అన్వేషించండి

Kejriwal: ప్రజలకు డబ్బు ఆశ చూపుతున్నారు.. నేను రాత్రంతా నిద్రపోలేదు: కేజ్రీవాల్​

Delhi Elections 2025 | తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ బీజేపీ గూండాయిజం చేస్తోందని ఆప్‌ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌ విరుచుకుపడ్డారు.

Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నెల 5వ తేదీన అసెంబ్లీ ఎలక్షన్లు జరుగనున్నాయి.  నేపథ్యంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ బీజేపీ, అధికార ఆప్​ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆప్‌ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ బీజేపీ గూండాయిజం చేస్తోందని మండిపడ్డారు. ఓటర్లకు డబ్బులు ఎరగా చూపి ఓట్లు డిమాండ్​ చేస్తున్నారని ఆరోపించారు.

షాక్​కు గురయ్యా..
కేజ్రీవాల్ ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీపై ఫైర్​ అయ్యారు. బీజేపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని స్లమ్స్​ నుంచి అనేక కాల్స్​ రావడం చూసి షాక్​కు గురయ్యానని అన్నారు. ‘స్లమ్స్​లో ఉన్న ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటు వేయాలని, ప్రతిఫలంగా రూ.3,000 తీసుకోవాలని ప్రజలను అడుగుతున్నారు. ఈ విషయంపై స్లమ్స్​ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ఇది విన్న నేను షాక్ అయ్యాను. నిన్న రాత్రంతా నిద్ర పోలేదు’ అని కేజ్రీవాల్ అన్నారు.

బీజేపీ నేతల నుంచి డబ్బులు తీసుకోండి కానీ వారికి ఓటేయొద్దు
బీజేపీ నేతలు ప్రజలను ట్రాప్​ చేసే కుట్ర పన్నుతున్నారని, వారి వలలో పడవద్దని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్​ విజ్ఞప్తి చేశారు. ఓ పెద్దన్నలా మిమ్మల్ని కోరుతున్నానని అన్నారు. వారు చెప్పిన విధంగా డబ్బులు తీసుకొని గనక ఓటు వేస్తే తిరిగి మీమీదే వారు కేసులు పెట్టి అరెస్ట్​ చేయిస్తారని అన్నారు. బీజేపీ నేతల నుంచి డబ్బులు తీసుకోండి కానీ వారికి ఓటు వేయొద్దని ప్రజలకు సూచించారు. 

బెదిరింపులకు మేం భయపడం
‘దిల్లీలో జరిగే ఎన్నికల్లో ఆప్ విజయం దిశగా పయనిస్తోంది. ఇది భాజపా నాయకులను.. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ను నిరాశకు గురిచేస్తోంది. అందుకే ఆ పార్టీ నేతలు ఆప్ కార్యకర్తలపై బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారు.  ఇలాంటి బెదిరింపులకు మేము భయపడం. ఆ పార్టీకి దిల్లీ అభివృద్ధిపై అజెండా లేదు. వారికి కేవలం గూండాయిజం మాత్రమే తెలుసు. దిల్లీ ప్రజలంతా ఎన్నికల్లో భాజపాను ఓడించి బుద్దిచెప్పాలి’ అని ఢిల్లీ మాజీ సీఎం అన్నారు. 

ఎలక్షన్​ కమిషన్​కు లేఖ
తమ పార్టీ నేతలపై బీజేపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఎన్నికల కమిషన్​కు కేజ్రీవాల్​ లేఖ రాశార. ఈ లేఖలో ఆప్ కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలు బెదిరింపులకు గురిచేస్తున్నారని, వారిని వేధిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘మా వాలంటీర్లను బెదిరింపులు, వేధింపులకు గురిచేయడం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నా. శనివారం మా సీనియర్ వాలంటీర్ చేతన్ సెక్షన్ 126 కింద తిలక్ మార్గ్‌లో అతడిని నిర్బంధించారు. అతడిపై కేసు బుక్ చేశారు. ఈ పరిణామాలతో స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్‌కు తరలించారు’ అని లేఖలో పేర్కొన్నారు.

తప్పుడు వార్తలు క్రియేట్​ చేసేందుకు కేజ్రీవాల్​ వెనుకాడడు
కేజ్రీవాల్​ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్​ పాత్రా తీవ్రంగా స్పందించారు. తప్పుడు వార్తలు క్రియేట్​ చేసేందుకు కేజ్రీవాల్​ ఏనాడు వెనకాడడని అన్నారు. ఆయన ప్రభుత్వంలోని ప్రతి డిపార్ట్​మెంట్​లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
Kash Patel as FBI Director: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
Odela 2 Teaser: నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే...  పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే... పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
India vs Pakistan: ఇటీవ‌ల పాక్ పై భార‌త్ దే పైచేయి.. చివ‌రిసారిగా ఇండియా చేతిలో పాక్ ఘోర ప‌రాభవం.. రేప‌టి మ్యాచ్ లో ఓడితే ఇంటికే!
ఇటీవ‌ల పాక్ పై భార‌త్ దే పైచేయి.. చివ‌రిసారిగా ఇండియా చేతిలో పాక్ ఘోర ప‌రాభవం.. రేప‌టి మ్యాచ్ లో ఓడితే ఇంటికే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్
Kash Patel as FBI Director: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు
Odela 2 Teaser: నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే...  పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే... పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
India vs Pakistan: ఇటీవ‌ల పాక్ పై భార‌త్ దే పైచేయి.. చివ‌రిసారిగా ఇండియా చేతిలో పాక్ ఘోర ప‌రాభవం.. రేప‌టి మ్యాచ్ లో ఓడితే ఇంటికే!
ఇటీవ‌ల పాక్ పై భార‌త్ దే పైచేయి.. చివ‌రిసారిగా ఇండియా చేతిలో పాక్ ఘోర ప‌రాభవం.. రేప‌టి మ్యాచ్ లో ఓడితే ఇంటికే!
Amol Palekar: సినిమా అంటే కలెక్షన్లు మాత్రమేనా... ఆర్ఆర్ఆర్, బాహుబలి గురించే ఎందుకు? సౌత్ వర్సెస్ నార్త్ సినిమా గొడవలపై అమోల్ పాలేకర్
సినిమా అంటే కలెక్షన్లు మాత్రమేనా... ఆర్ఆర్ఆర్, బాహుబలి గురించే ఎందుకు? సౌత్ వర్సెస్ నార్త్ సినిమా గొడవలపై అమోల్ పాలేకర్
Hyderabad Crime News: నాంపల్లిలో లిఫ్టులో ఇరుక్కున్న బాలుడు మృతి, సర్జరీ చేసినా విషాదం!
Hyderabad Crime News: నాంపల్లిలో లిఫ్టులో ఇరుక్కున్న బాలుడు మృతి, సర్జరీ చేసినా విషాదం!
Shikhar Dhawan Girl Friend: మిస్ట‌రీ విమెన్ తో ధావ‌న్ చెట్టా ప‌ట్టాల్.. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప‌బ్లిక్ గా క‌నిపించిన ఈ జంట‌.. సోష‌ల్ మీడియాలో పుకార్లు
మిస్ట‌రీ విమెన్ తో ధావ‌న్ చెట్టాప‌ట్టాల్.. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప‌బ్లిక్ గా క‌నిపించిన ఈ జంట‌.. సోష‌ల్ మీడియాలో పుకార్లు
PM Kisan Amount: ప్రతి రైతు ఖాతాలోకి రూ.2,000, రెండు రోజుల్లో డబ్బులు - రెడీగా ఉండండి
ప్రతి రైతు ఖాతాలోకి రూ.2,000, రెండు రోజుల్లో డబ్బులు - రెడీగా ఉండండి
Embed widget