అన్వేషించండి

TG Ration Cards: రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్, వారికి చివరి అవకాశం

Telangana Ration Cards | రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఈకేవైసీ పూర్తి చేసుకోని వారికి చివరి అవకాశం కల్పించారు.

Ration Card eKYC in Telangana | హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కేవైసీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. వాస్తవానికి మార్చి 31 తేదీ వరకే ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం మరో నెల పొడిగింపు ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరట కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. 

రేషన్ కార్డుదారులకు సబ్సిడీ పంపిణీలో పారదర్శకత నిర్ధారించడంతో పాటు అనర్హులకు కార్డుల ఏరువేతపై కేంద్రం ఫోకస్ చేస్తుంది. జాతీయ ఆహార భద్రత చట్టం(NFSA) కింద రేషన్ కార్డుదారులకు పలు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉచిత బియ్యం అందిస్తున్నాయని తెలిసిందే. మార్చి 31లోగా ఈకేవైసీ పూర్తి చేయని వారికి రేషన్ కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సర్వర్లు ప్రాబ్లమ్ ఉండటం, లబ్దిదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు, సంక్షేమం దూరం కావొద్దని భావించి కేంద్రం ఏప్రిల్ వరకు ఈకేవైసీకి గడువు ఇచ్చింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ నెలాఖరులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. 

ఇదే లాస్ట్ ఛాన్స్...
కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ (e-KYC) పూర్తి చేసుకునేందుకు గతంలో పలుమార్లు గడువు పొడిగించింది. ఇటీవల ఏప్రిల్ 30 తేదీ వరకు ఈకేవైసీకి గడువు ఇచ్చింది. ఈకేవైసీ ప్రక్రియ కోసం డెడ్ లైన్ పొడిగించడం ఇది నాలుగోసారి అని, ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారికి ఇక భవిష్యత్తులో e-KYCకి గడువు పొడిగింపు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. పారదర్శకత కోసం, అక్రమాలు అరికట్టేందుకు చేసే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం లబ్ధిదారుల నిర్లక్ష్యమని అధికారులు అంటున్నారు. ఏప్రిల్ 30 తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేసుకున్న రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రయోజనాలు పొందనున్నారు. తరువాత ఈకేవైసీ పూర్తి చేసుకోని రేషన్ కార్డు దారులకు బియ్యం, సహా రేషన్ సరుకులు అందించరు. అలాంటి రేషన్‌కార్డులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

ఈకేవైసీ ఇలా ఈజీగా పూర్తి చేసుకోండి

ఈ ఈకేవైసీ ప్రక్రియను డీలర్లను సంప్రదించి పూర్తి చేయవచ్చు. గడువు ముగుస్తుందని మార్చి నెలాఖరులో రేషన్ షాపులకు క్యూ కట్టడం, ఆన్ లైన్ పోర్టల్ లో ప్రయత్నించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో ప్రభుత్వం మరో నెలల రోజులు ఈకేవైసీ గడువు పొడిగించింది. రేషన్ షాపులు, ఆధార్ కేంద్రాలు లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లను సంప్రదించి e-KYC ప్రక్రియను సులభంగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి తేదీ వరకు ఎదురుచూడకుండా వీలు చూసుకుని, సాధ్యమైనంత త్వరగా రేషన్‌కార్డు దారులు ఈకేవైసీ పూర్తి చేసుకుని కార్డు రద్దు అవకుండా, లేక రేషన్ సరుకులు నిలుపుదల చేయకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా ఈకేవైసీ ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరులోగా చేసుకుని లబ్ధిదారులు కేంద్రం, రాష్ట్రం అందిస్తున్న ప్రయోజనాలను పొందాలని సూచించారు.

తెలంగాణలో సన్న బియ్యం..
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈ నెల నుంచి సన్న బియ్యం అందిస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారని తెలిసిందే. కొత్త రేషన్ కార్డులకు సైతం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని.. అప్లికేషన్లు పరిశీలించి జారీ చేస్తూనే ఉంటామన్నారు. రెండు రకాలుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది ప్రభుత్వం. ఇదివరకే ఉన్న వారి కార్డులను సైతం అప్ డేట్ చేసి ఏటీఎం, పాన్ కార్డు తరహాలో ఉండే కార్డులను అందజేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Traffic challan cyber scam: సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
Bondi Beach Shooting: తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
Gujarat News: ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు చేస్తున్న గుజరాత్‌ ప్రభుత్వం
ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు!

వీడియోలు

అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Traffic challan cyber scam: సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
Bondi Beach Shooting: తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
Gujarat News: ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు చేస్తున్న గుజరాత్‌ ప్రభుత్వం
ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు!
Karimnagar Cricketer Aman Rao : రాజస్థాన్ రాయల్స్‌లో చోటు దక్కించుకున్న కరీంనగర్‌ కుర్రాడు! 30 లక్షలకు కొనుగోలు 
రాజస్థాన్ రాయల్స్‌లో చోటు దక్కించుకున్న కరీంనగర్‌ కుర్రాడు! 30 లక్షలకు కొనుగోలు 
Director Kiran Kumar Death: తెలుగు చిత్రసీమలో విషాదం... నాగార్జున 'కేడీ' దర్శకుడు మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... నాగార్జున 'కేడీ' దర్శకుడు మృతి
Telangana Latest News: పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget