అన్వేషించండి

Ramadan 2025: రంజాన్ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం.. ఈ నెల గురించి ఖురాన్ లో ఏముంది!

Ramadan 2025 Start Date India: చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్లో తొమ్మిదోది 'రంజాన్' మాసం. ఈ ఏడాది మార్చి 2 నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్నాయ్..రంజాన్ ఎందుకంత పవిత్రం?

Ramadan 2025 Start Date : సాధారణంగా నెలవంక మొదటగా గల్ఫ్ దేశాల్లో కనిపిస్తుంది...ఒక రోజు తర్వాత దక్షిణాసియా దేశాల్లో కనిపిస్తుంది.  ఈ ఏడాది సౌదీ అరేబియాలో  ఫిబ్రవరి 28 శుక్రవారం సాయంత్రం నెలవంక దర్శనం ఇవ్వనుంది. దీంతో మార్చి 1వ తేదీ శనివారం.. భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో  చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీలో మొదలైన తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ఆరంభమవుతాయి. అంటే మార్చి 01 శనివారం సాయంత్రం నెలవంక కనిపిస్తే మార్చి 02 ఆదివారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది.  

నెల రోజులు ముస్లింలకు ఎందుకంత ప్రత్యేకం అంటే దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించింది. 

ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన 'రోజా' ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో  సాగుతుంది. 

మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం ..మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు భగవంతుడు ఈ మాసాన్ని సృష్టించాడని విశ్వాసం.

Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!
 
రంజాన్ మాసంలో నెల రోజుల పాటూ చేసే కఠిన ఉపవాస దీక్షలతో శరీరం, మనసులోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని విశ్వసిస్తారు. సూర్యోదయ సమయంలో ‘సహర్‌’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే 'ఇప్తార్‌' వరకు నీళ్లు కూడా ముట్టుకోరు. 

ఈ నెలలో ఎవరైనా మరణిస్తే నేరుగా స్వర్గానికే చేరుకుంటారని ముస్లింల ప్రగాఢ విశ్వాసం
  
రంజాన్ ఉపవాస దీక్షలకు వయసుతో పనిలేదు.  ఈ దీక్షలతో బలహీనతలను, వ్యసనాలను జయించవచ్చని మత గురువులు బోధిస్తారు. సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి..ముందుగా ఖర్జూరపు పండు తిని దీక్ష విరమిస్తారు. ఆ తర్వాత రుచికరమైన వంటకాలు భుజిస్తారు. వీటిలో ప్రత్యేకమైన వంటకం హలీమ్
 
ఈ నెల రోజులు పెట్టుకునే ‘సుర్మా'తో కళ్లకు కొత్త అందం వస్తుంది. ప్రవక్త హజరత్‌ మహ్మద్‌ నిత్యం సుర్మా పెట్టుకునేవారని చెబుతారు. పౌడర్‌ రూపంలో ఉండే సుర్మాను భరిణెల్లో దాచుకుని వాళ్లు మాత్రమే కాదు..ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఇస్తారు. నమాజు చేసేముందు ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు..ఇది కేవలం సంప్రదాయం మాత్రమే అనుకోవద్దు..కళ్లకు ఆరోగ్యం కూడా.  
 
ప్రతి  శుక్రవారం ముస్లింలు నమాజ్‌ చేస్తుంటారు కదా ఇక రంజాన్ లో చేసే నమాజ్ లకు ఎందుకంత ప్రత్యేకం అంటే ఈ సమయంలో మత పెద్దలతో నమాజ్ చేయిస్తారు. మసీదుకి వెళ్లేలని వారు ఇంటి దగ్గర స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థనలు చేస్తారు. నమాజ్ పూర్తైన తర్వాత  పిల్లలు, పెద్దలు అంతా స్నేహభావంతో  'అలయ్ బలయ్ ' చెప్పుకుంటారు. పండుగ రోజు షీర్‌ ఖుర్మా  అనే వంటాకాన్ని అంతా పంచుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు .

Also Read: కేదార్ నాథ్ ఆలయం తెరిచే డేట్ ఇదే .. శివరాత్రి సందర్భంగా ప్రకటించిన బద్రీనాథ్ - కేదార్నాథ్ బోర్డ్

ఖురాన్ సిద్దాంతాల ప్రకారం ...ప్రతి మనిషి తమ సంపాదనలో ఎంతోకొంత పేదలకు దానం చేయాలి. అందుకే ఈ నెలలో పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం  ఎవరి స్థోమతుకు తగ్గట్టు వాళ్లు దాన ధర్మాలు చేయాలని ఖురాన్ చెబుతోంది. నిరుపేదలు కూడా సంతోషంగా ఉండాలన్నదే ఈ దానాల వెనుకున్న ఆంతర్యం అని మతపెద్దలు చెబుతారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Virat Kohli:విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Embed widget