అన్వేషించండి

Andhra Pradesh: కృష్ణలో కనిపించని నీటి జాడ - ఆలమట్టిలో జీరో టీఎంసీ - దశాబ్ధం నాటి సంక్షోభం పునరావృతయ్యే ప్రమాదం!

Andhra Pradesh: కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేక మరోసారి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బేసిన్ చాలా కీలకం. అయితే ఈ ఏడాది కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేక గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ సమయానికి 25 -30 టీఎంసీల నీరు వచ్చేది. తర్వాత కాస్త ఆలస్యం అయినా వందకు పైగా టీఎంసీలు వచ్చేవి. అలా ఆగస్టు మొదటి వారంలో దిగువకు నీటిని విడుదల చేసేవారు. జులై నెల ప్రారంభంలో ఎంత తక్కువ అయినా 30 టీఎంసీల ప్రవాహం వచ్చేది. కానీ ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి దారుణంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే దశాబ్దం నాటి సంక్షోభం పునరావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం మొదలై 40 రోజులు కావొస్తుంది. అయినా కృష్ణా నదిలోకి చుక్క నీరు కూడా రాలేదు. ఆలమట్టిలోకి ఇప్పటి వకు వచ్చిన నీరు జీరో టీఎంసీ.. అంటే నీటి ప్రవాహం శూన్యం. మొత్తానికి నీరు రాకపోవడం ఆలమట్టి నిర్మించిన తర్వాత ఇదే మొదటిసారి. 

ఈ ఏడాది పరిస్థితి దారుణం

తెలంగాణలోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి.. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా తదితర ప్రాజెక్టులు.. కృష్ణానదిపై ఆధారపడి ఉన్నాయి. వీటికి శ్రీశైలం, జురాల, నాగార్జున సాగర్ మీదుగా ప్రవాహం వస్తుంది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించగా.. ఇందులో 450 టీఎంసీలు ఎగువ నుంచి రాష్ట్ర ప్రాజెక్టులకు రావాలి. ప్రత్యేకించి ఆలమట్టి నుంచి ఎక్కువగా, తుంగభద్ర నుంచి కొంత రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల్లోకి అసలు ప్రవాహం లేకపోవడం, నీటి జాడ కానరాకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నామని నీటి పారుదల శాఖ వర్గాలు అంటున్నాయి.

Also Read: Student Accommodation: హలో స్టూడెంట్స్! హాస్టల్‌లో జాయిన్ అవబోతున్నారా? వీటి గురించి తప్పక తెలుసుకోండి

ఆలమట్టికి ఇప్పటి వరకు చుక్కనీరు రాలేదు

2002-03, 2003-04, 2015-16 సంవత్సరాల్లో కృష్ణా బేసిన్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం అప్పటికంటే దయనీయంగా ఉంది పరిస్థితి. కృష్ణా నది కర్ణాటక దాటిన తర్వాత మొదట తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు ఉన్నా.. దీని సామర్థ్యం తక్కువ కాబట్టి దీనికి దిగువన ఉన్న ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. శ్రీశైలం సామర్థ్యం 215 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు జలవిద్యుత్తుకు, సాగునీటి అవసరాలకు కీలకం. ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన నీరు దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు చేరుతాయి. అలా నాగార్జున సాగర్ కు చేరాలంటే.. శ్రీశైలం జలాశయానికి కనీసం 100 టీఎంసీలు అయినా రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు శ్రీశైలం జలాశయానికి వచ్చిన ప్రవాహం కేవలం 1.3 టీఎంసీలు మాత్రమే. గతంలోనూ శ్రీశైలం ప్రాజెక్టు ఇలాంటి దయనీయ పరిస్థితి ఎదుర్కొంది. కానీ అప్పుడు ఆలమట్టి జలాశయానికి కొంతలో కొంత ప్రవాహం వచ్చింది. కానీ ఈ ఏడాది మాత్రం ఆలమట్టికి చుక్కనీరు రాలేదు. ఈ ఏడాది పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఆలమట్టిలో ప్రవాహం మొదలైతే గానీ అంచనా వేయలేమని అధికారులు అంటున్నారు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Virat Kohli : ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Embed widget