అన్వేషించండి

Kejriwal: ప్రజలకు డబ్బు ఆశ చూపుతున్నారు.. నేను రాత్రంతా నిద్రపోలేదు: కేజ్రీవాల్​

Delhi Elections 2025 | తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ బీజేపీ గూండాయిజం చేస్తోందని ఆప్‌ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌ విరుచుకుపడ్డారు.

Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నెల 5వ తేదీన అసెంబ్లీ ఎలక్షన్లు జరుగనున్నాయి.  నేపథ్యంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ బీజేపీ, అధికార ఆప్​ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆప్‌ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ బీజేపీ గూండాయిజం చేస్తోందని మండిపడ్డారు. ఓటర్లకు డబ్బులు ఎరగా చూపి ఓట్లు డిమాండ్​ చేస్తున్నారని ఆరోపించారు.

షాక్​కు గురయ్యా..
కేజ్రీవాల్ ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీపై ఫైర్​ అయ్యారు. బీజేపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని స్లమ్స్​ నుంచి అనేక కాల్స్​ రావడం చూసి షాక్​కు గురయ్యానని అన్నారు. ‘స్లమ్స్​లో ఉన్న ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటు వేయాలని, ప్రతిఫలంగా రూ.3,000 తీసుకోవాలని ప్రజలను అడుగుతున్నారు. ఈ విషయంపై స్లమ్స్​ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ఇది విన్న నేను షాక్ అయ్యాను. నిన్న రాత్రంతా నిద్ర పోలేదు’ అని కేజ్రీవాల్ అన్నారు.

బీజేపీ నేతల నుంచి డబ్బులు తీసుకోండి కానీ వారికి ఓటేయొద్దు
బీజేపీ నేతలు ప్రజలను ట్రాప్​ చేసే కుట్ర పన్నుతున్నారని, వారి వలలో పడవద్దని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్​ విజ్ఞప్తి చేశారు. ఓ పెద్దన్నలా మిమ్మల్ని కోరుతున్నానని అన్నారు. వారు చెప్పిన విధంగా డబ్బులు తీసుకొని గనక ఓటు వేస్తే తిరిగి మీమీదే వారు కేసులు పెట్టి అరెస్ట్​ చేయిస్తారని అన్నారు. బీజేపీ నేతల నుంచి డబ్బులు తీసుకోండి కానీ వారికి ఓటు వేయొద్దని ప్రజలకు సూచించారు. 

బెదిరింపులకు మేం భయపడం
‘దిల్లీలో జరిగే ఎన్నికల్లో ఆప్ విజయం దిశగా పయనిస్తోంది. ఇది భాజపా నాయకులను.. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ను నిరాశకు గురిచేస్తోంది. అందుకే ఆ పార్టీ నేతలు ఆప్ కార్యకర్తలపై బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారు.  ఇలాంటి బెదిరింపులకు మేము భయపడం. ఆ పార్టీకి దిల్లీ అభివృద్ధిపై అజెండా లేదు. వారికి కేవలం గూండాయిజం మాత్రమే తెలుసు. దిల్లీ ప్రజలంతా ఎన్నికల్లో భాజపాను ఓడించి బుద్దిచెప్పాలి’ అని ఢిల్లీ మాజీ సీఎం అన్నారు. 

ఎలక్షన్​ కమిషన్​కు లేఖ
తమ పార్టీ నేతలపై బీజేపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఎన్నికల కమిషన్​కు కేజ్రీవాల్​ లేఖ రాశార. ఈ లేఖలో ఆప్ కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలు బెదిరింపులకు గురిచేస్తున్నారని, వారిని వేధిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘మా వాలంటీర్లను బెదిరింపులు, వేధింపులకు గురిచేయడం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నా. శనివారం మా సీనియర్ వాలంటీర్ చేతన్ సెక్షన్ 126 కింద తిలక్ మార్గ్‌లో అతడిని నిర్బంధించారు. అతడిపై కేసు బుక్ చేశారు. ఈ పరిణామాలతో స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్‌కు తరలించారు’ అని లేఖలో పేర్కొన్నారు.

తప్పుడు వార్తలు క్రియేట్​ చేసేందుకు కేజ్రీవాల్​ వెనుకాడడు
కేజ్రీవాల్​ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్​ పాత్రా తీవ్రంగా స్పందించారు. తప్పుడు వార్తలు క్రియేట్​ చేసేందుకు కేజ్రీవాల్​ ఏనాడు వెనకాడడని అన్నారు. ఆయన ప్రభుత్వంలోని ప్రతి డిపార్ట్​మెంట్​లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

టాప్ హెడ్ లైన్స్

Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget