అన్వేషించండి

Obesity : అధిక బరువునకు కారణాలివే.. యువత ఒబెసిటీని కంట్రోల్ చేయాలంటే ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలి

Obesity Causes : ఊబకాయం సమస్య చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది రావడానికి కారణాలు ఉన్నాయి? అవేంటో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Obesity in Young People : శరీరంలో ఉండాల్సిన కొవ్వుకంటే ఎక్కువగా కొవ్వుకు పేరుకుపోవడం వల్ల అధికబరువు పెరుగుతారు. దీనివల్ల ఊబకాయం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీని బాధితులు పెరుగుతున్నారు. ప్రతి పది మందిలో 7 మంది అధిక బరువు లేదా ఊబకాయంతో సఫర్​ అవుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 2 సంవత్సరాల నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లల్లో కూడా ఇది 20 శాతం ఉంది. యుక్తవయసులను కూడా ఇది ప్రభావితం చేస్తుండడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అధిక బరువు, ఊబకాయం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. అయితే ఈ ఒబేసిటికి డీఎన్​ఏ, ఫ్యామిలీ చరిత్ర ఓ కారణమైతే.. లైఫ్​స్టైల్​ కూడా ఇప్పుడు ప్రధానకారణంగా మారింది. ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, కొన్ని మందుల వల్ల ఈ సమస్య పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యవల్ల కార్డియోవాస్కులర్ సమస్యలు పెరగడమే కాకుండా.. మరణాలకు ప్రధాన కారణంగా మారుతుంది. టైప్​ 2 డయాబెటిస్, క్యాన్సర్​ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

ఇలా గుర్తించొచ్చు..

ఈ ప్రమాదకరమైన సమస్యను వీలైనంత త్వరగా గుర్తించి.. దానికి సంబంధించిన ట్రీట్​మెంట్ తీసుకోవాలంటున్నారు. దీనిని గుర్తించడానికి బాడీ మాస్ ఇండెక్స్ అనే స్క్రీనింగ్ విధానం ద్వారా గుర్తించొచ్చు. ఓ వ్యక్తి ఎత్తు, బరువు, శరీరంలోని కొవ్వు శాతాన్ని అంచనా వేసి.. ఒబేసిటీని గుర్తిస్తారు. మీ BMI సాధారణ పరిధి కంటే ఎక్కువగా ఉంటే మీరు అధిక బరువు లేదా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారని అర్థం. అంతేకాకుండా వివిధ టెస్ట్​ల ద్వారా కూడా వైద్యులు సూచిస్తారు. ఇది ఏ స్టేజ్​లో ఉందో.. ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో.. ఇతర ఆరోగ్య సమస్యలకు ఎలా కారణమవుతుందో చెప్తారు. 

ప్రమాద కారకాలివే.. 

ఈ మధ్యకాలంలో ఒబెసిటీ పెరగడానికి స్మార్ట్​ ఫోన్​ కూడా ఓ కారణమవుతుంది. ఫోన్​కి ఎక్కువగా అలవాటై.. సరైన నిద్రలేక, శారీరక శ్రమపై ఆసక్తి లేక్, ఫుడ్ ఆర్డర్స్ ఇస్తూ చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. ప్రాసెస్ చేసిన, అధిక కేలరీల ఫుడ్, డ్రింక్స్ తాగడం ఒబెసిటీకి ప్రమాద కారకాలుగా చెప్తున్నారు. స్మార్ట్​ఫోన్ ప్రజల్ని సోమరిపోతులుగా మారుస్తుందని ఓ స్టడీ కూడా తేల్చి చెప్పింది. దీనివల్ల కూడా అధిక బరువు పెరుగుతున్నారు. ఈ ఒబెసిటీ మధుమేహం, ఒత్తిడి, బీపీని ప్రేరేపించడంతో పాటు.. వాటివల్ల కూడా రిటర్న్​లో పెరుగుతుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తక్కువ కేలరీలు ఉండే ఫుడ్ తీసుకోవడం.. అన్​హెల్తీ ఫ్యాట్స్ జోలికి వెళ్లకపోవడం, గుండె ఆరోగ్యానికై హెల్తీ డైట్​ ఫాలో అవ్వడం మంచి ఫలితాలు ఇస్తాయి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, నట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది. శారీరక వ్యాయామం కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. వారంలో కనీసం 150 నిమిషాలైనా ఎక్స్​ర్​సైజ్ చేస్తే మంచిది. ఈ సమస్యను గుర్తించిన వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి. ప్రొపర్​ డైట్​ ఫాలో అవ్వాలి. పోషకాలతో కూడిన ఆహారం ఆరోగ్యం విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. 

Also Read : మధుమేహం ఈ మధ్యే వచ్చిందా? అయితే ఈ డైట్​ ప్లాన్​ని ఫాలో అవుతూ.. లైఫ్​ స్టైల్​లో ఈ మార్పులు చేసేయండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget