఇంకా చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు యావత్ యంత్రాంగం అందులో నిమగ్నమై ఉంది. రెండు రాష్ట్రాల్లో ప్రకృతి విధ్వంసానికి దాదాపు 40 మంది మృతి చెందినట్టు గుర్తించారు. ఇంకా కొందరు గల్లంతైనట్టు తేల్చారు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. 

ఏపీలో పరిస్థితి చూస్తే....
వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించింది. దాదాపు రెండు వేల కిలోమీటర్ల వరకు రోడ్లు దెబ్బతిన్నట్టు అంచనా వేస్తోంది. ఇప్పటికే నీట మునిగిన బాధితలు 176 పునరావాస కేంద్రాల్లో ఉంటున్నట్టు పేర్కొంది. వీళ్ల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపింది. 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. బాధితులకు ఫుడ్, వాటర్ బాటిల్స్ ఇచ్చేందుకు బోట్లు, డ్రోన్లు, హెలికాప్టర్ల ఉపయోగిస్తోంది ప్రభుత్వం. ఇంకా ఎమర్జెన్సీ టైంలో సహాయం కావాలనుకునే వాళ్లు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయమని చెబుతోంది. 

విజయవాడలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మూడు రోజులు అవుతున్నా బాహ్య ప్రపంచంతో సంబంధాలు పునరుద్ధరణ కాలేదు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం  కల్పిస్తోంది. పునరావాసం, బాధితులకు అత్యవసర సేవలపై ఫోకస్‌ ఎక్కవ పెట్టిన ఏపీ ప్రభుత్వం జరిగిన నష్టాన్ని అంచనా వేయడంపై కూడా ఫోకస్ పెట్టింది. ఏపీలో దాదాపుగా ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తేల్చిన ప్రభుత్వం ఇందులో వరి పంట ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. వర్షాల ప్రభావం ఉన్న ఇరవైకిపైగా జిల్లాల్లో నష్టం వాటిల్లిందన్నారు. ఆజిల్లాల్లో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలే ఎక్కువగా నష్టపోయినట్టు తెల్చింది. ఈ వర్షాల ప్రభావానికి సుమారు మూడున్నర లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో నీట మునిగితే గోదావరి జిల్లాల్లో దాదాపు 30 వేలకుపైగా ఎకరాల్లో పంట నాశనమైంది. వరిరైతులతోపాటు పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర రైతులు కూడా భారీగా నష్టపోయారు. 

తెలంగాణలో నష్టాన్ని చూస్తే...

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో వర్షలు, వరదల కారణంగా దాదాపు 20 మందిచనిపోయారు. ఐదు వేల మందికిపైగా ప్రజలకు నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతానికి అందిన సమాచారం మేరకు వర్షాలు, వరదలతో దాదాపు ఆరువేల కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలిపింది. మహబూబాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, సూర్యపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర నష్టం కలిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లింది. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా రోడ్లు కూడా  దెబ్బతిన్నాయి. దీని పునరుద్ధరణకు రెండువేల కోట్లకుపైగానే అవసరం ఉంటుంది. ట్రాన్స్‌కోకి కూడా భారీ నష్టం వాటిల్లింది. స్తంభాలు కూలిపోయి వైర్ల తెగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్స్‌, విద్యుత్ సబ్‌స్టేషన్లు నీట మునిగిపోయాయి. వీటిని బాగు చేయడానికి రిపేర్ల కోసం దాదాపు 150 కోట్లకుపైగానే నిధులు అవసరం అవుతాయి. ఆసుపత్రుల్లో వసతులు, వీధిలైట్లు, డ్రైనేజీలు, ఇతర నష్టాలు దాదాపు 15 వందల కోట్లకుపైగానే ఉండొచ్చని అంచనాకు వచ్చారు. ఓవరాల్‌గా ఆరు వేల కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. 

21:24 PM (IST)  •  03 Sep 2024

వరద బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు

వరద బాధితుల సహాయార్ధం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించిన  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

 

20:59 PM (IST)  •  03 Sep 2024

ట్రాక్టర్ కింద నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన బెజవాడ పోలీసులు

అజిత్ సింగ్ నగర్ - గుర్తుతెలియని మృతదేహాన్ని ట్రాక్టర్ కింద నుంచి బయటకు తీసిన బెజవాడ పోలీసులు

20:20 PM (IST)  •  03 Sep 2024

వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలించారు. * రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు

17:59 PM (IST)  •  03 Sep 2024

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తిన అధికారులు

ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. 70 గేట్లను పూర్తిగా ఎత్తిన అధికారులు.. సముద్రంలోకి 7,46,844 క్యూసెక్కుల నీరు.. కాలువలకు 500 క్యూసెక్కుల నీటి విడుదల.. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,47,344 క్యూసెక్కులు.. బ్యారేజీ నీటిమట్టం 17.4 అడుగులు

17:56 PM (IST)  •  03 Sep 2024

విజయవాడ వరద బాధితులకు నెల్లూరు ఎంపీ కోటి విరాళం

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. తన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు చెక్కు అందచేశారు.

 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
Embed widget