అన్వేషించండి
Nagoba Jatara : నాగోబా జాతర ప్రధాన ఘట్టం పూర్తి- మెస్రం వంశీయులు గంగాజలం ఎలా సేకరిస్తారంటే..!
Nagoba Jatara : కేస్లాపూర్ నాగోబా జాతర ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు పూర్తి చేశారు. పుష్యమాసంలో నేలవంక దర్శనం అయ్యాక సమావేశమైన మెస్రం వంశీయులు ఎడ్ల బండి ద్వారా ఏడు రోజులపాటు ప్రచారం నిర్వహిస్తారు.

నాగోబా జాతర
1/27

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని గోదావరినదిలో గల హస్తలమడుగు వద్దకు మెస్రం వంశీయులు చేరుకున్నారు.
2/27

నాగోబా అభిషేకం కోసం పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు ఈనెల 10న కేస్లాపూర్ గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరారు.
3/27

17వ తేదీ నాడు హస్తలమడుగు వద్దకు చేరుకొని గోదారమ్మకు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
4/27

సాంప్రదాయ రీతిలో ఇంటింటా దంపుడు బియ్యం మినుము పెసర్లు బెల్లం ఇతర పూజా సామాగ్రితో ఒకే చోట వేసి గోదావరిలో స్నానాలు ఆచరించి, మొక్కుకున్నారు.
5/27

నైవేద్యాలను, భోజనాలను తయారు చేసి ముందుగా సాంప్రదాయ రీతిలో అందరూ ఏకతాటిపై వచ్చి గోదారమ్మకు నైవేద్యం సమర్పించి భోజనాలు చేశారు.
6/27

ఆపై నాగోబా అభిషేకం కోసం పవిత్ర గంగాజలన్నీ సేకరించే కలిశానికి పూజలు చేశారు.
7/27

ముందుగా వాటిని శుభ్రపరచి పాతనిళ్లను గోదావరిలో కలిపి, పూజలు చేసి, ఆపై కటోడ ప్రధాన్ ఇద్దరు కలిసి కలిశాన్ని హస్తలమడుగులో ముంచి పవిత్ర గంగాజలాన్ని కలిశములో సేకరించారు.
8/27

గోదారమ్మకు దండం పెట్టి ఈ కలిశాన్ని ఒడ్డుపైకి తీసుకువచ్చి ధూప నైవేద్యం సమర్పించారు.
9/27

పవిత్ర గంగాజలన్నీ మోసే కటోడ భుజానికి నూతన వెదురు కర్రను పెట్టి దానికి కలశంలోని నీరు కిందకు పడకుండా బిగించారు.
10/27

పురాతన కర్రను హస్తలమడుగులో వదిలేశారు. ఆపై అందరూ గోదారమ్మను నమస్కరించి మొక్కారు.
11/27

పవిత్ర గంగాజలంతో నాగోబా అభిషేకం కోసం బయలుదేరుతున్నాం మా పాదయాత్రను నువ్వు సాఫీగా కొనసాగించేలా చూడు తల్లి అంటూ ఇక బయలుదేరుతాం అంటూ తెల్లని దుస్తులను ధరించి అందరూ ఒకే వరుసలో కేస్లాపూర్ కు తిరుగుపయనమయ్యారు.
12/27

పాదయాత్రగా కేస్లాపూర్ కు మెస్రం వంశీయులు బయలుదేరారు.
13/27

పాదయాత్రను అలాగే కొనసాగిస్తూ ఈనెల 24వ తేదీన ఇంద్రవెల్లికి చేరుకొని ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
14/27

అక్కడ కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లతో సమావేశమై అందరూ కలిసి కేస్లాపూర్ కు చేరుకోనున్నారు.
15/27

అదే రోజు మర్రి చెట్ల వద్దకు చేరుకొని, నాలుగు రోజులపాటు సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించి, ఈనెల 28వ తేదీన అమావాస్య రోజు అర్ధరాత్రి హస్తలమడుగులో సేకరించిన పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి, మహాపూజను ప్రారంభించనున్నారు.
16/27

నాగోబా మహాపూజతో కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభం కానుంది.
17/27

ఈ నాగోబా జాతర వారం రోజులపాటు అంగరంగ వైభవంగా కన్నుల పండువగా కొనసాగనుంది.
18/27

రాష్ట్రంలోనే సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో పెద్ద జాతరే ఈ నాగోబా జాతర,
19/27

ఈ జాతరకు మన రాష్ట్రం నుంచి కాకుండా పక్కనున్న మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గడ్ ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు, మేస్రం వంశీయులు తరలిరానున్నారు.
20/27

పుష్యమాసంలో నేలవంక దర్శనం అయ్యాక సమావేశమైన మెస్రం వంశీయులు ఎడ్ల బండి ద్వారా ఏడు రోజులపాటు ప్రచారం నిర్వహిస్తారు.
21/27

హస్తలమడుగు వద్ద గోదారమ్మకు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
22/27

కలిశంలో పవిత్ర గంగాజలంను సేకరించి కేస్లాపూర్కు తిరిగి ప్రయాణమయ్యారు.
23/27

నాగోబా అభిషేకం కోసం పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు ఈనెల 10న కేస్లాపూర్ గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరారు.
24/27

కేస్లాపూర్ నాగోబా జాతర ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు పూర్తి చేశారు.
25/27

కేస్లాపూర్ నాగోబా జాతర ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు పూర్తి చేశారు.
26/27

కేస్లాపూర్ నాగోబా జాతర ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు పూర్తి చేశారు.
27/27

కేస్లాపూర్ నాగోబా జాతర ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు పూర్తి చేశారు.
Published at : 17 Jan 2025 11:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
ఐపీఎల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion