అన్వేషించండి

Meenakshi Natarajan: జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ - కాంగ్రెస్ క్యాడర్‌కు నినాదమిచ్చిన మీనాక్షి నటరాజన్

Telangana Congress: కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. పేదల కళ్లల్లో ఆనందం చూసేందుకు పని చేయాలన్నారు.

Meenakshi Natarajan AICC:  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలకు మొదటి సందేశం ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రభుత్వం లో ఉన్నాం.. పేద వాడి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. పేదల మొఖంలో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్లని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉంది.. అనేక రకాలుగా పోరాటాలు చేశాము.. అందుకే తెలంగాణ లో అధికారంలోకి వచ్చామన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జొడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారు. మనం దాని కోసం పోరాటం చేయాలన్నారు.              

బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో మనం ఇక్కడ పోరాటం చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చింది... కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయిన సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలన్నారు. పదేళ్లు గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారన్నారు. వారికి న్యాయం జరగాలి.. పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలన్నారు. మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలన్నారు. 

దేశంలో ఎక్కడా లేని విదంగా ఇక్కడ కులగణన చేపట్టాము.. ఇది చాలా గొప్ప విషయమన్నారు. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. 
 ఈ విషయంలో పీసీసీ ఒక పకడ్బందీగా కాలెండర్ సిద్ధం చేయాలన్నారు.            

మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ. ఆమె ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఆమె కోసం ఎవరు ఏమైనా హడావుడి చేసినా అంగీకరించరు. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జా నియమితులు అయిననప్పటికీ .. రైతులలో హైదరాబాద్ వచ్చారు. పీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. ఆమె నాయకత్వం, నిరాండంబరత వల్ల రాహుల్ గాంధీ కి అనుచరురాలిగా గుర్తింపు పొందారు. జాతీయ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఇటీవలి కాలం వరకూ దీపాదాస్ మున్షి ఇంచార్జ్ గా ఉండేవారు. ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం కావడంతో  పార్టీ హైకమాండ్ మార్పు చేసింది. 

మీనాక్షి నటరాజన్ చాలా నిక్కచ్చిగా ఉంటారని..లాబీయింగ్ లాంటి వాటికి అసలు ప్రోత్సహించరని చెబుతారు. పార్టీ కోసం కష్టపడేవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని చెబుతారు. కాకా పట్టి పదవులను సిఫారసు చేయించుకునేవారిని దూరం పెడతారని చెబుతారు. ఈ క్రమంలో ఆమె ఇంచార్జ్ గా రావడంతో కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నాయి.  తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఆమె సేవలు అందించారని.. అభ్యర్థుల మధ్య సమన్వయానికి పని చేశారని రేవంత్ చెబుతున్నారు.  తెలంగాణ రాష్ట్రం మీనాక్షి నటరాజన్ కు కొత్త కాదని.. భావిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Google:  మారనున్న విశాఖ రాత - చరిత్రాత్మక గూగుల్ ఎఐ హబ్ ఒప్పందానికి రంగం సిద్ధం
మారనున్న విశాఖ రాత - చరిత్రాత్మక గూగుల్ ఎఐ హబ్ ఒప్పందానికి రంగం సిద్ధం
EPF Withdraw Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఇక 100 శాతం వరకు విత్‌డ్రాకు అవకాశం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఇక 100 శాతం వరకు విత్‌డ్రా
Bolla Brahma Naidu: ఆడవాళ్లంతా తాగుబోతులే.. నకిలీ మద్యంపై నిరసనలో నోరుజారిన మాజీ ఎమ్మెల్యే !
ఆడవాళ్లంతా తాగుబోతులే.. నకిలీ మద్యంపై నిరసనలో నోరుజారిన మాజీ ఎమ్మెల్యే !
Andhra Liquor Scam: జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
Advertisement

వీడియోలు

Edge Of The Universe Explained : విశ్వానికి ఆది, అంతం తెలుసుకోవటం సాధ్యమేనా..? | ABP Desam
Eiffel Tower Demolition | ఈఫిల్ టవర్ కూల్చివేత | ABP Desam
Smriti Mandhana Records | India vs Australia | స్మృతి మంధానా ఫాస్టెస్ట్ రికార్డ్ | ABP Desam
India vs Australia ODI World Cup | నిరాశపరిచిన భారత్ | ABP Desam
India vs West Indies Test Match | పోరాడుతున్న విండీస్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Google:  మారనున్న విశాఖ రాత - చరిత్రాత్మక గూగుల్ ఎఐ హబ్ ఒప్పందానికి రంగం సిద్ధం
మారనున్న విశాఖ రాత - చరిత్రాత్మక గూగుల్ ఎఐ హబ్ ఒప్పందానికి రంగం సిద్ధం
EPF Withdraw Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఇక 100 శాతం వరకు విత్‌డ్రాకు అవకాశం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఇక 100 శాతం వరకు విత్‌డ్రా
Bolla Brahma Naidu: ఆడవాళ్లంతా తాగుబోతులే.. నకిలీ మద్యంపై నిరసనలో నోరుజారిన మాజీ ఎమ్మెల్యే !
ఆడవాళ్లంతా తాగుబోతులే.. నకిలీ మద్యంపై నిరసనలో నోరుజారిన మాజీ ఎమ్మెల్యే !
Andhra Liquor Scam: జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
జోగి రమేష్ చెబితేనే చేశా - నకిలీ మద్యం కేసులో ఏ1 సంచలన వాంగ్మూలం
Chandrababu meet Modi: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ - కర్నూలు సభకు రావాలని ఆహ్వానం
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ - కర్నూలు సభకు రావాలని ఆహ్వానం
Hyderabad Crime News: కవల పిల్లలను చంపి, బిల్డింగ్ మీద నుంచి దూకిన తల్లి - హైదరాబాద్‌లో విషాదం
కవల పిల్లలను చంపి, బిల్డింగ్ మీద నుంచి దూకిన తల్లి - హైదరాబాద్‌లో విషాదం
Bihar Elections: అందరూ మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తారు.. కానీ ఆయన ఎత్తేస్తామని హామీ ఇస్తారు - బీహార్‌లో కాకరేపుతున్న ప్రశాంత్ కిషోర్
అందరూ మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తారు.. కానీ ఆయన ఎత్తేస్తామని హామీ ఇస్తారు - బీహార్‌లో కాకరేపుతున్న ప్రశాంత్ కిషోర్
Khammam Crime News: బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు, కేసు నమోదుతో పరువుపోయిందని ఆత్మహత్య
బాలుడిపై టీచర్ లైంగిక వేధింపులు, కేసు నమోదుతో పరువుపోయిందని ఆత్మహత్య
Embed widget