అన్వేషించండి

KTR On HCU Lands: నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్

HCU Lands Auction Issue | కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను ప్రభుత్వం వేలం వేయడం సరికాదని, వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేయడం దారుణమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ (HCU)కి చెందిన 400 ఎకరాలను వేలం వేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా HCU భూముల వేలం రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వం మొదట అమాయక ప్రజల ఇండ్లు కూలగొట్టారు. ఇప్పుడు పర్యావరణాన్ని నాశనం చేస్తూ మూగ జీవాల ఆవాసాలను సైతం తెలంగాణ ప్రభుత్వం నాశనం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. అందుకు సంబంధించిన వీడియోలను తన ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులు చేస్తున్నారు.

కేటీఆర్ పోస్టులో ఏముందంటే..
కాంగ్రెస్ ప్రభుత్వం మొదట పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇళ్లను కూల్చివేశారు. తరువాత, అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాల ప్రజలను సైతం వెంబడించారు. బంజరు భూముల్లో బల్లులు కూడా గుడ్లు పెట్టవు అని మీరు అన్నారు. కానీ ఇప్పుడు జంతువుల ఆవాసాలను నాశనం చేస్తున్నారు. వాటి నివాసమైన అటవీ ప్రాంతాన్ని నాశనం చేసి మూగ జీవాలకు ఆవాసాలు లేకుండా చేస్తున్నారు. ఇలా చేయడాన్ని ఇంకా మీరు సమర్థించుకుంటున్నారా. ఇది అభివృద్ధా? అది నిజంగానే ప్రభుత్వ భూమా?. మీది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా?. మీరు ఎన్నికైన ప్రతినిధినా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటా’ అని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలతో పోస్ట్ చేశారు. 

విధ్వంసం మీ ఏకైక నినాదం! 
రాష్ట్ర ప్రభుత్వం ఏకైక నినాదం విధ్వంసమే. రాష్ట్ర ఖజానాను నాశనం చేయడమే మీ ఏకైక నినాదం. మీ బుల్డోజర్లు రాత్రిపూట, వారాంతాల్లో సైతం ఎందుకు ఎందుకు నిరంతరాయంగా పనిచేశాయి? అదే సమయంలో కోర్టులకు మీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది.  బయోడైవర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుంది, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అటవీ భూములను వేలం వేసి, అటు పర్యావరణాన్ని నాశనం చేసి మూగ జీవాలకు ఆవాసం లేకుండా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

తొలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ చదివిన వారు దేశ విదేశాల్లో గొప్ప సేవ చేస్తున్నారు. దేశానికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒకటిగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు గొప్ప పోరాటం చేస్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదు. యూనివర్సిటీ విద్యార్థుల పైన, యూనివర్సిటీ భూముల పైన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తున్నది. వందల బుల్డోజర్లను, హిటాచి యంత్రాలను పెట్టి అక్కడున్న చెట్లను నరికి, జంతువులను, చంపి మరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. 

పశ్చిమ హైదరాబాద్‌కి ఊపిరినిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో హెచ్‌సీయూ, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలే. పశ్చిమ హైదరాబాదులో భవిష్యత్తులో ఢిల్లీలాగ ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. యూనివర్సిటీ చుట్టూ ఉన్న హరితాన్ని అలాగే ఉంచితే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. ఒక ఎన్విరాన్మంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ చేయకుండా 400 ఎకరాలు ఎలా అమ్ముతారని విద్యార్థులు అడుగుతున్నారు. పర్యావరణ నష్టం ప్రభావం పైన అధ్యయనం చేయాలని ప్రజలు, విద్యార్థులు అడుగుతున్నారు

అమ్మడం, అప్పులు తేవడమే రేవంత్ అజెండా..

21 సంవత్సరాల తర్వాత ఇటీవల ఈ కేసు తేలింది. కానీ ప్రభుత్వంఆ భూములను అమ్మి రూ. 30 వేల కోట్లు సేకరించాలని ప్రయత్నం చేస్తుంది. ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే ఎజెండా పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఫ్యూచర్ సిటీ  50 వేల ఎకరాలు, ఫార్మాసిటీ భూములతో పాటు మరో 30 వేల ఎకరాలు సేకరించి ఫ్యూచర్ సిటీ కడతామంటున్నారు. వేల ఎకరాలు మీకు అందుబాటులో ఉన్నప్పుడు 45 వేల ఎకరాలు అమ్ముకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
Argentina vs Spain World Cup Final Hyderabad: ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Embed widget