అన్వేషించండి

Andhra Pradesh: కృష్ణలో కనిపించని నీటి జాడ - ఆలమట్టిలో జీరో టీఎంసీ - దశాబ్ధం నాటి సంక్షోభం పునరావృతయ్యే ప్రమాదం!

Andhra Pradesh: కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేక మరోసారి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బేసిన్ చాలా కీలకం. అయితే ఈ ఏడాది కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేక గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ సమయానికి 25 -30 టీఎంసీల నీరు వచ్చేది. తర్వాత కాస్త ఆలస్యం అయినా వందకు పైగా టీఎంసీలు వచ్చేవి. అలా ఆగస్టు మొదటి వారంలో దిగువకు నీటిని విడుదల చేసేవారు. జులై నెల ప్రారంభంలో ఎంత తక్కువ అయినా 30 టీఎంసీల ప్రవాహం వచ్చేది. కానీ ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి దారుణంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే దశాబ్దం నాటి సంక్షోభం పునరావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం మొదలై 40 రోజులు కావొస్తుంది. అయినా కృష్ణా నదిలోకి చుక్క నీరు కూడా రాలేదు. ఆలమట్టిలోకి ఇప్పటి వకు వచ్చిన నీరు జీరో టీఎంసీ.. అంటే నీటి ప్రవాహం శూన్యం. మొత్తానికి నీరు రాకపోవడం ఆలమట్టి నిర్మించిన తర్వాత ఇదే మొదటిసారి. 

ఈ ఏడాది పరిస్థితి దారుణం

తెలంగాణలోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి.. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా తదితర ప్రాజెక్టులు.. కృష్ణానదిపై ఆధారపడి ఉన్నాయి. వీటికి శ్రీశైలం, జురాల, నాగార్జున సాగర్ మీదుగా ప్రవాహం వస్తుంది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించగా.. ఇందులో 450 టీఎంసీలు ఎగువ నుంచి రాష్ట్ర ప్రాజెక్టులకు రావాలి. ప్రత్యేకించి ఆలమట్టి నుంచి ఎక్కువగా, తుంగభద్ర నుంచి కొంత రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల్లోకి అసలు ప్రవాహం లేకపోవడం, నీటి జాడ కానరాకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నామని నీటి పారుదల శాఖ వర్గాలు అంటున్నాయి.

Also Read: Student Accommodation: హలో స్టూడెంట్స్! హాస్టల్‌లో జాయిన్ అవబోతున్నారా? వీటి గురించి తప్పక తెలుసుకోండి

ఆలమట్టికి ఇప్పటి వరకు చుక్కనీరు రాలేదు

2002-03, 2003-04, 2015-16 సంవత్సరాల్లో కృష్ణా బేసిన్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం అప్పటికంటే దయనీయంగా ఉంది పరిస్థితి. కృష్ణా నది కర్ణాటక దాటిన తర్వాత మొదట తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు ఉన్నా.. దీని సామర్థ్యం తక్కువ కాబట్టి దీనికి దిగువన ఉన్న ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. శ్రీశైలం సామర్థ్యం 215 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు జలవిద్యుత్తుకు, సాగునీటి అవసరాలకు కీలకం. ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన నీరు దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు చేరుతాయి. అలా నాగార్జున సాగర్ కు చేరాలంటే.. శ్రీశైలం జలాశయానికి కనీసం 100 టీఎంసీలు అయినా రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు శ్రీశైలం జలాశయానికి వచ్చిన ప్రవాహం కేవలం 1.3 టీఎంసీలు మాత్రమే. గతంలోనూ శ్రీశైలం ప్రాజెక్టు ఇలాంటి దయనీయ పరిస్థితి ఎదుర్కొంది. కానీ అప్పుడు ఆలమట్టి జలాశయానికి కొంతలో కొంత ప్రవాహం వచ్చింది. కానీ ఈ ఏడాది మాత్రం ఆలమట్టికి చుక్కనీరు రాలేదు. ఈ ఏడాది పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఆలమట్టిలో ప్రవాహం మొదలైతే గానీ అంచనా వేయలేమని అధికారులు అంటున్నారు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget