అన్వేషించండి

AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ

AP Liquor Sales | ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మద్యం అక్రమాలపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని నోటిఫికేషన్ జారీ చేసింది.

Liquor Sales in Andhra Pradesh | అమరావతి: ఏపీలో మద్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మద్యం అక్రమంగా విక్రయిస్తే, అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానాలు విధించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎవరైనా మద్యాన్ని ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధించాలని ఎక్సైజ్ శాఖ (AP Excise Department) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు జరిమానాలపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
లైసెన్స్ సైతం రద్దు చేస్తామని హెచ్చరిక
అధిక ధరలకు మద్యం విక్రయిస్తే భారీ జరిమానా విధిస్తామని ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే తప్పు మరోసారి చేస్తే ఆ మద్యం దుకాణం లైసెన్స్ సైతం రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ విషయాలను ఎపీ ఎక్సైజ్‌ చట్టం సెక్షన్‌ 47(1) ప్రకారం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. పర్మిషన్ లేని వాళ్లు బెల్ట్ షాపులు నడిపితే తాను బెల్ట్ తీయాల్సి వస్తోందని చంద్రబాబు అనంతపురం నేమకల్లులో పాల్గొన్న గ్రామసభలో ఇదివరకే స్పష్టం చేశారు. 

ఏపీలో అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. తరువాత అన్ని జిల్లాల్లో కలెక్టర్, ఉన్నతాధికారుల సమక్షలో లాటరీ డ్రా నిర్వహించి మద్యం షాపులను విజేతలకు కేటాయించారు. ప్రస్తుతం మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకూ తెరిచి ఉంటాయి. వైసీపీ హయాంలో అందుబాటులో లేని డిజిటల్ పేమెంట్స్ ఏపీలో మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. దాంతో నగదు చెల్లింపు సమస్యకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. 

లక్కీ డ్రా లాటరీతో మద్యం షాపులు కేటాయింపు
3,396 షాపులకుగానూ 89,882 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 14న కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి మద్యం షాపుల విజేతల్ని ప్రకటించారు. మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులు సైతం వచ్చాయి. కొన్ని చోట్ల అయితే మద్యం షాపులు దక్కించుకున్న కొందరు కిడ్నాప్ అయ్యారని ప్రచారం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. అక్రమాలు జరగితే సహించేది లేదని.. మద్యం షాపులను స్వేచ్ఛగా, ఎలాంటి భయాలు లేకుండా నిర్వహించాలన్నారు. 

Also Read: Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
Viral News: పాము పగబట్టిందట - 103 సార్లు కాటువేసిందట- చిత్తూరు జిల్లా వ్యక్తి  ప్రచారం
పాము పగబట్టిందట - 103 సార్లు కాటువేసిందట- చిత్తూరు జిల్లా వ్యక్తి ప్రచారం
Telangana Latest News:హైదరాబాద్‌లో మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్‌-2,000 మందికి ఉద్యోగావకాశాలు
హైదరాబాద్‌లో మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్‌-2,000 మందికి ఉద్యోగావకాశాలు
Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
Viral News: పాము పగబట్టిందట - 103 సార్లు కాటువేసిందట- చిత్తూరు జిల్లా వ్యక్తి  ప్రచారం
పాము పగబట్టిందట - 103 సార్లు కాటువేసిందట- చిత్తూరు జిల్లా వ్యక్తి ప్రచారం
Telangana Latest News:హైదరాబాద్‌లో మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్‌-2,000 మందికి ఉద్యోగావకాశాలు
హైదరాబాద్‌లో మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్‌-2,000 మందికి ఉద్యోగావకాశాలు
Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
Embed widget