అన్వేషించండి

World Kidney Day 2024 : ఈ పనులు రోజూ చేస్తున్నారా? అయితే మీ కిడ్నీలు హాంఫట్

Kidney Problems : రోజూవారీ మనం చేసే కొన్ని పనులు కిడ్నీలపై ఎఫెక్ట్ చూపిస్తాయని మీకు తెలుసా? పైగా సమ్మర్​లో కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ సమయంలో ఏ విధంగా సంరక్షించుకోవాలంటే..

World Kidney Day : మూత్రపిండాలు మొత్తం మీ శరీర వ్యవస్థను ప్రభావితం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి రక్తం నుంచి టాక్సిన్స్, అదనపు నీటిని తొలగిస్తాయి. ఈ ప్రక్రియలో ఏ పొరపాటు జరిగినా.. ఆరోగ్యంలో పెనుమార్పులు వస్తాయి. రక్తపోటును నియంత్రించడానికి, ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉండడంలో కూడా కిడ్నీలు హెల్ప్ చేస్తాయి. సోడియం, పొటాషియంతో సహా అనేక ఖనిజాలు, అణువులు కలిసి రక్త ప్రవాహ స్థాయిలను నియంత్రించేలా చేస్తాయి. అయోడిన్, నీటిని కంట్రోల్ చేసి.. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. 

అందుకే మూత్రపిండాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఏటా మార్చిలో రెండవ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలకు వీటిపై అవగాహన కల్పించి.. ఆరోగ్యాన్ని కాపాడేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తాయి. మీకు తెలుసా రోజూవారీ మనం చేసే కొన్ని పనులు కిడ్నీలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. ఇంతకీ ఆ పనులు ఏంటో.. వాటిని కంట్రోల్ చేసి కిడ్నీలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

హైడ్రేటెడ్​గా ఉండాలి

హైడ్రేటెడ్​గా లేకపోతే మీ కిడ్నీలు ప్రమాదంలో పడ్డట్టే. ముఖ్యంగా ఈ సమస్య సమ్మర్​లో ఎక్కువ ఎదురవుతుంది. కాబట్టి శరీరానికి వీలైనంత లిక్విడ్స్​ను అందించాలి. నీరు శరీరం నుంచి సోడియం, టాక్సిన్స్​ను బయటకు పంపడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు 3 లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి అంటున్నారు వైద్యులు. 

పెయిన్ కిల్లర్స్

కొందరు పెయిన్ కిల్లర్స్​ను బఠాణీలులా వేసేసుకుంటారు. చిన్న నొప్పి వచ్చినా.. పెయిన్ కిల్లర్​ను ఆశ్రయిస్తారు. తలనొప్పి, కీళ్లు నొప్పులకు డాక్టర్ సలహా లేకుండానే పెయిన్ కిల్లర్స్​ను తీసుకునే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ మందులు రెగ్యూలర్​గా తీసుకుంటే.. అవి మీ మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. 

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే.. 

ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు. ఇది రక్తపోటును ప్రభావితం చేస్తుంది. ఇది నేరుగా మూత్రపిండాలను ఎఫెక్ట్ చేస్తుంది. కొందరు టేస్ట్ కోసమని చెప్పి ఉప్పును ఎక్కువ వేసేసుకుంటారు. అలాంటి వారు ప్రత్యామ్నాయాలను చూసుకోవాలి. 

షుగర్ తినడం

చక్కెర ఎక్కువ కలిగిన పదార్థాలు, తీపిగా ఉండే పదార్థాలను కంట్రోల్ చేయాలి. ఇవే కాకుండా కుకీలు, తృణధాన్యాలు వంటివి మధుమేహంతో పాటు ఊబకాయంను పెంచుతాయి. ఇవి మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. 

ఆ ఫుడ్​ వద్దు

ప్రాసెస్ చేసిన ఫుడ్ మొత్తం ఆరోగ్యానికే కాదు.. కిడ్నీలను కూడా బాగా ప్రభావితం చేస్తుంది. సోడియం భాస్వరంతో నిండిన ఫుడ్స్ కిడ్నీలపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ రకమైన ఫుడ్ తీవ్రమైన పరిణామాలకు దారితీసేలా చేస్తుంది. కిడ్నీ సమస్యలు లేకపోయినా.. వాటిని రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలు, బ్లడ్ షుగర్ వంటి సమస్యలు వస్తాయి. 

నిద్ర లేకుంటే..

కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉండాలంటే.. సరైన నిద్ర ఉండాలంటున్నారు. సరైన నిద్ర లేకుండా నిద్ర సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల కిడ్నీలపై పనిభారం పెరుగుతుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. మూత్రపిండాలకు మంచి జరగాలంటే రాత్రి నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. 

స్మోకింగ్ & డ్రింకింగ్ 

గుండె, ఊపిరితిత్తులకే కాదు.. ధూమపానం, మధ్యపానం వల్ల కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ధూమపానం వల్ల మూత్రంలో నుంచి ప్రోటీన్ బయటకి వెళ్లిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి స్మోకింగ్ అలవాటును తగ్గించుకుంటే మంచిది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల త్వరగా డీహైడ్రేట్ అయిపోతారు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కిడ్నీ సమస్యలను పెంచుతాయి. 

ఇవే కాకుండా మాంసం ఎక్కువ తినడం, వ్యాయామం చేయకపోవడం వంటివి కూడా కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ రెగ్యూలర్ యాక్టివిటీలను కంట్రోల్ చేసి.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. 

Also Read : స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget