
Breaking News: తెలుగు రాష్ట్రాల్లో వీడని ముంపు భయం- ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
Breaking News: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ ఖమ్మం, విజయవాడ ఇంకా చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్త వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండిక్కడ.
LIVE

Background
వరద బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు
వరద బాధితుల సహాయార్ధం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.
In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the…
— Mahesh Babu (@urstrulyMahesh) September 3, 2024
ట్రాక్టర్ కింద నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన బెజవాడ పోలీసులు
అజిత్ సింగ్ నగర్ - గుర్తుతెలియని మృతదేహాన్ని ట్రాక్టర్ కింద నుంచి బయటకు తీసిన బెజవాడ పోలీసులు
వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలించారు. * రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు
ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తిన అధికారులు
ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. 70 గేట్లను పూర్తిగా ఎత్తిన అధికారులు.. సముద్రంలోకి 7,46,844 క్యూసెక్కుల నీరు.. కాలువలకు 500 క్యూసెక్కుల నీటి విడుదల.. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,47,344 క్యూసెక్కులు.. బ్యారేజీ నీటిమట్టం 17.4 అడుగులు
విజయవాడ వరద బాధితులకు నెల్లూరు ఎంపీ కోటి విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. తన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డితో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు చెక్కు అందచేశారు.
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం నెల్లూరు పార్లమెంటు సభ్యుడు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. తన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డితో కలిసి వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు కు చెక్కు అందచేశారు.#AndhraPradesh pic.twitter.com/nwPIj1okTR
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 3, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
