Hyderabad Crime News: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
Hyderabad MMTS Train | హైదరాబాద్లో దారుణం జరిగింది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా కనిపించిన యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆమె రైలు నుంచి దూకేసింది.

Hyderabad News | హైదరాబాద్: మహిళలకు పబ్లిక్ ప్లేస్ లో కూడా రక్షణ లేకుండా పోతోంది. వారిపై ఎక్కడపడితే అక్కడ దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు (Hyderabad MMTS Train)లో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. నిందితుడ్ని ప్రతిఘటించిన యువతి, అతడి బారి నుంచి తప్పించుకునే క్రమంలో కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో బాధితురాలికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి జాబ్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఆమె మేడ్చల్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. తన సెల్ ఫోన్ పాడవడంతో, రిపేర్ చేయించడానికి సికింద్రాబాద్కు వెళ్ళింది. రిపేర్ పని పూర్తవడంతో యువతి సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్ రైల్లో మేడ్చల్ కు బయలుదేరింది. ఆ యువతి మహిళల కోచ్లోనే ఎక్కి ప్రయాణించగా.. అల్వాల్ స్టేషన్ రావడంతో అందులో ఉన్న ఇద్దరు మహిళలు దిగిపోయారు. అదే బోగిలోకి ఎక్కిన 25 ఏళ్ల యువకుడు ఆమెపై ఒంటరిగా ఉండటం అదనుగా భావించి లైంగిక దాడికి ప్రయత్నించాడు. తనపై యువకుడు అత్యాచారయత్నం చేయడంతో ప్రతిఘటించిన బాధితురాలు తప్పించుకునేందుకు రైలు నుంచి దూకేసింది. కొంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడిన యువతీకి గాయాలు కాగా చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలను అడిగి నిందితుడు గురించి వివరాలు ఆరా తీశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

